breaking news
Madhya Pradesh Cricket Association
-
రూ. 4 వేల కోట్ల ప్యాలెస్.. 560 కిలోల బంగారం, వెండి రైలు, రథం
రాజకుటుంబాలకు విలాసవంతమైన జీవితం కొత్తకాదు. గోల్డెన్ స్పూన్తో పుట్టిన వారికి చిటికేస్తే సకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.. అడుగు కదపకుండానే కోరుకున్నవన్నీ కాళ్ల దగ్గరకు వచ్చేస్తాయి. అయితే, ఆ హోదాను, ముద్రను దాటి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొంతమంది వ్యక్తుల్లో 29 ఏళ్ల మహాన్ ఆర్యమన్ సింధియా ఒకడు.క్రికెట్ ప్రపంచంలో ఈ రాజకుమారుడు సరికొత్త అధ్యాయం లిఖించాడు. అత్యంత పిన్న వయసులో ఓ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. తాత, తండ్రి బాటలో నడుస్తూ ఇటీవలే మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) అధ్యక్షుడిగా ఆర్యమన్ ఎంపికయ్యాడు.ఇంతకీ ఎవరీ ఆర్యమన్?గ్వాలియర్లోని సింధియా రాజకుటుంబ వారసుడు మహాన్ ఆర్యమన్. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య కుమారుడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన రాజవంశీకుడు మాధవరావు సింధియా మనుమడు.ఉన్నత విద్యావంతుడిగా..డోహ్రాడూన్లోని డూన్ పాఠశాలలో 2008- 2014 మధ్య మహాన్ ఆర్యమన్ విద్యనభ్యసించాడు. 2019లో అమెరికాలోని యేల్ యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ సాధించాడు. అంతేకాదు.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అంతర్జాతీయ వ్యవహారాలు, సంబంధాల గురించి అధ్యయనం చేశాడు.వ్యాపారవేత్తగా మారి..2014లో భూటాన్ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ సెంటర్లో మహాన్ ఆర్యమన్ ఇంటర్న్షిప్ చేశాడు. ఆ తర్వాత న్యూఢిల్లీలో ఆర్థిక శాఖలో, లండన్లోని క్రిస్టీలో ఇంటర్న్గా ఉన్నాడు. సాఫ్ట్బ్యాంకు, న్యూయార్క్లోని మార్కో అడ్వైజరీ పార్ట్నర్స్లోనూ పనిచేశాడు.ఇక 2019 నుంచి 2021 వరకు ముంబైలోని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపులో మహాన్ ఆర్యమన్ అసోసియేట్గా సేవలు అందించాడు. ఆ తర్వాత 2021- 2024 వరకు అండర్సౌండ్స్ ఎంటర్టైన్మెంట్స్, జై విలాస్ ప్యాలెస్ డైరెక్టర్గా పనిచేశాడు. కాగా 2022లో మహాన్ ఆర్యమన్ కుబేర్ ఏఐని.. ఆ తర్వాత రెండేళ్లకు ఇతారా ఏఐని లాంచ్ చేశాడు.క్రికెట్ పరిపాలనా విభాగంలో..గ్వాలియర్ డివిజన్ క్రికెట్ అసోసియేషన్ (GDCA) ఉపాధ్యక్షుడిగా మహాన్ ఆర్యమన్ 2022లో ఎన్నికయ్యాడు. అదే విధంగా మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్లోనూ అతడు శాశ్వత సభ్యత్వం పొందాడు. ఇక 2024లో మధ్యప్రదేశ్ క్రికెట్ లీగ్ను ఆరంభించిన మహాన్ ఆర్యమన్.. 2025లో ఎంపీసీఏ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.ఈ రాజకుటుంబం విలాసాలకు చిరునామాసింధియా కుటుంబం గ్వాలియర్లోని జై విలాస్ ప్యాలెస్లో నివసిస్తోంది. దాదాపు పదిహేను ఎకరాల్లో విస్తరించిన ఈ రాజభవనం విలువ రూ. 4 వేల కోట్లకు పైమాటే అని అంచనా.ఇందులో నాలుగు వందలకు పైగా గదులు ఉన్నట్లు సమాచారం.అంతేకాదు.. సుమారు 560 కిలోల బంగారాన్ని వివిధ ఆకృతుల్లో వాడినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. విలాసవంతమైన ఈ భారీ ప్యాలెస్లో ఫ్రెంఛ్, పర్షియన్ ఆర్ట్క్రాఫ్ట్లు ఎన్నో ఉన్నాయి.ఇక ఈ రాజభవంలోని డైనింగ్ హాల్లో వెండి రైలును ఇప్పటికీ ఉపయోగిస్తారట. టేబుల్పై ఓ వెండి రథం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. దాదాపు ఎనిమిది ఏనుగుల బరువుకు సరితూగే బరువుతో ఇక్కడి పైకప్పును పరీక్షించి.. భారీ, అందమైన షాండ్లియర్ను వేలాడదీసినట్లు కథనాలు ఉన్నాయి.చదవండి: ఇంకెంత రెస్ట్ కావాలి: రోహిత్పై గంభీర్ ఫైర్.. నాడు.. View this post on Instagram A post shared by 𝗝𝗮𝗶 𝗩𝗶𝗹𝗮𝘀 𝗣𝗮𝗹𝗮𝗰𝗲 (@gwaliorpalace) -
