breaking news
Jamaat-e-Islami
-
గెలిచింది నేను కాదు, నాకొద్దీ సీటు
కరాచీ: ఎన్నికల పందేరంలో కోట్లు పంచైనా సరే ఓట్లు ఒడిసిపట్టాలనే నేతలున్న ఈ కాలంలో నువ్వే గెలిచావని ఎన్నికల సంఘం చెబుతున్నా ఒక పాకిస్తాన్ నేత ‘నాకు ఇలాంటి గెలుపు వద్దే వద్దు’ అని తెగేసి చెప్పారు. రిగ్గింగ్కు పాల్పడటం ద్వారా తనను గెలిపించారని, వాస్తవానికి విజేత వేరే ఉన్నారని కుండబద్దలు కొట్టారు. సంక్షుభిత పాకిస్తాన్లో ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికలతోపాటు నాలుగు ప్రావిన్షియల్(అసెంబ్లీ) ఎన్నికలు జరిగాయి. వాణిజ్య రాజధాని కరాచీ నగరంలో పీఎస్–129 నియోజకవర్గం నుంచి జామాతే ఇస్లామీ పార్టీ అభ్యర్థి హఫీజ్ ఉర్ రెహ్మాన్ పోటీకి నిలబడ్డారు. అవినీతి కేసుల్లో జైలుపాలైన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ నేత, స్వతంత్ర అభ్యర్థి సైఫ్ బారీ కూడా ఇదే స్థానంలో బరిలో నిల్చారు. సైఫ్కు 31,000 ఓట్లు రాగా, రెహ్మాన్కు 26,000 ఓట్లు పడ్డాయి. అయితే పీటీఐ నేతను ఎలాగైనా అడ్డుకోవాలనే లక్ష్యంతో కొందరు రిగ్గింగ్కు పాల్పడ్డారు. సైఫ్కు కేవలం 11,000 ఓట్లు పడ్డట్లు ఫలితాల్లో వచ్చేలా చేశారు. ఇదే ఫలితాలను పాక్ ఎలక్షన్ కమిషన్ అసలైనవిగా భావించి రెహా్మన్ను విజేతగా ప్రకటించింది. రిగ్గింగ్ విషయం తెల్సి రెహా్మన్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యేకంగా పత్రికా సమావేశం పెట్టిమరీ తన ధర్మాగ్రహాన్ని వ్యక్తంచేశారు. ‘‘ అన్యాయంగా నన్ను ఎవరైనా గెలిపించాలనుకుంటే అందుకు నేను అస్సలు ఒప్పుకోను. ప్రజాతీర్పును గౌరవించాల్సిందే. విజేతనే గెలవనివ్వండి. రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి ఓటమిని చవిచూడాల్సిందే. అలాంటి వారికి ఎక్స్ట్రాలు అక్కర్లేదు. నేను ఈ గెలుపును స్వీకరించట్లేను. విజేతకే విజయం దక్కాలి’’ అని అన్నారు. రెహ్మాన్ నిజాయతీ చూసి అక్కడి వాళ్లు మెచ్చుకున్నారు. అయితే ఈ ఉదంతంపై పాక్ ఎన్నికల సంఘం మరోలా స్పందించింది. ‘‘ రిగ్గింగ్ అవాస్తవం. ఇలాంటి ఫిర్యాదులపై దృష్టి పెడతాం’’ అని పేర్కొంది. ఈ ఘటనపై త్వరలోనే స్పందిస్తామని పీటీఐ తెలిపింది. -
జమాతె ఆస్తులు సీల్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని నిషేధిత జమాతె ఇస్లామీ(జేఈఐ) సంస్థకు చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను శనివారం రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్ఐఏ) సీల్ వేసింది. బారాముల్లా, బందిపొరా, గందేర్బల్, కుప్వారా జిల్లాల్లోని సుమారు 12 ప్రాంతాల్లో ఉన్న రూ.100 కోట్ల విలువైన ఈ ఆస్తుల్లోకి ప్రవేశించడానికి గానీ, ఎవరూ వినియోగించుకోవడానికి ఇక వీలుండదని అధికారులు తెలిపారు. జేఈఐ తన నిధులను వేర్పాటు వాద కార్యకలాపాల కోసం, జాతి వ్యతిరేక, ఉగ్రవాద కార్యకలాపాల కోసం వినియోగించకుండా ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు. జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా జేఈఐకి సుమారు 188 ఆస్తులున్నట్లు ఎస్ఐఏ గుర్తించింది. వీటిపై విడతల వారీగా చర్యలు తీసుకుంటోంది. -
‘జమాత్ ఏ ఇస్లామీ’ ఆస్తుల సీజ్
శ్రీనగర్: జమాత్ ఏ ఇస్లామీ (జేఈఐ) సంస్థ ఆస్తులతో పాటు దాన్ని నిర్వహించే నాయకుల నివాసగృహాలను సైతం కశ్మీర్ అధికార వర్గా లు శనివారం సీల్ చేశాయి. