breaking news
Last position
-
బ్లిట్జ్లోనూ ఆఖరి స్థానమే!
సెయింట్ లూయిస్ (అమెరికా): భారత గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందకు ‘గ్రాండ్ చెస్ టూర్’లో సెయింట్ లూయిస్ అంచె పోటీలు ఏమాత్రం కలిసిరాలేదు. బ్లిట్జ్ ఈవెంట్లోనూ అతను ఆఖరి స్థానంలో నిలిచాడు. ఇంతకుముందు ర్యాపిడ్ కేటగిరీలో నాలుగు పాయింట్లతో చివరి స్థానంలో నిలిచాడు. అయితే శనివారం ముగిసిన బ్లిట్జ్ కేటగిరీలో కాస్త మెరుగైన ప్రదర్శన కనబరిచి 8 పాయింట్లు సాధించినా చివరకు ఆఖరి స్థానమైతే తప్పలేదు. మొత్తానికి గ్రాండ్ చెస్ టూర్ ఈవెంట్లో అతని ఖాతాలో 12 పాయింట్లు (4+8) ఉన్నాయి. ఈ టోర్నీకి ముందు మూడో ర్యాంకులో ఉన్న ప్రజ్ఞానంద... తాజా నిరాశాజనక ఫలితాలతో ఐదో స్థానానికి పడిపోయాడు. ఫ్రాన్స్ గ్రాండ్మాస్టర్ అలిరెజా ఫిరోజా 23 పాయింట్లతో సెయింట్ లూయిస్ అంచె ఈవెంట్లో విజేతగా నిలిచాడు. అతను ర్యాపిడ్లో 11, బ్లిట్జ్లో 12 పాయింట్లు గెలుపొందాడు. అమెరికా ఆటగాళ్లు వెస్లీ సొ (20 పాయింట్లు), హికరు నకముర (19.5), లెవొన్ అరోనియన్ (19) వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచారు. తర్వాతి టోర్నీ సింక్యూఫీల్డ్ కప్లో ప్రజ్ఞానందతో పాటు భారత్ నుంచి డి.గుకేశ్ బరిలో ఉన్నాడు. -
ప్రా‘పల్టీ’
♦ ఈ ఏడాది నూరుశాతం పన్ను వసూళ్లు అసాధ్యమే ♦ ఆస్తి పన్ను వసూళ్లలో ఖమ్మం కార్పొరేషన్ వెనుకంజ ఖమ్మం : ఆస్తిపన్ను వసూళ్లలో ఖమ్మం కార్పొరేషన్ తీరు మారడం లేదు. గతేడాది పన్ను వసూళ్లలో వరంగల్ రీజియన్లో ఖమ్మం చివరి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కూడా అదే స్థానానికి పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నారుు. కార్పొరేషన్కు ప్రధాన ఆదాయ వనరైన ఆస్తిపన్ను వసూలుపై అధికార యంత్రాంగం పూర్తిస్థారుు దృష్టి సారించలేదనే ఆరోపణలున్నారుు. ♦ కార్పొరేషన్ పరిధిలో మొత్తంగా 54,387 గృహ సముదాయాలున్నారుు. ఇందులో నివాస గృహాలు 39,248, కమర్షియల్ బిల్డింగ్లు 6,536, పార్ట్లీ రెసిడెన్షియల్ భవనాలు 8603. వీటి ద్వారా ఈ ఏడాది మొత్తం రూ.15.12 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలి. అరుుతే రెండేళ్లుగా ఆస్తి పన్ను వసూళ్లలో కార్పొరేషన్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. సాధారణంగా ఆరునెలలకు ఒకసారి ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అరుుతే ఇటీవల ప్రభుత్వం ఆ నిబంధనల్లో సడలింపు ఇచ్చింది. దీంతో ఏడాది ఆస్తి పన్ను ఒకే దఫా చెల్లించాలి. ♦ గత ఏడాది ఆస్తి పన్నుకు సంబంధించి రూ.20.22 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా కేవలం రూ.15.84 కోట్లు మాత్రమే వసూలైంది. రూ.4.38 కోట్ల బకారుులు పేరుకుపోయారుు. ఈ ఏడాది నిర్దేశించిన ఆస్తిపన్ను లక్ష్యం ♦ రూ.15.12 కోట్లు. గత ఏడాది బకారుు కలిపి రూ.19.50 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలి. అరుుతే 2016-17 వార్షిక సంవత్సరంలో అర్థ సంవత్సరం ముగిసి నెల రోజులు కావస్తునప్పటికీ ఇప్పటి వరకు కేవలం 29.50 శాతం పన్ను వసూలు మాత్రమే సాధ్యపడింది. ఇప్పటివరకు కేవలం రూ.5.75 కోట్ల పన్ను వసూళ్లు మాత్రమే చేపట్టారు. దీంతో గత ఏడాది కంటే ఈ ఏడాది పన్ను వసూళ్లు తగ్గుముఖం పట్టే