breaking news
LB Nagar constituency
-
సుధీర్రెడ్డికే ఎల్బీనగర్ సీటు
సాక్షి, రంగారెడ్డి జిల్లాప్రతినిధి: ఎట్టకేలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ముగిసింది. శనివారం విడుదల చేసిన జాబితాలో ఎల్బీనగర్ అభ్యర్థిగా దేవిరెడ్డి సుధీర్రెడ్డిని ప్రకటించింది. ఈ స్థానాన్ని టీడీపీకి సర్దుబాటు చేస్తారని మొదట్నుంచి ప్రచారం సాగినా కాంగ్రెస్కే వదిలేస్తూ మహాకూటమి నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో బీజేపీ, బీఎల్ఎఫ్ మినహా అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక క్రతువును పూర్తిచేశాయి. కాగా, తెలుగుదేశం పార్టీకి కేటాయించిన ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ సీట్ల విషయంలో పునరాలోచన చేస్తుందనే ప్రచారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు స్థానే వేరే సీట్లను టీడీపీకి కేటాయించి.. వీటిని కాంగ్రెస్ తీసుకుంటుందనే వార్తలకు ఆ పార్టీ తుది జాబితా విడుదల చేస్తే తప్ప ఫుల్స్టాప్ పడేలా లేదు. ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి ఆశలు సజీవంగా ఉండడంతో ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. అయితే, ఈ సెగ్మెంట్ టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి మెత్తబడ్డారు. శనివారం నాడు సామ రంగారెడ్డి నామినేషన్ కూడా దాఖలు చేయడంతో రంగం నుంచి తప్పుకునే సూచనలు కనిపించడం లేదు. వరుసగా రెండో రోజు కూడా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ను కలిసి సహకారం అందించాలని కోరారు. కాగా, క్యామ కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పేర్కొంటూ నామినేషన్ వేయడం గమనార్హం. ఇక రాజేంద్రనగర్ విషయానికి వస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా బండ్ల గణేశ్ పేరు తెరమీదకు వస్తుండడం.. నామినేషన్లకు గడువు దగ్గర పడుతుండంతో ఆసక్తికరంగా మారింది. టీడీపీ అభ్యర్థి గణేశ్గుప్తా ఒక సెట్ నామినేషన్ను సమర్పించారు. -
జనపథం - ఎల్భీనగర్
-
పార్టీ మారి...విజయాన్ని చేరి!
ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో చివరి నిమిషంలో పార్టీలు మారిన కొందరు జంప్ జిలానీలను అనూహ్యంగా విజయలక్ష్మి వరించింది. హయత్నగర్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరి లోకి దిగిన సామ తిరుమల రెడ్డి గతంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో పని చేశారు. బల్దియా ఎన్నికల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్లోకి దూకి...విజయం సాధించారు. చంపాపేట్, వనస్థలిపురం డివి జన్ల నుంచి సామ రమణారెడ్డి, జిట్టా రాజశేఖర్రెడ్డిలు గత బల్దియా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా గెలుపొందారు. ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన అనంతరం మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు అధికార పార్టీ అభ్యర్థులుగా అవే సిట్టింగ్ స్థానాల నుంచి ఎన్నికకావడం విశేషం. గడ్డిఅన్నారం డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పని చేసిన భవాని ప్రవీణ్ కుమార్ చివరి నిమిషంలో టీఆర్ఎస్లో చేరి కార్పొరేటర్గా విజయం సాధించారు. వీరందరూ పార్టీలు మారినా గెలుపొందడంతో సంబరాలు చేసుకుంటున్నారు.