Gold Demand Jewelery purchases
-
బంగారమా..? మాకొద్దు బాబోయ్..!
బంగారం డిమాండ్ ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (మార్చి త్రైమాసికం) 15 శాతం తగ్గి 118.1 టన్నులుగా ఉంది. విలువ పరంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే మాత్రం 22 శాతం వృద్ధితో రూ.94,030 కోట్లుగా నమోదైంది. ఈ వివరాలను వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) విడుదల చేసింది. 2025-26లో భారత్ నుంచి పసిడి డిమాండ్ 700–800 టన్నుల మేర ఉండొచ్చని అంచనా వేసింది.‘ధరలు పెరగడంతో కొనుగోలు శక్తిపై ప్రభావం పడింది. అయినప్పటికీ సాంస్కృతికంగా ఉన్న ప్రాధాన్యం.. అక్షయ తృతీయకుతోడు వివాహాల సీజన్ కావడంతో కొనుగోళ్లకు డిమాండ్ కొనసాగుతోంది’ అని డబ్ల్యూజీసీ ఇండియా సీఈవో సచిన్ జైన్ మార్చి త్రైమాసిక నివేదికలో తెలిపారు. ధరలు గణనీయంగా పెరిగిపోవడంతో వినియోగదారులు లైట్ వెయిట్ ఆభరణాల కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు జ్యుయలర్లు చెబుతున్నారు. ముఖ్యంగా మే చివరి వరకు వివాహాలు ఉండడం, భారతీయ సంస్కృతిలో బంగారం ఆభరణాలకు ఉన్న ప్రాధాన్యంతో కొనుగోళ్లకు డిమాండ్ కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు. పసిడిపై జోరుగా పెట్టుబడులుఇక ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో బంగారంపై పెట్టుబడులకు డిమాండ్ కొనసాగింది. క్రితం ఏడాది మొదటి మూడు నెలలతో పోల్చి చూస్తే 7 శాతం అధికంగా 46.7 టన్నులుగా నమోదైంది. క్రితం ఏడాది మొదటి త్రైమాసికంలో పసిడి పెట్టుబడుల డిమాండ్ 43.6 టన్నులుగా ఉంది. అంతర్జాతీయంగా భౌగోళిక, వాణిజ్య ఉద్రిక్తతలతో ఈక్విటీ మార్కెట్లు ఆటుపోట్లను చూస్తున్న తరుణంలో.. ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సురక్షిత సాధనంగా బంగారాన్ని పరిగణిస్తుండడం ఇందుకు నేపథ్యంగా ఉంది.ఆభరణాల డిమాండ్లోనూ క్షీణతే..ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో బంగారం ఆభరణాల డిమాండ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 25 శాతం తగ్గి 71.4 టన్నులుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 95.5 టన్నులుగా ఉంది. 2020 నుంచి చూస్తే ఒక ఏడాది మొదటి త్రైమాసికంలో కనిష్ట ఆభరణాల డిమాండ్ ఇదే కావడం గమనార్హం. క్రితం ఏడాది మొదటి క్వార్టర్తో పోలిస్తే ఆభరణాల కొనుగోళ్ల విలువ 3 శాతం పెరిగింది. ఇదీ చదవండి: మంచి తరుణం మించి పోరాదు! పసిడి తులం ఎంతంటే..పెరిగిన దిగుమతులుపసిడి దిగుమతులు 8 శాతం పెరిగి 167.4 టన్నులుగా ఉన్నాయి. రీసైక్లింగ్ పరిమాణం 32 శాతం తగ్గి 26 టన్నులుగా నమోదైంది. అధిక ధరల నేపథ్యంలో వినియోగదారులు పాత ఆభరణాలను తమవద్ద ఉంచుకునేందుకు మొగ్గు చూపించడం ఇందుకు కారణం. ఇక అంతర్జాతీయంగా ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో బంగారం డిమాండ్ ఒక శాతం పెరిగి 1,206 టన్నులుగా ఉంది. -
పుత్తడి డిమాండ్ తగ్గింది!!
మే-జూన్లో దేశీయంగా రివర్స్ ట్రెండ్: డబ్ల్యూజీసీ ముంబై: పసిడి డిమాండ్ భారత్లో ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) 131 టన్నులుగా నమోదయ్యింది. 2015 ఇదే కాలంలో పోల్చిచూస్తే. ఈ డిమాండ్ 18 శాతం పడిపోయింది. అప్పట్లో ఈ డిమాండ్ 159.8 టన్నులుగా ఉంది. డబ్ల్యూజీసీ భారత్ వ్యవహారాల ఎండీ సోమసుందరం వెల్లడించిన వివరాల్లో ముఖ్యమైనవి... ⇒ క్యూ2లో డిమాండ్ విలువ రూపంలో 8.7 శాతం తగ్గింది. రూ.38,890 కోట్ల నుంచి రూ.35,500 కోట్లకు చేరింది. ⇒ కొనుగోళ్లకు పాన్కార్డుల్ని తప్పనిసరి చేయటం, మూలం వద్ద పన్ను వసూలు, ఆభరణాలపై ఎక్సైజ్ సుంకం, గ్రామీణ డిమాండ్ బలహీనత సహా ధరలు పెరుగుదల, వర్తకుల సమ్మె డిమాండ్ భారీగా తగ్గడానికి కారణం. ⇒ ఆభరణాలకు డిమాండ్ 20 శాతం పడిపోయి 122.1 టన్నుల నుంచి 97.9 టన్నులకు చేరింది. ఆభరణాల డిమాండ్ విలువ రూపంలో చేస్తే ఈ రేటు 11 శాతం పడిపోయింది. రూ.29,720 కోట్ల నుంచి రూ.26,520 కోట్లకు దిగింది. ప్రపంచవ్యాప్తంగా 15 శాతం అప్ ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. పసిడి డిమాండ్ రెండవ త్రైమాసికంలో 15 శాతం పెరిగింది. ఈ కాలంలో 1,050 టన్నులుగా నమోదయ్యింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో పెరిగిన పెట్టుబడుల డిమాండ్ దీనికి ప్రధాన కారణమని డబ్ల్యూజీసీ పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో డిమాండ్ 910 టన్నులు.