Mahanaryaman: 29 ఏళ్లకే క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ’రాజ కుమారుడు’
ఇండోర్: మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం (MPCA) అధ్యక్షుడిగా మహాన్ ఆర్యమన్ సింధియా (Mahanaryaman Scindia) ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు. ‘సింధియా’ రాజ కుటుంబానికి చెందిన 29 ఏళ్ల ఆర్యమన్ ఎంపీసీఏ అధ్యక్ష పదవి చేపట్టనున్న అతి పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, దివంగత మాధవ్రావ్ సింధియా మనవడు, ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుమారుడైన ఆర్యమన్ గత మూడేళ్లుగా క్రికెట్ పరిపాలనలో చురుగ్గా పాలుపంచుకుంటున్నాడు. గ్వాలియర్ జిల్లా క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడైన ఆర్యమన్కు ఎంపీసీఏలో జీవితకాల సభ్యత్వం ఉంది. గత ఏడాది కొత్తగా మొదలు పెట్టిన మధ్యప్రదేశ్ టి20 లీగ్కు ఆర్యమన్ అధ్యక్షుడిగా ఉంటూ టోర్నీ నిర్వహణలో కీలక పాత్ర పోషించాడు. సుదీర్ఘ కాలంగా ఎంపీసీఏలో సింధియాల పట్టు కొనసాగుతోంది. మాధవ్రావ్ సింధియా తర్వాత ఆయన కుమారుడు జ్యోతిరాదిత్య అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించగా, ఇప్పుడు మూడో తరానికి చెందిన ఆర్యమన్ పదవిలోకి వచ్చాడు. ఇక 2010లో మాత్రమే జ్యోతిరాదిత్యను ఓడించేందుకు నాటి రాష్ట్ర మంత్రి కైలాష్ విజయ్వర్గియ పోటీలో నిలిచినా... చివరకు ఓటమి తప్పలేదు. తొమ్మిదేళ్ల పదవీకాలం పూర్తి కావడంతో లోధా కమిటీ సిఫారసుల ప్రకారం జ్యోతిరాదిత్య 2017లో ఎంపీసీఏ నుంచి తప్పుకొన్నారు. ఇదీ చదవండి: టీ20 సిరీస్ బంగ్లాదేశ్ సొంతం సిల్హెట్: సొంతగడ్డపై నెదర్లాండ్స్తో జరిగిన టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో బంగ్లాదేశ్ గెలుచుకుంది. సోమవారం జరిగిన రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన నెదర్లాండ్స్ 17.3 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. ఆర్యన్ దత్ (24 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్), వికమ్ర్జిత్ సింగ్ (17 బంతుల్లో 24; 4 ఫోర్లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. గత మ్యాచ్లో రాణించిన తేజ నిడమనూరు (0) ఈసారి తొలి బంతికే వెనుదిరిగాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నసుమ్ అహ్మద్ (3/21) డచ్ టీమ్ను దెబ్బ తీయగా... ముస్తఫిజుర్, మహేదీ హసన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ 13.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 104 పరుగులు సాధించింది. పర్వేజ్ హుసేన్ (23) తొందరగానే వెనుదిరగ్గా... తన్జీద్ హసన్ (40 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ లిటన్ దాస్ (18 నాటౌట్) రెండో వికెట్కు 46 బంతుల్లో అభేద్యంగా 64 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. మూడో టీ20 ఇదే మైదానంలో బుధవారం జరుగుతుంది. చదవండి: షాకింగ్ నిర్ణయం తీసుకున్న మిచెల్ స్టార్క్ -