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలతో సన్నిహిత సంబంధాలతో పాటు వేర్పాటువాద ఉ ద్యమానికి మద్దతునిస్తోందన్న ఆరోపణలతో గురువారం కేంద్రం జేఈఐపై ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. దీంతో నగరవ్యాప్తంగా జేఈఐ ఆస్తులతో పాటు, దాన్ని నిర్వహించే నా యకులు, కార్యకర్తలకు సంబంధించిన ఇళ్లను శుక్రవారం రాత్రి సీల్ చేసినట్లు పోలీసులు తెలి పారు. అలాగే జేఈఐ నాయకుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినట్లు వెల్లడించారు. జేఈఐ నిషేధంపై కశ్మీర్ కు చెందిన పార్టీలు కేంద్రాన్ని తప్పుబట్టాయి. ఇది ప్రతీకార చర్య: మెహబూబా ప్రతీకార చర్యల్లో భాగంగానే జేఈఐపై కేంద్రం నిషేధం విధించిందని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ముఫ్తీ మెహబూబా ఆరోపించారు. కేం ద్రం నిర్ణయం కారణంగా ఇక్కడ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ‘రాష్ట్రం లో కేంద్రం ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. కేంద్రం నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. అరెస్టు చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు. మీకు శివసేన, జన్సంఘ్, ఆరెస్సెస్ లాంటి సంస్థలున్నాయి. ఓ రకమైన మాంసాన్ని తిం టున్నారని వారు మనుషులను చంపుతున్నా పట్టించుకోరు. చర్యలుండవు. అదే పేదవారికి సాయం చేసేందుకు స్కూళ్లు నిర్వహిస్తున్న జే ఈఐపై మాత్రం నిషేధం విధిస్తారు’అని ఆమె పార్టీ కార్యాలయంలో ఆరోపించారు. -
కేజ్రీవాల్కు జమాతే ఇస్లామీ మద్దతు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్కు జమాత్-ఎ-ఇస్లామీ హింద్ మద్దతు ప్రకటించింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా ఇక్కడి నుంచే బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. కాగా వారణాసిలో ముస్లిం ఓటర్ల సంఖ్య కూడా గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉండడంతో బరిలో ఉన్న నేతలు వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ముస్లిం సంఘాల పెద్దలను కలిసి తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. దీంతో జమాత్-ఎ-ఇస్మామీ హింద్, ఉత్తరప్రదేశ్ విభాగం కేజ్రీవాల్కు మద్దతు ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అఖిల భారత ఇస్లాం సంస్థల అధ్యక్షుడు మౌలానా సయ్యద్ జలాలుద్దీన్ ఉమారి ఇప్పటికే కేజ్రీవాల్కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. కాశీలోనే బీజీపీ నేతల మకాం వారణాసి నుంచి బరిలోకి దిగిన తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ గెలుపు కోసం రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులంతా అక్కడే మకాం వేశారు. ఢిల్లీలో ఎన్నికలు ముగియడంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలు, కార్యకర్తలు ఇప్పుడు తమ దృష్టినంతా వారణాసిపైనే కేంద్రీకరించారు. వారణాసిలో ఆఖరి దశలో పోలింగ్ జరగనుండడంతో నాయకులు, కార్యకర్తలు అక్కడ ప్రచారం చేస్తున్నారు. విజయ్గోయల్, విజేంద్ర గుప్తా, శోభా విజేంద్ర గుప్తా, రాజీవ్ బబ్బర్ , నళిన్ కోహ్లీ వంటి నేతలు ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. మరికొంతమంది వారణాసికి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ఢిల్లీలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం పలువురు స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రచారం కోసం అమృత్సర్కు తరలివెళ్లారు. అక్కడ నుంచి బరిలోకి దిగిన అరుణ్జైట్లీ తరపున ప్రచారం చేశారు. అమృత్సర్లో కూడా పోలింగ్ ఏప్రిల్ 30న ముగియడంతో ఇప్పుడు అంతా వారణాసిపైనే దృష్టి సారించారు. శోభా విజేంద్ర గుప్తా ఐటీ విభాగపు కార్యకలాపాలను పర్యవేక్షిస్తుండగా రాజీవ్ బబ్బర్ కార్యకర్తల సమీకరణలో నిమగ్నమయ్యారు. అరుణ్ జైట్లీతో పోలిస్తే మోడీ తరపున ప్రచారం చేయడం అత్యంత సులభమని వారంటున్నారు. పంజాబ్లో అకాళీదళ్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు ఇబ్బందికరంగా మారిందని, అయితే వారణాసిలో అటువంటి సమస్యలేవీ లేవంటున్నారు. కాగా వారణాసిలో ఈ నెల 12వ తేదీన పోలింగ్ జరగనుంది. -
సోనార్ బంగ్లాకు దారేదీ!