అవకాశమున్నట్లు కార్పొరేషన్ వర్గాలే పేర్కొంటున్నారుు. వరంగల్ రీజియన్లో ఖమ్మం వెనుకంజ.. వరంగల్ రీజియన్లో నాలుగు కార్పొరేషన్లు ఉండగా, పన్ను వసూళ్లు లక్ష్యంలో ఖమ్మం వెనుకంజలో నిలిచింది. గత ఏడాది కరీంనగర్ కార్పొరేషన్ 99.54 శాతం పన్ను వసూళ్లతో నంబర్వన్ స్థానంలో నిలవగా, రామగుండం కార్పొరేషన్ 91.79 శాతంతో రెండో స్థానంలో, తర్వాతి స్థానంలో వరంగల్ కార్పొరేషన్ 81.72 శాతం పన్ను వసూళ్లు సాధించింది. ఖమ్మం కార్పొరేషన్ మాత్రం కేవలం 78.32 శాతం పన్ను వసూళ్లు సాధించి చివరి స్థానంలో నిలిచింది. ఖమ్మం కార్పొరేషన్లో కలిపిన తొమ్మిది గ్రామపంచాయతీల్లో పన్ను చెల్లింపులపై సరైన అవగాహన కల్పించని కారణంగా నగరంలోని చివరి గ్రామాల్లో పన్ను వసూళ్ల శాతం తక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. అరకొర సిబ్బందితో నెరవేరని లక్ష్యం.. ఖమ్మం కార్పొరేషన్లో ఆస్తి పన్ను వసూళ్లుకు సంబంధించి నలుగురు రెవెన్యూ ఇన్సపెక్టర్లు, 14 మంది బిల్ కలెక్టర్లు ఉన్నారు. మొత్తం 50 డివిజన్లుండగా... ఒక్కో బిల్ కలెక్టర్ మూడుకుపైగా డివిజన్లలో పన్నులు వసూళ్లు చేయాల్సి ఉంది. అరుుతే ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపడా లేకపోవడంతో వారు కూడా ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. పన్ను వసూళ్లకు మాత్రమే వీరిని వినియోగించాల్సి ఉండగా, అదనపు పనులు సైతం వీరికే అప్పగిస్తుండటంతో అసలు లక్ష్యం మరుగునపడింది. ఈ ఏడాది ప్రభుత్వం ఆస్తి పన్ను రివిజన్ చేయడంతో ప్రస్తుతం ఆ పనుల్లో బిల్ కలెక్టర్లు, ఆర్ఐలు నిమగ్నమై ఉన్నారు. అదీగాక ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు సైతం బిల్ కలెక్టర్లను ఎక్కువగా వినియోగిస్తుండటంతో పన్ను వసూళ్లు లక్ష్యం చేరడం లేదు. -
టెట్ ఫలితాల్లో తగ్గిన ఉత్తీర్ణత
♦ పేపర్-1లో 40.89 శాతం ♦ పేపర్-2లో 22.15 శాతం ♦ జిల్లాకు ఐదు, పదో ర్యాంకులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాల్లో జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది. రెండు పేపర్లలోనూ నిరాశాజనకమైన ఫలితాలు రావడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా టెట్ పరీక్షకు 29,193 మంది హాజరు కాగా.. 7,524 మంది అర్హత సాధించారు. పేపర్-1 కేటగిరీ నుంచి 5,644 మంది పరీక్ష రాయగా.. 2,308 మంది మాత్రమే క్వాలిఫై అయి 40.89 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ విభాగంలో రాష్ట్రంలో జిల్లా ర్యాంకు పదో స్థానానికి పడిపోయింది. అదేవిధంగా పేపర్-2 కేటగిరీలో 23,549 మంది పరీక్ష రాయగా.. 5,216 మంది పాసై 22.15శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ విభాగంలో జిల్లా ర్యాంకు తొమ్మిదిలో నిలిచింది. జిల్లాకు 5, 10 ర్యాంకులు టెట్ పరీక్ష ఫలితాల్లో జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థులు మెరిశారు. పేపర్-1లో మందె శివరామకృష్ణ 131 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి లో ఐదో ర్యాంకు, గంగుల గౌతమ్కుమార్రెడ్డి 128 మార్కులు సాధిం చి 10వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. పేపర్-2లో తూము స్రవంతి 122 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు దక్కించుకున్నారు.