రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం
హైదరాబాద్ సిటీ: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా నగరంలోని రవీంద్రభారతిలో కవి సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 400 మంది కవులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ సలహాదారు రమణాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన పలువురు కవులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 'కొత్తసలు' పుస్తకావిష్కరణ చేశారు.