విశ్లేషణ: ఆగస్టు 1న బంగ్లా హైకోర్టు జమాత్ గుర్తింపును రద్దు చేసింది. ఫలితంగా ఎన్నికలలో పోటీకి అర్హత కోల్పోయింది. మరో 6 మాసాలలో బంగ్లా ఎన్నికలు జరగబోతున్నాయి. అగ్ర నాయకులకు వరసగా పడుతున్న కఠిన శిక్షలతో ఉడికిపోతున్న జమాత్ సంస్థకు హైకోర్టు తీర్పుతో పుండు మీద కారం చల్లినట్లయింది. హైకోర్టు తీర్పు మీద స్టే విధించాలని కోరుతూ ఆ పార్టీ దాఖలు చేసుకున్న పిటిషన్ను సుప్రీం కోర్టు కూడా కొట్టివేస్తూ, హైకోర్టు తీర్పును సమర్థించింది. దీనితో హింసాకాండ మరింత పెరిగింది. భారత్ను గాయపరుస్తూ, తనూ గాయపడి పుట్టిన దేశం పాకిస్థాన్. పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించినప్పుడు కూడా చరిత్ర పునరావృతమైంది. ఆ చిన్నదేశం పెద్ద గాయంతోనే పుట్టింది. మాతృభాషాభిమానం (బెంగాలీ), ఆత్మగౌరవ నినాదం రగులుకుని అంతర్యు ద్ధంగా పరిణమించి దాని నుంచి బంగ్లాదేశ్ 1971, డిసెం బర్ 16న అవతరించింది. 1971 నాటి ఆ పరిణామాలు ఇప్పటికీ బంగ్లాను వెంటాడుతూనే ఉన్నాయి. ఆనాటి గాయాలు ఇంకా మానలేదు. నాటి అంతర్యుద్ధంలో జరి గిన ఘోరాల మీద ఇప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం నియమించిన అంతర్జాతీయ యుద్ధ నేరాల విచారణ ట్రిబ్యునల్ ఒక్కొక్క తీర్పూ వెల్లడిస్తూ ఉంటే, ఆ చిన్న దేశం హింసతో, రక్తపాతంతో తల్లడిల్లిపోతోంది. అంతర్యుద్ధం లో పాకిస్థాన్ సైన్యాల అండతో, స్వతంత్ర బంగ్లాదేశ్ వాదులను, హిందువులను, స్వతంత్ర బంగ్లా వాదనను సమర్థించిన రచయితలను, మేధావులను, పత్రికా రచయితలను ఊచకోత కోసిన జమాతే ఇస్లామీని, ఇంకొన్ని ఇతర సంస్థలనూ హసీనా ప్రభుత్వం విచారణ ట్రిబ్యునల్ ఎదుట నిలబెట్టింది. దీనితో తీవ్ర పర్యవసానాలు చోటు చేసుకున్నాయి. పుట్టుక నాటి గాయాల లోతు ఎంతటిదో మళ్లీ అనుభవానికి వచ్చింది. స్వతంత్ర దేశ చరిత్రలో ఏనాడూ లేనంత అలజడి, రక్తపాతాలతో బంగ్లా తల్లడిల్లిపోతున్నది. అంతర్యుద్ధం తొమ్మిది మాసాల కాలంలో జరి గిన అకృత్యాలు మానవతకు మచ్చ తెచ్చేవే. దీనికి కేంద్రబిందువు జమాత్. ఇది బంగ్లాలో అతి పెద్ద మత రాజకీయాల వేదిక. 1971లో జమాత్ పాక్ సేనలతో, బంగ్లాలో పాక్ సేనలకు తొత్తులుగా ఉన్న రజాకార్లు, అల్ బదర్, అల్ షామ్స్ వంటి మత సంస్థలతో కలిసి ఈ అకృత్యాలకు పాల్పడిందని ఆరోపణ. పాక్సేనలు ఢాకాలో లొంగిపోయిన తరువాత బంగ్లాదేశ్ స్వతంత్ర గడ్డగా నిలబడింది. కొత్తలో బంగ్లా విముక్తి పోరాట యోధుడు, అవామీ లీగ్ నాయకుడు, ‘బంగ్లాబంధు’ షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో కలకత్తాలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం