breaking news
katepalli Janardhan Reddy
-
మాది ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వం
కాటేపల్లి విజయంతో అది రుజువైంది: హరీశ్రావు సాక్షి, హైదరాబాద్: తమది ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వమని మరోసారి రుజువైందని, కాటేపల్లి జనార్దన్రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడమే దీనికి తాజా ఉదాహరణ అని మంత్రి హరీశ్రావు అన్నారు. కాటేపల్లిని ఎమ్మెల్సీగా గెలిపించు కోవడానికి కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఉపాధ్యాయుల నమ్మకాన్ని తప్పక నిలబెట్టు కుంటామని హామీ ఇచ్చారు. ఏకీ కృత సర్వీస్ సమస్య కేంద్రం వద్ద పెండింగ్లో ఉందని, తమ ఎంపీలు ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్ని స్తున్నారని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం మోడల్ స్కూల్స్ రద్దు చేసినా రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలిచిందన్నారు. -
కాటేపల్లి జనార్ధన్ రెడ్డి జయకేతనం
-
టీచర్స్ ఎమ్మెల్సీ: టీఆర్ఎస్ జయకేతనం
-
టీచర్ ఎమ్మెల్సీ కాటేపల్లి
- అర్ధరాత్రికి పూర్తయిన ఓట్ల లెక్కింపు - 11 రౌండ్ అనంతరం తేలిన ఫలితం - నేడు ధ్రువీకరణ పత్రం అందజేత సాక్షి, హైదరాబాద్: మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా అధికార టీఆర్ఎస్ బలపరిచిన సిట్టింగ్ సభ్యుడు కాటేపల్లి జనార్దన్రెడ్డి తిరిగి గెలుపొందారు. విజయానికి 9,670 ఓట్లు కావాల్సి ఉండగా, 11వ రౌండ్ పూర్తయ్యేప్పటికి రెండో ప్రాధాన్యత ఓట్ల సాయంతో 9,734 ఓట్లు సాధించి నెగ్గారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చాక ఆయనకు గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. గత ఎన్నికల్లో కూడా కాటేపల్లి రెండో ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచారు! చీలిన ఓట్లు ఓట్ల లెక్కింపు సన్నాహాలు బుధవారం ఉదయం 8 గంటలకే ప్రారంభమైనా లెక్కింపు మధ్యాహ్నం తర్వాతే మొదలైంది. ఆసక్తికర మలుపుల మధ్య అర్ధరాత్రి 12 గంటల తర్వాత పూర్తయింది. తొలి ప్రాధాన్యత ఓట్లలో కాటేపల్లికి మిగతా అందరికంటే ఎక్కువ ఓట్లొచ్చినా విజయానికి అవి చాలలేదు. తొలి రౌండ్లో ఆయనకు 7,640, మిగతా అభ్యర్థులందరికీ కలిపి 11,698 ఓట్లు లభించాయి. దాంతో మొదటి ప్రాధాన్యత ఓట్లలో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. వ్యతిరేక ఓట్లు చీలడం కాటేపల్లికి లాభించింది. ఈ నెల 9న జరిగిన పోలింగ్ ఇద్దరు అభ్యర్థుల ఫొటోలు తారుమారు కావడంతో రద్దవడం, 19న రీ పోలింగ్ జరగడం తెలిసిందే. ఆ ఎన్నికలో 88.67 శాతం పోలింగ్ నమోదవగా, రీ పోలింగ్లో 82.49 శాతానికి పరిమితమైంది. ఓట్ల శాతం తగ్గడం ఎవరికి అనుకూలం కానుందనేది ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ బలపరచిన కాటేపల్లికి ఇతరులు గట్టి పోటీనిచ్చారు. కానీ వారి ఓట్లు చీలడంతో ఎవరూ విజయానికి సమీపంగా రాలేకపోయారు. తొలి ప్రాధాన్యత ఓట్లను రెండు విడతలుగా లెక్కించారు. తొలి రౌండ్లో కాటేపల్లికి 7,640 ఓట్లు, ఏవీఎన్ రెడ్డి (ఎస్టీయూ)కి 3,091, పాపన్నగారి మాణిక్రెడ్డి (యూటీఎఫ్)కి 3,048 ఓట్లు లభించాయి. హర్షవర్ధన్రెడ్డికి 2,482 ఓట్లు లభించాయి. తొలి పోలింగ్లో ఫొటో తారుమారైన అభ్యర్థుల్లో మాణిక్రెడ్డికి మూడో స్థానం లభించగా, ఆదిలక్ష్మయ్యకు కేవలం 461 ఓట్లు పడ్డాయి! అందరికంటే తక్కువగా అరకల కృష్ణాగౌడ్కు కేవలం 10 ఓట్లు రావడంతో రెండో రౌండ్లో ఆయనను తొలగించి మిగతా వారికి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. చివరి రౌండ్ ముగిసేసమయానికి మాణిక్రెడ్డికి 5,095 ఓట్లు లభించాయి. చెల్లిన ఓట్లు: 19,338 విజయానికి కావాల్సిన ఓట్లు: 9,670 కాటేపల్లికి వచ్చిన ఓట్లు: 9,734 నేడు జనార్దన్రెడ్డి విజయోత్సవ సభ సాక్షి, హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన కాటేపల్లి జనార్దన్రెడ్డికి విజయోత్సవ సభను గురువారం సిద్ధిపేటలో నిర్వహిస్తున్నట్లు పీఆర్టీ యూఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పులి సరోత్తంరెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి తెలిపారు. -
ఓటర్లను మరోమారు కలవండి
⇒ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికపై మంత్రి హరీశ్రావు ⇒ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ సాక్షి, హైదరాబాద్: శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గం మహబూబ్ నగర్– రంగారెడ్డి– హైదరాబాద్లో తాము మద్దతిస్తున్న అభ్యర్ధి కాటేపల్లి జనార్దన్ రెడ్డిని గెలిపించడంపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. బ్యాలెట్ పేపర్లో పొరపాట్ల వల్ల ఈనెల 19వ తేదీకి ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఇన్చార్జులుగా వ్యవహరి స్తున్న వారితో మంత్రి హరీశ్రావు శనివారం అసెంబ్లీ కమిటీ హాలులో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్గౌడ్, బాలరాజు, మండలి చీఫ్ విప్ పాతూరి సుధా కర్రెడ్డి తదితరులు ఈ భేటీలో చర్చించారు. ఎన్నిక వరకు మరోమారు ఉపాధ్యాయులు, అధ్యాపకులను నేరుగా కలవాలని ఇన్చార్జు లకు హరీశ్ సూచించారు. ప్రధానంగా ఉపా« ద్యాయ సంఘ నాయకులతో సమావేశాలు జరపాలని సూచించారు. ఇదివరకు ఏయే వర్గాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయో గుర్తించి నందున, అవి మళ్లీ తలెత్తకుండా చూసుకోవా లన్నారు. యూనివర్సిటీ అధ్యాపకులు, రెసిడెన్షియల్ స్కూళ్ల టీచర్లు, కస్తూర్బా పాఠశా లల టీచర్లు, పాలిటెక్నిక్ కాలేజీల లెక్చరర్లను మళ్లీ ఒకసారి కలసి అభ్యర్ధి కోసం ఓట్లు కోరాలని అన్నారు. ఈ ఎన్నికల్లో 23,400 పైచిలుకు ఓటర్లు ఉన్నందున.. సాధ్యమైనంత మంది ఓటర్లను కలిసేలా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు.