రేసులో వివేక్, సర్వే, రాజయ్య..
న్యూఢిల్లీ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. వరంగల్ అభ్యర్థి ఎంపికపై బుధవారం హైకమాండ్తో ఆయన చర్చించనున్నారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక అభ్యర్థి రేసులో వివేక్, సర్వే సత్యనారాయణ, సిరిసిల్ల రాజయ్య ఉన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అనంతరం వరంగల్ అభ్యర్థిపై ప్రకటన చేస్తారు.