కొద్దికాలం(1971 ఏప్రిల్) ఆ చారిత్రక నగరం నుంచే నడిచింది. కానీ మూడేళ్లకి, 1975, ఆగస్టు 15న ముజిబుర్ రె హమాన్నూ, కుటుంబ సభ్యులనూ తిరుగుబాటు బృందం ఢాకాలోనే కాల్చి చంపింది. ముజిబుర్ ఐదుగురు కుమార్తెలలో ఇద్దరు విదేశాలలో ఉండటంతో బతికి బయటపడ్డారు. ప్రస్తుత అధ్యక్షురాలు, యుద్ధ నేరాల ట్రిబ్యునల్ను ఏర్పా టు చేసిన షేక్ హసీనా బంగ్లా బంధు పెద్ద కుమార్తె. బం గ్లాదేశ్ అవామీ లీగ్ ప్రస్తుత నేత హసీనాయే. అవామీ లీగ్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) బంగ్లా ప్రధాన పక్షాలు. బీఎన్పీకీ, జమాత్కూ పొత్తు ఉంది. ప్రస్తుత ఘర్ణణలో ఈ మూడు పార్టీలు అనుసరిస్తున్న వైఖరికి పునాది వాటి ఆవిర్భావంలోనే ఉంది. జమాత్ను 1941, ఆగస్టు 26న అబుల్ అలా మౌదుది లాహోర్లో స్థాపించాడు. పాకిస్థాన్ విభజన నినాదం ఊపందుకున్న నేపథ్యంలో ఇది జరిగింది. ఇస్లామిజమ్, ఇస్లామిక్ డెమోక్రసీలు లక్ష్యమని ఇది చెబుతుంది. షరి యత్ అమలు, సామాజిక - రాజకీయ ఇస్లాం కూడా ఆశయంగా చెప్పుకుంటుంది. కానీ సాంఘికంగా యథాపూర్వ వ్యవస్థ నిర్మితం కావాలన్నదే దాని అసలు లక్ష్యం. ఈజిప్ట్లోని ‘బ్రదర్హుడ్’తో సన్నిహిత సంబంధాలు నెరపుతోంది. మరో మూడు చోట్ల జమాత్ ఉనికి కనిపిస్తుంది. బంగ్లా జమాత్, జమాతే ఇస్లామీ హింద్ (భారత్), జమా త్ ఇస్లామీ అఫ్ఘానిస్థాన్. ఈ మూడింటి మధ్య సంబంధాలున్నాయి. 1971 నాటి బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటాన్ని పాకిస్థాన్ జమాత్ వ్యతిరే కించింది. బీఎన్పీని 1978లో జియావుర్ రెహమాన్ స్థాపించాడు. ప్రస్తుత నేత ఖలేదా జియా, రెహమాన్ సతీమణి. జాతీయవాదం మినహా మిగిలిన సిద్ధాంతాలలో జమాత్కూ, బీఎన్పీకీ దగ్గర పోలికలున్నాయి. ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి షేక్ హసీనా రాజకీయ కక్షకు పాల్పడుతున్నారనీ, విపక్షాలను బలహీనం చేయచూస్తున్నారని బీఎన్పీ నేత ఖలేదా జియా ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అవామీ లీగ్ 1949, జూన్ 23న మౌల్వీ అబ్దుల్ హమీద్ ఖాన్ బాషానీ స్థాపించాడు. లౌకికవాదం, జాతీయవాదం, ప్రజాస్వామ్యం దీని ఆశయాలు. అందుకే ముక్తివాహిని స్థాపకుడు ఎంఏజీ ఉస్మానీతో కలిసి అంతర్యుద్ధం చేసింది. షేక్ ముజిబుర్ రెహమాన్ ఈ పార్టీ నాయకుడే. ట్రిబ్యునల్ ఏర్పాటు గురించి 2008 ఎన్నికల ప్రచారంలో హసీనా వాగ్దానం చేశారు. ఆమె ప్రభుత్వం ఏర్ప డిన తరువాత 2010లో ఈ ట్రిబ్యునల్ పని ప్రారంభమైం ది. ఐక్యరాజ్యసమితి చట్టం మేరకు సమితికి చెందిన హ్యూ మన్ రైట్స్ వాచ్ మద్దతుతోనే ఈ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. 