breaking news
Lubber Pandhu Movie
-
అందుకే ఆ బ్లాక్ బస్టర్ సినిమా వదులుకున్నా..: ఎస్జే సూర్య
కోలీవుడ్లో బ్లాక్బస్టర్ నిలిచిన చిత్రం 'లబ్బర్ పందు'. 2024లో సెప్టెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం విజయ్ గోట్ మూవీతో పోటీ పడింది. పెద్దగా ఫేమ్ లేని నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. 2024 ఉత్తమ చిత్రాల జాబితాలో 'లబ్బర్ పందు' కూడా చేరిపోయింది. రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్తో నిండిన గ్రామీణ క్రికెట్ డ్రామాగా ఈ మూవీని తమిళరాసన్ పంచముత్తు తెరకెక్కించాడు.తాజాగా లబ్బర్ పందు మూవీని వదులుకోవడంపై స్టార్ నటుడు ఎస్జే సూర్య స్పందించారు. తనకు మొదట ఆఫర్ చేసిన పాత్రను తిరస్కరించడానికి గల కారణాన్ని ఆయన వెల్లడించారు. బుధవారం జరిగిన ఎల్ఐకే సక్సెస్ మీట్లో సూర్య మాట్లాడారు. ఓ సారి దర్శకుడు లబ్బర్ పందు స్క్రిప్ట్తో నన్ను సంప్రదించారని తెలిపారు. నా ఇమేజ్కు సరిపోయేలా కొన్ని మార్పులు చేయమని నేను అతన్ని అడిగా.. ఆయన దానికి పూర్తిగా అంగీకరించారు. కానీ ఆ మార్పులు పెరుగుతూ పోవడంతో.. నేనే మళ్లీ ఆలోచించానని అన్నారు. నా కోసం మీరు మీ మొత్తం కథను మారుస్తూ ఉంటే.. ఒక డైరెక్టర్గా మీ వ్యక్తిత్వాన్ని మీరు కోల్పోతారని అతనితో చెప్పానని వెల్లడించారు. అందుకే నేను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా అని డైరెక్టర్కు వివరించానని అన్నారు. కాగా.. ఈ మూవీలో అట్టకత్తి దినేష్ పోషించిన ఆ పాత్రను మొదట సూర్యకు ఆఫర్ చేశారు డైరెక్టర్ తమిళరాసన్.ఇటీవలే ఎస్జే సూర్య ఎల్ఐకే చిత్రంలో కనిపించారు. ఈ మూవీకి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించగా.. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించారు. ఈ మూవీలో ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఎస్జే సూర్య.. ప్రీతి అశ్రాని సరసన నటిస్తున్నారు. 'కిల్లర్' చిత్రంతో దర్శకుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాకుండా రజనీకాంత్ 'జైలర్ 2'లో కూడా భాగమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి, అయితే ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు ఇంకా ధృవీకరించలేదు. 'కిల్లర్'తో పాటు, కార్తితో 'సర్దార్ 2', 'బ్రో కోడ్' చిత్రాలు చేస్తున్నారు. -
మరోసారి రిస్క్ చేస్తున్న రాజశేఖర్.. వర్కౌట్ అయ్యేనా?
హీరో రాజశేఖర్(Rajasekhar) వెండితెరపై కనిపించి చాలా రోజులైంది. ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం ‘శేఖర్’. 2022లో ఈ మూవీ రిలీజైంది. ఆ తర్వాత ఆయన హీరోగా నటించిన చిత్రాలేవి ప్రేక్షకుల ముందుకు రాలేదు కానీ నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’(2023)లో క్యామియో రోల్ ప్లే చేసి ఆకట్టుకున్నాడు. చాలా కాలం తర్వాత రాజశేఖర్ మళ్లీ ఓ సినిమా చేయబోతున్నాడట. అది కూడా రీమేక్. తమిళ్లో పెద్ద హిట్ అయిన ‘లబ్బర్ పందు’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారట రాజశేఖర్.హరీష్ కళ్యాణ్- దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన 'లబ్బర్ పందు' సినిమాను తమిళరాసన్ పంచముత్తు దర్శకత్వం వహించారు. గల్లీ క్రికెట్ బ్యాక్డ్రాప్తో వచ్చిన ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారట.ఒరిజినల్లో దినేష్ చేసిన పాత్రను తెలుగులో రాజశేఖర్ చేస్తున్నారట. విశ్వదేవ్ రాచకొండ మాతృకలో అర్జున్ కళ్యాణ్ చేసిన పాత్రను చేస్తున్నాడట. రాజశేఖర్ తనయురాలే ఇందులో హీరోయిన్గా కనిపించనుందట.రీమేక్తో రిస్క్.. ఓటీటీ వాడకం పెరిగిన తర్వాత రీమేక్ చిత్రాలేవి వర్కౌట్ కావడం లేదు. ఒక భాషలో హిట్టయిన సినిమాను..ఓటీటీలో అన్ని ప్రాంతాల వారు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజశేఖర్ రిస్క్ చేసి రీమేక్ చేస్తున్నాడు. ఒకప్పుడు ఆయన రీమేక్ చేసిన చిత్రాలన్నీ సూపర్ హిట్గా నిలిచాయి. కానీ ఇప్పుడు పరిస్థితుల మారాయి. ఆయన రీమేక్ చేసిన గడ్డం గ్యాంగ్, శేఖర్ చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయినా కూడా రాజశేఖర్ మళ్లీ రీమేక్నే నమ్ముకున్నాడు. మరి ఆయన రిస్క్ ఫలిస్తుందో లేదో చూడాలి.


