breaking news
Mahesh Achanta
-
నేనే మీకు నిజం చెబుతాను.. కమెడియన్ షాకింగ్ వీడియో
'జబర్దస్త్' షోతో కమెడియన్గా గుర్తింపు తెచ్చుకుని రంగస్థలం, మహానటి తదితర సినిమాల్లో మంచి పాత్రలు చేసిన మహేశ్.. రీసెంట్గా 'సింగ్ గీతం'లోనూ నటించాడు. ఇదంతా పక్కనబెడితే మరి ఏమైందో ఏమో సడన్గా ఓ వీడియో పోస్ట్ చేశాడు. తాను నిజం చెప్పేవరకు ఎవరు ఏం రాయొద్దని అన్నాడు.'లైఫ్ చాలా అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఎవరకు ఏమవుతుందో తెలీదు. మనం బయట చూసిన దానిబట్టి ఏవేవో ఊహించుకుని నమ్మేయడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా రిపోర్టర్స్, మీమర్స్.. నేను నిజం చెప్పేవరకు మీరు అనుకున్నది రాయొద్దు. త్వరలో మొత్తం నేనే మీకు నిజం చెబుతాను' కమెడియన్ మహేశ్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: అలాంటి సమాజంలో మనం ఉన్నాం.. సింగర్ సునీత క్లారిటీ)అయితే మహేశ్ చెబుతున్నది తన జీవితం గురించా? లేదంటే కొత్త సినిమా ప్రమోషనా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ మధ్య పలువురు సినిమా ఇండస్ట్రీ వాళ్లు.. ఏదో జరిగిపోతుంది? ఏదో అయిపోతుంది అన్నట్లు హంగామా సృష్టించడం, తీరా చూస్తే అది మూవీ లేదా సోషల్ మీడియా ప్రమోషన్ అని బయటపడుతుంది. మరి మహేశ్ కూడా అదే చేశాడా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్) View this post on Instagram A post shared by Mahesh Achanta (@mahesh_achanta) -
గుడ్న్యూస్ చెప్పిన 'రంగస్థలం' నటుడు.. బేబీ బంప్తో భార్య!
బుల్లితెర షో ద్వారా కమెడియన్గా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మహేశ్ ఆచంట (Mahesh Achanta). జబర్దస్త్ కామెడీతో సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నాడు. శతమానం భవతి చిత్రంతో క్లిక్ అయ్యాడు. రంగస్థలం సినిమాతో టాప్ ఆర్టిస్ట్గా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత అతడు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అప్పటినుంచి రంగస్థలం మహేశ్గా స్థిరపడిపోయాడు.సినిమామహానటి, యాత్ర, మహర్షి, గుణ 369, గుంటూరుకారం, జాతిరత్నాలు, విరూపాక్ష, సీతారామం, తండేల్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సెటిలయ్యాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మహేశ్.. బంధువులమ్మాయి పావనిని వివాహమాడాడు. 2020లో లాక్డౌన్లోనే వీరి పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఓ కూతురు సంతానం.గుడ్న్యూస్తాజాగా మహేశ్ ఆచంట ఓ గుడ్న్యూస్ చెప్పాడు. రెండోసారి తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. భార్య మెటర్నటీ ఫోటోషూట్లో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. ఇది చూసిన తారలు, అభిమానులు మహేశ్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by kidsography by Nikhil Ronald (@kidsography_by_nikhil_ronald) చదవండి: బాలీవుడ్లో నన్ను గ్లామర్ డాల్గానే చూస్తున్నారు: పూజా హెగ్డే