2008లోనే ఏర్పాటు చేసిన యుద్ధ నేరాల నిజనిర్ధారణ సంఘం తన నివేదికను కూడా అప్పుడే సిద్ధం చేసింది. ఈ నివేదిక మొత్తం 1,600 మందిని అనుమానితులుగా నమో దు చేసింది. 2012 సంవత్సరానికి తొమ్మిది మంది మీద అభియోగాలు నమోదైనాయి. ఒక్కొక్కరిమీద ఐదు నుంచి ఏడు వరకు అభియోగాలు నమోదయ్యాయి. వాటిలో ఐదు వరకు రుజువైనట్టు ప్రకటిస్తూ ట్రిబ్యునల్ ఆ తీర్పు లు వెల్లడిస్తున్నది. ఇందులో ఏడుగురు జమాత్ పార్టీ వారు కాగా, బీఎన్పీ వారు ఇద్దరు. 2008కి ముందు జమాత్తో కలిసి బీఎన్పీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఒక్క పార్టీయే ఇప్పుడు జమాత్ రక్షణకు పూనుకుంది. జమాత్ విద్యార్థి విభాగం ఇస్లామీ ఛాత్ర శిబిర్ 2012, డిసెంబర్ 4న ఆందోళనలను ఆరంభించింది. తమ నాయకులను విడిచిపెట్టి, ట్రిబ్యునల్ను శాశ్వతంగా మూసివేయాలని శిబిర్ కోరుతోంది. 2013, జనవరి 1న ట్రిబ్యునల్ తన తొలి తీర్పును ప్రకటిస్తూ, అబుల్ కలాం ఆజాద్ (బచూచు)కు ఉరిశిక్ష విధించింది. కానీ ఇతడు ఎప్పుడో దేశం విడిచిపెట్టి పారి పోయాడు. ఆజాద్ పాకిస్థాన్లోనే ఉన్నాడని బంగ్లా పోలీ సులు వాదిస్తున్నారు. మొదటి తీర్పు వెలువడిన నాటి నుంచే ప్రధానంగా శిబిర్ రక్తపాతం మొదలుపెట్టి ఎడతెరిపిలేకుండా సాగిస్తోంది. ఫిబ్రవరి, 2013లో జమాత్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఖాదిర్ మొల్లాకు ట్రిబ్యునల్ జీవిత ఖైదు విధించింది. 1971లో ఖాదిర్ 344 మందిని కాల్చి చంపాడన్నది అభియోగం. ఈ ఫిబ్రవరి 28న మరో ప్రముఖుడు దెల్వర్ హుసేన్ సయ్యిద్కూ, మే 9న మహమ్మద్ ఖమ్రుద్దీన్ అనే మరో నాయకుడికి కూడా మరణ శిక్ష పడింది. జూలై 15న గులాం ఆజం అనే జమాత్ నాయకుడికి 90 సంవత్సరాల కారాగారశిక్ష విధించారు. రెండు రోజుల తరువాత అలీ హసన్ అనే మరో నాయకుడికి కూడా మరణదండన విధించారు. మరో ఏడుగురి శిక్ష ఖరారు కావలసి ఉంది. ఆ తీర్పులన్నీ కొన్ని మాసాలలోనే వెలువడతాయి. హసీనా ప్రభుత్వం, కొందరు ఇతర మేధావుల ప్రకారం, పాకిస్థాన్ 1971 అంతర్యుద్ధంలో 30 లక్షల మంది బంగ్లా దేశీయులను చంపింది. 2 లక్షల మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. 10 లక్షల మంది బంగ్లా పౌరులు భారత సరిహద్దులలో తలదాచుకున్నారు. బంగ్లా శరణార్థుల అంశం అప్పుడు మనదేశం ఎదుర్కొన్న పెద్ద సమస్యలలో ఒకటి. ఒక్కొక్క తీర్పూ వెలువడుతూ ఉంటే బంగ్లా ప్రజలు, ముఖ్యంగా హిందువులు, మేధావులు గడగడలాడిపోతున్నారు. 