-
Jodeghat Museum: జోడెన్ఘాట్ వీరభూమి
‘కుమ్రుం భీము గిరిజన సంగ్రహాలయం’ ఇది ట్రైబల్ మ్యూజియం. ఆదివాసీల జీవనశైలితోపాటు కుమ్రుం భీము జీవితాన్ని బొమ్మల్లో చూపించే ప్రయత్నం. కొండ అద్దంలో ఇముడుతుందేమో కానీ కుమ్రుం భీము పోరాటం, జీవితాశయ సాధనలను ప్రతిబింబించడానికి ఒక మ్యూజియం సరిపోదు, ఇలాంటి పది మ్యూజియాలు కావాలి. ఈ మ్యూజియం కుమ్రుంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా, కెరిమెర మండలం, జోడెన్ఘాట్ గ్రామంలో ఉంది. జోడెన్ఘాట్లో కుమ్రుం భీము సమాధి, సమాధి పక్కనే భీము చేత్తో తుపాకీ పట్టుకున్న విగ్రహం ఉన్నాయి. విగ్రహం ఎదురుగా మ్యూజియం ఉంది. ఇందులో ఆదివాసీలు ఉపయోగించే వస్తువులు, పాత్రలు, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ, ఆభరణాల అలంకరణ, పెళ్లి వేడుక చిత్రాలు, వేడుకలు, దేవతాపూజ సన్నివేశాలను కళ్లకు కట్టారు. వీటన్నింటిలో మేటిగా కుమ్రుం భీము జీవితావిష్కరణ కనిపిస్తుంది. మ్యూజియంలోకి ప్రవేశించగానే ఎడమ వైపు ఒక నాయకుడు, పది మంది అనుచరుల శిల్పాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి. మధ్యలో ఉన్నది భీము. ద్వారానికి కుడివైపు భీము ఫొటో, విగ్రహంతోపాటు భీము భార్య సోమ్బాయి ఫొటో ఉంది. ఆ పక్కనే భీముతో కలిసి పని చేసిన కుమ్రుం సూరు ఫొటో, వేడమ రాము ఫొటో కూడా. భీము ఆచూకీ కోసం నిజాం మనుషులు గాలిస్తున్న సమయంలో ప్రమాదం ముంచుకు వస్తోందని హెచ్చరించడానికి రాము కాలికొం అనే వాద్యాన్ని ఊది భీమును, భీము బృందాన్ని అప్రమత్తం చేసేవాడు. ఈ మ్యూజియానికి పక్కనే ఉన్న ఆశ్రమ పాఠశాలలో భీము మనుమరాలు సోమ్బాయి ఉంది. ఆ స్కూల్లో చదువుకుంటూ కాదు, పాఠాలు చెప్తూ కూడా కాదు. స్కూలు పిల్లలకు భోజనం వండి పెట్టే ఉద్యోగంలో ఉందామె. భీము గౌరవార్థం సభలకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. జిల్లాకు పేరు కూడా పెట్టింది. కానీ అతడి వారసుల ఉపాధి గురించి పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. అంతేకాదు... భీముకు ఇస్తున్న గౌరవం అతడి పోరాటానికి ఇవ్వడం లేదని తెలిసినప్పుడు కూడా ఆశ్చర్యమేస్తుంది. భూమి కోసం పోరాటం కుమ్రుం భీము పుట్టింది ఆసిఫాబాద్ జిల్లా సంకేపల్లిలో. నిజాం పాలన కాలంలో రెవెన్యూ శాఖ వేధింపులు ఎక్కువగా ఉండేవి. పంటను ఐదు వంతులుగా విభజించి మూడు వంతులు ప్రభుత్వానికి కట్టాల్సి వచ్చేది. పండించిన వాళ్లకు రెండు వంతులు మాత్రమే మిగిలేది. ‘ఇదేం న్యాయం’ అని ప్రశ్నించిన భీము కుటుంబాన్ని స్థానిక పటేదారు వేధించడం మొదలుపెట్టాడు. భీము కుటుంబం ఊరు వదిలి సుర్దాపూర్కి పారిపోయింది. పటేదారు మనుషులు అక్కడికీ వచ్చారు. భీము ఆవేశం పట్టలేక పటేదారును కొట్టడంతో అతడు చనిపోతాడు. అప్పుడు భీము అడవుల్లోకి పారిపోతాడు. అడవుల నుంచి అస్సాంకు వెళ్లి ఆరేడేళ్ల పాటు అక్కడే ఉండి చదవడం, రాయడం నేర్చుకుని తిరిగి సుర్దాపూర్కొస్తాడు. అప్పటి నుంచి ఆదివాసీలకు సాగు చేసుకుంటున్న భూమి మీద సంపూర్ణ హక్కుల కోసం మరింత పటిష్టంగా పోరాడడం మొదలు పెట్టాడు. అనేక దరఖాస్తులు పెట్టాడు. నిజాంను స్వయంగా కలిసి విన్నవించుకోవడానికి పదిహేను మంది ఆదివాసీలతో హైదరాబాద్కు వెళ్లాడు. నిజామ్ అనుమతి ఇవ్వకపోవడంతో తన స్వస్థలంలోనే పోరాడాలని నిర్ణయించుకుని వెనక్కి వచ్చేశాడు భీము. అప్పటి నుంచి శిస్తు కట్టమని అడిగిన పటేదార్లను, రెవెన్యూ అధికారులను ధిక్కరించడమే ధ్యేయంగా పోరాటం తీవ్రతరం చేశాడు. వీరి స్థావరం కొండ మీద జోడెన్ఘాట్కు సమీపంలో ఉన్న భాభేఝరి. ఇక్కడి నుంచి ఉద్యమాన్ని నడిపాడు భీము. చుట్టు పక్కల 14 గ్రామాలను ప్రభావితం చేశాడు. భీము పోరాటాన్ని అణచివేయడానికి నిజాం సైన్యాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. రెండు వందల మందితో కూడిన భీము సైన్యం రెండు నెలల పాటు నిజాం సైన్యాన్ని విజయవంతంగా నిలువరించగలిగింది. భీము అనుచరుల్లో ‘కొద్దు’ అనే వ్యక్తి రోజూ కొండ కిందకు వెళ్లి భీము బృందానికి అవసరమైన ఆయుధాలు, ఆహారాన్ని కొండమీదకు తెచ్చేవాడు. అతడిని వేధించి, ప్రలోభ పెట్టిన నిజాం సేనలు ఎట్టకేలకు భీము కదలికలను పసిగట్టాయి. భీము ఉన్న కొండకు వెనుక వైపు మోవాడ్ ప్రాంతం నుంచి నిజాం సేనలు వచ్చి జోడెన్ఘాట్లో ఉన్న భీమును తుపాకీతో కాల్చి చంపేశాయి. భీము అక్కడికక్కడే తుది శ్వాస వదిలాడు. ఇది జరిగింది 1940, ఆశ్వయుజ పౌర్ణమి రోజున. అప్పటికి అతడి వయసు 39. నిజాం పాలకులు తుపాకీ తూటాతో భీము ఆశయానికి గండికొట్టారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా నిశ్శబ్దంగా అదే పంథాను కొనసాగిస్తున్నాయి. భీము ఏ ఆశయం కోసం పోరాడాడో ఆ ఆశయం ఇప్పటికీ నెరవేరనే లేదు. స్థానిక ఆదివాసీలు ఇప్పటికీ పోడు భూముల మీద హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఆదివాసీలు భీము జీవిత కథను వివరిస్తూ... మా చేతిలో తుపాకీ లేదు, కానీ తుపాకీ పట్టిన భీము స్ఫూర్తి మాలో ఉందని చెబుతున్నారు. ఈ పర్యటనలో తరాలకు కూడా తరగని స్ఫూర్తినిచ్చిన కుమ్రుం భీము జీవితం కళ్ల ముందు మెదలుతుంది. చదవండి: కురువపురం దీవి; కృష్ణమ్మ సిగలో చేమంతి అండర్వాటర్లో మ్యూజియం.. అదెక్కడంటే? -
భారీ వర్షాలతో ఉప్పొంగిన వాగులు
-
‘నల్లారి’ హామీలు.. నీటి మూటలు..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ మూడేళ్లలో ఆయన జిల్లాలో అధికారికంగా ఐదుసార్లు పర్యటించారు. కిరణ్ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఇచ్చిన హామీలు నెరవేరలేదు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే మంజూరైన అభివృద్ధి, సంక్షేమ పథకాల కొనసాగింపు తప్పితే.. పెండింగ్ ప్రాజెక్టులు అంగుళం కూడా కదల లేదు. జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల, శ్రీపాదసాగర్ ప్రాజెక్టులు అసంపూర్తిగానే ఉన్నాయి. వైఎస్సార్ హయాంలో పూర్తిచేసిన కొమురం భీమ్ ప్రాజెక్టును ప్రారంభించిన కిరణ్, అసంపూర్తిగా ఉన్న కాల్వల నిర్మాణాన్ని విస్మరించారు. దీంతో ప్రాజెక్టులో నీరున్నా పంటపొలాలకు సాగునీరు అందించలేని పరిస్థితి. ఆచరణకు నోచుకోని హామీలు.. 2010 డిసెంబర్ 6న సీఎం హోదాలో కిరణ్ మొదటిసారిగా జిల్లాలో పర్యటించారు. ప్రాణహిత పుష్కరాలను ప్రారంభించిన ఆయన జిల్లాపై వరాల జల్లు కురిపించారు. 