అభిషేక్ విధ్వంసం.. 33 బంతుల్లోనే సెంచరీ! 15 సిక్స్లతో
మధ్యప్రదేశ్ లీగ్ (MPL) 2025లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరాభిమాని అభిషేక్ పాఠక్ విధ్వంసం సృష్టించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం వేదికగా జబల్పూర్ రాయల్ లయన్స్, బుందేల్ఖండ్ బుల్స్ జట్లు తలపడ్డాయి.ఈ మ్యాచ్లో బుందేల్ఖండ్ బుల్స్కు ప్రాతినిథ్యం వహించిన అభిషేక్ పాఠక్.. కేవలం 33 బంతుల్లో సెంచరీ చేసి అందరని ఆశ్చర్యపరిచాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన అభిషేక్.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. తన విధ్వంసకర బ్యాటింగ్తో మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు.అతడిని ఆపడం ఎవరిని తరం కాలేదు. అభిషేక్ ఓవరాల్గా 48 బంతుల్లో15 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 133 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ కరణ్ తహిలియానితో కలిసి మొదటి వికెట్కు 178 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన బుందేల్ఖండ్ బుల్స్ 246 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో జబల్పూర్ జట్టు 227 పరుగులకే పరిమితమైంది. దీంతో 19 పరుగుల తేడాతో బుందేల్ఖండ్ విజయం సాధించింది."నేను 13 ఏళ్ల వయస్సు నుంచి క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. ఇప్పటివరకు అండర్-16, అండర్-19, అండర్-23 స్దాయిలో మధ్యప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించాను. అంతేకాకుండా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఆడాను నా ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొన్నాను.నేను ఈ స్దాయికి చేరుకోవడానికి మద్దతుగా నిలిచిన నా తల్లిదండ్రులకు, నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. సూర్యకుమార్ యాదవ్ అంటే నాకు ఎంతో ఇష్టం. సూర్యకుమార్ యాదవ్ లాగా స్థిరత్వం నేర్చుకోవాలనుకుంటున్నాను. ఆ దిశగా నేను నిరంతరం కృషి చేస్తున్నాను" అని మ్యాచ్ అనంతరం అభిషేక్ పాఠక్ పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన అభిషేక్.. 229 పరుగులు చేశాడు.వైభవ్ సూర్యవంశీ రికార్డు బ్రేక్..ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో మెరిసిన అభిషేక్ పాఠక్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యంతవేగవంతమైన సెంచరీ చేసిన మూడో ఇండియన్ క్రికెటర్గా అభిషేక్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరిట ఉండేది. ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్పై సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ చేశాడు. తాజా ఇన్నింగ్స్తో సూర్యవంశీ రికార్డును పాఠక్ బ్రేక్ చేశాడు.టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ప్లేయర్లు వీరేఉర్విల్ పటేల్- 28 బంతులుఅభిషేక్ శర్మ- 28 బంతులురిషబ్ పంత్- 32 బంతులుఅభిషేక్ పాఠక్-33 బంతులువైభవ్ సూర్యవంశీ- 35 బంతులు View this post on Instagram A post shared by SportsTiger (@sportstiger_official) -
ఐపీఎల్లో అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే! ఆ జట్టు కెప్టెన్గా వెంకటేశ్ అయ్యర్?
మధ్యప్రదేశ్ లీగ్(MPL) రెండో ఎడిషన్కు సర్వం సిద్దమైంది. ఈ ఏడాది ఎంపీఎల్ సీజన్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. అయితే తొలి ఎడిషన్లో కేవలం ఐదు జట్లు మాత్రమే పోటీ పడగా.. ఇప్పుడు మరో రెండు ఫ్రాంచైజీలు ఇండోర్ పింక్ పాంథర్స్, చంబల్ ఘరియల్స్ కొత్తగా చేరాయి.ఈ టోర్నీలో ఫ్రాంచైజీ ఇండోర్ పింక్ పాంథర్స్తో కోల్కతా నైట్రైడర్స్ స్టార్ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ జతకట్టాడు. గత సీజన్లో గ్వాలియర్ చీతాస్కు ప్రాతినిథ్యం వహించిన అయ్యర్.. ఇప్పుడు పింక్ పాంథర్స్కు ఆడనున్నాడు.అంతేకాకుండా తమ జట్టు కెప్టెన్సీని వెంకటేశ్ అయ్యర్కు అప్పగించాలని పాంథర్స్ యాజమాన్యం భావిస్తోంది. అతడి ఎంపికపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఎంపీఎల్-2024లో 8 మ్యాచ్లలో 58.57 సగటుతో 480 పరుగులు చేశాడు.ఐపీఎల్-2025లో ఫెయిల్..కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మాత్రం వెంకటేశ్ అయ్యర్ తీవ్రనిరాశపరిచాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన మూడో ఆటగాడిగా నిలిచిన అయ్యర్.. ఏ మాత్రం తన ధరకు న్యాయం చేయలేకపోయాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో అయ్యర్ను రూ.23.75 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. సీజన్ మొత్తంలో అతడు 11 మ్యాచ్లలో 7 ఇన్నింగ్స్లు మాత్రమే ఆడి, 142 పరుగులు చేశాడు. మిగిలిన రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమయ్యాడు.చదవండి: WTC final: 'చోకర్స్ ట్యాగ్ను చెరిపేయాలి'.. సౌతాఫ్రికాకు బౌచర్ పిలుపు -
మహిళా క్రికెటర్ ను వేధించిన బోర్డు అధికారిపై కేసు
పద్దెనిమిదేళ్ల మహిళా క్రికెటర్ పై ఓ క్రికెట్ అసోసియేషన్ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే వార్త క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు రేపింది. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపీసీఏ) ప్రధాన కార్యదర్శి అల్పేష్ షాపై లైంగిక వేధింపుల పాల్పడ్డారని మహిళా క్రికెటర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎంపీసీఏ ప్రధాన కార్యదర్శి నిర్వాకంపై తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తనపై కేసు నమోదైందనే విషయం తెలుసుకున్న షా గురువారమే తన పదవికి రాజీనామా చేశారు. హోల్కర్ పరిపాలన భవనంలో సెప్టెంబర్ 23 తేదిన ప్రత్యేకంగా ఆశీస్సులు అందిస్తానని పిలిచి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. షా ఎంపీసీఏ అండర్-19 క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటికి కన్వీనర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అండర్ 19 జట్టుకు ఎంపిక చేయలేదనే కోపంతోనే ఆరోపణలకు పాల్పడుతుందని మాజీ ఎంపీసీఏ ప్రధాన కార్యదర్శి అన్నారు. చట్టబద్దమైన లాంచనాలను పూర్తి చేసిన తర్వాతనే అతనిపై చర్య తీసుకుంటామని తుకోగంజ్ పోలీస్ స్టేషన్ ఇంచార్జీ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ వ్యవహారంపై వాస్తవాలను తెలుసుకోవడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఇంద్రాణి దత్తా పర్యవేక్షణలో ఓ కమిటిని నియమించారు.