1971 నాటి రక్తపాతాన్ని గుర్తుకు తెచ్చేందుకు జమాత్ కార్యకర్తలు, అనుబంధ సంస్థల కార్యకర్తలు రెచ్చి పోతున్నారు. ఫిబ్రవరి 5 నుంచి, మార్చి 7 వరకు జరిగిన హింసాకాండలో వందమంది చనిపోయారు. మూడో తీర్పు వెలువడిన తరువాత మరో 67 మంది వరకు చని పోయారు. 10 వేల మంది జమాత్ మద్దతుదారులు ఆయుధాలతో ప్రభుత్వ కార్యాలయాల మీద, పోలీసు స్టేషన్ల మీద దాడులకు దిగడంతో చాలా ప్రాంతాలలో రక్షక దళాలను మోహరించవలసి వచ్చింది. ఈ నేపథ్యం లోనే జమాత్ను నిషేధించాలని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీనితో మళ్లీ హింస చెలరేగింది. ప్రపంచ దేశాలలో ఈ ట్రిబ్యునల్ మీద ఏకాభిప్రాయం లేదు. టర్కీ అధ్యక్షుడు అబ్దుల్లా అభియోగాలను ఎదుర్కొంటున్నవారికి క్షమాభిక్ష పెట్టాలని లేఖ రాయగా, యూరోపియన్ పార్లమెంట్ ఈ విచారణ పట్ల హర్షం వ్యక్తం చేసింది. కానీ బంగ్లాదేశ్ పౌరులు జమాత్ మీద పెంచుకున్న ఆగ్రహాన్ని బట్టి చూస్తే హసీనాలో కక్ష సాధిం పు యోచన కంటె రాజకీయంగా, చారిత్రకంగా, దేశ రక్షణ కోసం నిర్వర్తించవలసిన గురుతర బాధ్యతను నెరవేర్చే పనిలో ఉన్నారని అనిపిస్తుంది. బంగ్లా న్యాయస్థానాల వైఖరి కూడా జమాత్కు వ్యతిరేకమే. జమాత్ మీద నిషే ధం ‘సంతోషం కలిగించే వార్త’ అని వివాదాస్పద బంగ్లా రచయిత్రి తస్లిమా నస్రీన్ వ్యాఖ్యానించింది. లౌకికవాదం పునాదిగా ముందడుగు వేయాలన్న బంగ్లా ఆకాంక్షకు జమాత్ అతి పెద్ద అవరోధమన్న వాదన సర్వత్రా బలం పుంజుకుంది. మతోన్మాదాన్ని ఆశ్రయించి మనుగడ సాగిస్తున్న సంస్థలను నిషేధించాలని కోరుతూ ఈ జనవరిలో ఢాకాలోని షాబాగ్ కూడలిలో పెద్ద ప్రజా ప్రదర్శన జరిగింది. తరీఖత్ సమాఖ్య 2009, జనవరి 25న జమాత్ గుర్తింపును రద్దుచేయాలని ఢాకా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తరీఖత్ సూఫీ సిద్ధాం తాన్ని నమ్మే చిన్న మత సంస్థ. అంతగా పేరు లేని ఈ సంస్థ మరో 24 మందితో కలిసి కోర్టుకెక్కింది. దీనితో ఈ ఆగస్టు 1న బంగ్లా హైకోర్టు జమాత్ గుర్తింపును రద్దు చేసింది. ఫలితంగా ఎన్నికలలో పోటీకి అర్హత కోల్పోయిం ది. మరో 6 మాసాలలో బంగ్లా ఎన్నికలు జరగబోతున్నాయి. అగ్ర నాయకులకు వరసగా పడుతున్న కఠిన శిక్షలతో ఉడికిపోతున్న జమాత్ సంస్థకు హైకోర్టు తీర్పుతో పుండు మీద కారం చల్లినట్లయింది. హైకోర్టు తీర్పు మీద స్టే విధించాలని కోరుతూ ఆ పార్టీ దాఖలు చేసుకున్న పిటిషన్ను సుప్రీం కోర్టు కూడా కొట్టివేస్తూ, హైకోర్టు తీర్పును సమర్థించింది. దీనితో హింసాకాండ మరింత పెరిగింది. ప్రస్తుత పరిణామాలు బంగ్లాదేశ్కు అగ్నిపరీక్ష. వీటి నుంచి బంగ్లా బయటపడటం అంటే మతోన్మాదం పిడికిలి నుంచి బయటపడటమే. అది బంగ్లాకు పెద్ద వరమైతే, భారత్కు పెద్ద ఊరట. - డాక్టర్ గోపరాజు నారాయణరావు