2011 ఫిబ్రవరి 5న రచ్చబండ మొదటి విడత కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని తానూరులో నిర్వహించిన కార్యక్ర మలో పాల్గొన్నారు. అప్పుడు పుష్కలంగా హామీలు గుప్పించారు. 2011 నవంబర్ 19న రచ్చబండ రెండో విడతలో భాగంగా జిల్లాలో పర్యటించిన ఆయన ఆసిఫాబాద్లో ఏర్పాటు చేసిన సభలో హామీలు వల్లెవేశారు. రిమ్స్లో ట్రామా, ఎమర్జెన్సీ కేర్ సెంటర్, 41 మంది వైద్యులు, 125 నర్సుల అదనపు నియామకం హామీ బుట్టదాఖలైంది. ఐదు మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేసేందుకు నిధులు కేటాయింపు హుష్కాకీ అంది. కొద్దిపాటి నిధులతో కొమురం భీమ్, నీల్వాయి, మత్తడివాగు, గొల్లవాగు ప్రాజెక్టులు పూర్తయి 46 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే అవకాశం ఉంది. ఆ నాలుగు ప్రాజెక్టులపై రూ.400 కోట్లకు పైగా ఖర్చు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తే, రూ.40 కోట్ల పనులపై ఆయన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆసిఫాబాద్ మండలంలోని అడ గ్రామం వద్ద నిర్మించిన కొమురం భీమ్ ప్రాజెక్టు వ్యయం ప్రారంభంలో రూ. 274.14 కోట్లు కాగా అనంతరం రూ.450 కోట్లకు పెరిగింది. కాల్వలు పూర్తికాకున్నా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినట్లు ప్రకటించి సీఎం కిరణ్ ప్రారంభించినా ఎకరానికి కూడా సాగునీరు అందడం లేదు. వైఎస్సార్ హయాంలో పూర్తయిన కొమురం భీమ్ ప్రాజెక్టును ప్రారంభించడం తప్ప ఐదింటిలో ఒక్క ప్రాజెక్టుకు పూర్తయ్యే నిధులు ఇవ్వలేదు. ప్రాణహిత-చేవెళ్ల, శ్రీపాదసాగర్ సహాఅన్నీ పెండింగే.. జాతీయ హోదా, నిధుల లేమీ కారణంగా ప్రాణహిత-చేవెళ్ల, ఎల్లంపల్లి ప్రాజెక్టులు సహా జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన మధ్యతరహా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగ లేదు. ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో కిరణ్ సర్కారు వివక్ష చూపిందన్న విమర్శలు ఉన్నాయి. వీటితోపాటు కాగజ్నగర్ మండలంలోని జగన్నాథపూర్ గ్రామం శివారులోని పెద్దవాగు వద్ద జగన్నాథ్పూర్ డైవర్షన్ స్కీము, ముథోల్ నియోజవర్గంలోని భైంసా, ముథోల్, లోకేశ్వరం మండలాలకు చెందిన 14 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో గడ్డెన్నవాగు ప్రాజెక్టు, మంచిర్యాల డివిజన్ వేమనపల్లి సమీపంలోని నీల్వాయిలతో పాటు పలు ప్రాజెక్టులు నేటికి అసంపూర్తిగా ఉన్నాయి. ప్రాణహిత-చేవెళ్ల ద్వారా జిల్లాలో 1.56 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిందించేందుకు రూ.7,600 కోట్లు విడుదల అటకెక్కింది. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కలగానే మిగిలింది. జిల్లాలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రక్షిత మంచినీటి పథకాలకు రూ.120 కోట్లు మంజూరు కాలేదు. మొదటి, రెండో విడతల రచ్చబండల్లో పాల్గొన్న సందర్భంగా ఇచ్చిన హామీలు నేటి అపరిష్కృతంగానే ఉన్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement