-
ఎల్లలు దాటనున్న మాడుగుల హల్వా!
సాక్షి, విశాఖపట్నం : నోట్లో వేసుకోగానే మైమరపించే మాడుగుల హల్వా రుచిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీనిని ప్రత్యేక పరిశ్రమగా అభివృద్ధి చేయడంతో పాటు.. భౌగోళిక గుర్తింపు తీసుకొచ్చేందుకు అడుగులేస్తోంది. ఇందుకోసం దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఒప్పందం కుదుర్చుకుంది. జీడి పప్పు.. బాదం పలుకులు.. కవ్వంతో చిలికిన ఆవు నెయ్యి, ఎండు ఖర్జూరం నీళ్లు, తేనే.. గోధుమ పాలు.. వీటన్నింటినీ రాతి రుబ్బు రాయితో గంటల పాటు సానబెట్టి.. ఆపై కట్టెల పొయ్యిలో తగిన ఉష్ణోగ్రతలో తగిన పాకంతో పదునుపెట్టగానే పుట్టుకొస్తుందీ హల్వా. మాడుగులలో 1890వ సంవత్సరంలో దంగేటి ధర్మారావు కుటుంబం మాత్రమే దీనిని తయారు చేసేది. ప్రస్తుతం ఈ వ్యాపారంపై అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 5 వేల మందికి పైగా నిరుపేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మొట్టమొదటిగా ‘మాడుగుల హల్వా’ ఎంపిక మాడుగుల హల్వా వ్యాపారాన్ని మరింత వృద్ధిలోకి తేవడమే కాకుండా విదేశాల్లో దర్జాగా విక్రయించేందుకు అవసరమైన చేయూతనందించేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించనుంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ)లో భాగంగా ఈ పరిశ్రమని అభివృద్ధి చేయనుంది. ఇందుకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు సమకూరుస్తాయి. యంత్రాల్ని సమకూర్చడం, స్కిల్స్ అప్గ్రేడ్ చేయడం, ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ వంటివి కల్పిస్తారు. వీటితో పాటు.. మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ఇందుకోసం రాష్ట్రంలో తొలిసారి మాడుగుల హల్వాని ఎంపిక చేశారు. ఇకపై ఈ హల్వా.. ఒక బ్రాండెడ్ ప్రొడక్ట్గా మార్కెట్లో లభించనుంది. ఇందుకు కావాల్సిన వసతుల్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. పథకంలో భాగంగా ఏడాది పాటు ప్యాకేజింగ్ మెటీరియల్, గోదాముల్లో నిల్వ చేసుకునేందుకు అద్దె, రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వమే అందిస్తుంది. ఎలాంటి పెట్టుబడి భారం లేకుండా హల్వాని విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన వ్యయంలో 50 శాతం వరకూ గ్రాంట్ కింద ప్రభుత్వం సమకూరుస్తుంది. భౌగోళిక గుర్తింపునకు ఒప్పందం.. వందేళ్ల చరిత్ర గల మాడుగుల హల్వాకు భౌగోళిక గుర్తింపు తెచ్చేందుకు దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంతో ఏపీ ఫుడ్ప్రాసెసింగ్ సొసైటీ శుక్రవారం ఎంవోయూను కుదుర్చుకుంది. ఈ గుర్తింపు కోసం అవసరమయ్యే రుసుములు, ఇతర ఖర్చులకు సంబంధించి రూ.3 లక్షల వరకూ ప్రభుత్వమే భరించనుంది. వచ్చే ఆరు నెలల్లోపు మాడుగుల హల్వాకు కూడా భౌగోళిక గుర్తింపు వచ్చే అవకాశాలున్నాయి. ఈ గుర్తింపు వస్తే ఇక ఈ పేరుతో ఇక్కడి నుంచి తప్ప మరెవరూ, ఎక్కడా మాడుగుల హల్వాను తయారు చేయలేరు. వారసత్వ సంపదగా గుర్తింపు వందల ఏళ్ల చరిత్ర కలిగిన అనేక తినుబండారాలు తయారు చేసే పరిశ్రమలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ చిరు వ్యాపారం మాదిరిగానే మిగిలిపోయాయి. వాటన్నింటినీ అభివృద్ధి చేసి.. వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే మాడుగుల హల్వాకు భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మాదిరిగా దీని అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నాం. ఆ తర్వాత మిగిలినవాటిపైనా దృష్టిపెడతాం. – కేజే మారుతి, ఏపీ ఫుడ్ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ -
జీఐ జర్నల్లో తాండూరు కంది ప్రత్యేకతలు
సాక్షి, హైదరాబాద్: గతేడాది డిసెంబర్లో తెలంగాణ నుంచి భౌగోళిక గుర్తింపు (జీఐ) సాధించిన వికారాబాద్ జిల్లా తాండూరు కందికి సంబంధించిన ప్రత్యేకతలను తాజాగా కేంద్రం ‘జీఐ జర్నల్’లో పొందుపరిచింది. వండిన పప్పు ఎక్కువకాలం నిల్వ ఉండటం, తొందరగా ఉడకడం, మంచి రుచి, వాసన తాండూరు కంది ప్రత్యేకతలని పేర్కొంది. అలాగే సానుకూల వాతావరణ పరిస్థితులు, రైతులు ఆచరించే సంప్రదాయ, ఆధునిక యాజమాన్య సాగు పద్ధతుల మూలంగా దీనికి ప్రత్యేక గుర్తింపు లభించిందని వివరించింది. తాండూరు ప్రాంతంలో ఉన్న సున్నపురాయి నిక్షేపాల వల్ల వచ్చే పోషక నాణ్యతలే దీనికి కారణమని వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాలలో 1.48 లక్షల ఎకరాల్లో కంది సాగు జరుగుతుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు కోసం వివిధ రంగాల నుంచి వెయ్యి దరఖాస్తులు రాగా వాటిలో 432 ఉత్పత్తులకు మాత్రమే భౌగోళిక గుర్తింపు లభించిందని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ ఏర్పడ్డాక ఆరింటికి.. తెలంగాణ ప్రాంతానికి చెందిన మొత్తం 16 ఉత్పత్తులకు ఇప్పటివరకు జీఐ హోదా లభించగా వాటిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆరు ఉత్పత్తులు ఈ ఘనత సాధించాయి. రాష్ట్రం ఏర్పడ్డాక ఈ హోదా పొందిన వాటిలో పుట్టపాక తేలియ రుమాలు (2015), బంగినపల్లి మామిడి (2017), ఆదిలాబాద్ ఢోక్రా, వరంగల్ డురీస్ (2018), నిర్మల్ పెయింటింగ్ (2019), తాండూరు కంది (2022) ఉన్నాయి. తాజాగా తాండూరు కంది భౌగోళిక గుర్తింపు సాధించిన నేపథ్యంలో ఆ ప్రాంత రైతులు, వ్యవసాయ విద్యాలయం సంచాలకుడు డాక్టర్ జగదీశ్వర్, కంది పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అభినందించారు. ఈ నెల 31న కంది పరిశోధనా కేంద్రంలో తాండూరు రైతులు, శాస్త్రవేత్తలను అభినందిస్తామని ఆయన పేర్కొన్నారు. -
మేడిన్ ఆంధ్రా బ్రాండింగ్..ఎగుమతుల్లో జోష్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా పలు దేశాల్లో ఉన్న మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుంటూ రాష్ట్ర ఎగుమతులను పెంచే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో మేడిన్ ఆంధ్రా బ్రాండ్కు ప్రచారం కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యంగా మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఉత్పత్తులను గుర్తించి, ఆ దేశాల్లో మరింతగా విస్తరించడానికి కావాల్సిన నాణ్యతా ప్రమాణాలను ఏ విధంగా పాటించాలన్నదానిపై ఎగుమతిదారులకు అవగాహన కల్పిస్తుండటంతో గత మూడేళ్లలో రాష్ట్ర ఎగుమతులు 50 శాతం మేర వృద్ధి చెందాయి. తొలిసారి 2019–20లో రూ.లక్ష కోట్లు దాటిన రాష్ట్ర ఎగుమతులు.. మూడేళ్లు గడిచేసరికి రూ.లక్షన్నర కోట్ల మార్కును అందుకుంటున్నాయి. 2019–20లో రూ.1,04,829 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఎగుమతులు 2020–21లో రూ.1,24,744, 2021–22లో రూ.1,43,843 కోట్లుగా నమోదయయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నాటికి రాష్ట్రం నుంచి రూ.93,938 కోట్ల విలువైన ఎగుమతులు జరగ్గా, మార్చి నాటికి ఈ విలువ లక్షన్నర కోట్లకు అధిగమిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగుమతుల్లో కీలకమైన క్వాలిటీ సర్టిఫికెట్పై అవగాహన కల్పిస్తుండటంతో ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో భారీ వృద్ధి నమోదవుతోంది. 2020–21లో కూరగాయలు, పండ్లు ఎగుమతుల విలువ రూ.12,160.24 కోట్లుగా ఉంటే.. ప్రభుత్వ చర్యలతో ఆ తర్వాత రూ.14,060.14 కోట్లకు చేరింది. అలాగే ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ.8,286.21 కోట్ల నుంచి రూ.12,777.56 కోట్లకు పెరిగింది. జిల్లాల వారీగా ఉత్పత్తుల ఎంపిక రాష్ట్రంలో ఎగుమతులను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2021లో వాణిజ్య ఉత్సవ్ సందర్భంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 26 జిల్లాలకు విడివిడిగా ఎక్స్పోర్ట్ యాక్షన్ ప్లాన్ను తయారు చేసి, ఎగుమతులను పెంచే విధంగా జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా ఒక ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేసింది. జిల్లాల వారీగా ఎగుమతికి అవకాశం ఉన్న ఉత్పత్తులను గుర్తించి, వాటిని మరింతగా ఎగుమతి చేసే విధంగా వివిధ దేశాల్లోని కొనుగోలుదారులతో చర్చలు జరపడం ద్వారా మార్కెట్ను విస్తృత పరుస్తోంది. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లా కొబ్బరి పీచు, జీడిపప్పు, నర్సరీ ఉత్పత్తుల ఎగుమతిలో ముందంజలో ఉంది. ఈ జిల్లా నుంచి దిగుమతి చేసుకునే దేశాలను గుర్తించి, అక్కడ మార్కెట్ అవకాశాల విస్తరణపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా యూఏఈ, ఇజ్రాయిల్, కువైట్, వియత్నాం రాయబారులతో నేరుగా చర్చలు జరిపి ఎగుమతి అవకాశాలను ప్రోత్సహించడం సత్ఫలితాలు ఇచ్చింది. 2020–21లో వియాత్నంకు రూ.2,262.58 కోట్లుగా ఉన్న ఎగుమతుల విలువ ఈ చర్చల తర్వాత 2021–22లో రూ.3,833.08 కోట్లకు చేరింది. యూఏఈకి ఎగుమతులు రూ.2,941.04 కోట్ల నుంచి రూ.5,099.24 కోట్లకు చేరాయి. ముఖ్యంగా ఆయా జిల్లాలకు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన ఉత్పత్తులను గుర్తించి వాటికి జీయోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ (జీఐ) గుర్తింపు తీసుకువచ్చి, నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి చేసే విధంగా ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం గతంలో మూత పడిన ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్(ఏపీటీపీసీ)ను పునరుద్ధరించి ఎగుమతులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకునే బాధ్యతను అప్పగించింది. రూ.30,000 కోట్లతో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖలో మేజర్ పోర్టుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 5 మైనర్ పోర్టులు.. గంగవరం, కాకినాడ యాంకర్ పోర్టు, కాకినాడ డీప్ వాటర్ పోర్టు, రవ్వ క్యాపిటివ్ పోర్టు, కృష్ణపట్నం పోర్టులున్నాయి. వీటికి అదనంగా మరో నాలుగు గ్రీన్ ఫీల్డ్ పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రైవేట్ రంగంలో కాకినాడ గేట్వే పోర్టు, రాష్ట్ర మారిటైమ్ బోర్డు ద్వారా రామాయపట్నం పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో మచిలీపట్నం, భావనపాడు పోర్టు పనులు ప్రారంభించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఉన్న 5 మైనర్ పోర్టుల ద్వారా సగటున 100 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేస్తుండగా, కొత్తగా నాలుగు పోర్టులు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పోర్టుల నిర్వహణ సామర్థ్యాన్ని 2030 నాటికి 300 మిలియన్ టన్నులకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రామాయపట్నం పోర్టును డిసెంబర్ 2023 నాటికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న తొమ్మిది ఫిషింగ్ హర్బర్ల ద్వారా అదనంగా 4.5 లక్షల టన్నుల మత్స్య సంపద రావడమే కాకుండా, రాష్ట్ర స్థూల ఉత్పత్తికి అదనంగా రూ.1,000 కోట్లు వచ్చి చేరుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తీర ప్రాంత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం రూ.30,000 కోట్లకు పైగా వ్యయం చేస్తోంది. ఇదిలా ఉండగా కాకినాడ యాంకర్ పోర్టు నుంచి ఎగుమతులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోంది. 10 శాతం వాటా లక్ష్యం రాష్ట్రంలోని సుదీర్ఘ తీర ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానంగా దృష్టి సారించారు. ప్రస్తుతం దేశ ఎగుమతుల్లో నాలుగు శాతంగా ఉన్న రాష్ట్ర వాటాను 2030 నాటికి 10 శాతానికి పెంచాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హార్బర్ లేదా పోర్టు ఉండే విధంగా నాలుగు కొత్త పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం. ఇదే సమయంలో పోర్టులను అనుసంధానిస్తూ మౌలిక వసతులు, మల్టీ మోడల్ లాజిస్టిక్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. ఎగుమతుల వృద్ధి ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయంతో పాటు వేలాది మందికి ఉపాధి లభించనుంది. – గుడివాడ అమరనాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి విదేశీ మార్కెట్ విస్తరణపై దృష్టి ఇప్పుడు రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్న ఉత్పత్తులను ఆయా దేశాలు ఇంకా ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి.. పక్క దేశాలకు కూడా ఎగుమతి చేసే అవకావాలున్నాయా.. అన్న అంశాలను పరిశీలించి డేటాను క్రోడీకరిస్తున్నాం. ఇతర దేశాలతో పోటీపడుతూ ఆ దేశాల మార్కెట్కు విస్తరించడానికి ఎటువంటి మౌలిక వసతులు మెరుగుపర్చుకోవాలి.. ఇందుకోసం ఎటువంటి పథకాలను అమలు చేయాలన్న అంశాలను పరిశీలించి జిల్లాలు, ఉత్పత్తి ఆధారంగా కార్యచరణ ప్రణాళికను తయారు చేస్తున్నాం. విదేశాలతో పోటీ పడటానికి క్వాలిటీ సర్టిఫికేషన్పై ఎగుమతిదారులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికే తూర్పుగోదావరి, విశాఖ, గుంటూరు జిల్లాలకు సంబంధించి ఈ కార్యచరణ ప్రణాళిక పూర్తయ్యింది. త్వరలో మిగిలిన జిల్లాలకు సంబంధించి పూర్తి చేయనున్నాం. – జి.సృజన, డైరెక్టర్, పరిశ్రమల శాఖ ఈ కామర్స్ సంస్థలపై దృష్టి ప్రతి జిల్లా నుంచి ఎగుమతి అవకాశాలు ఉన్న ఉత్పత్తులను గుర్తించి, 2025 నాటికి ఎగుమతి లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. జిల్లా పారిశ్రామిక అధికారులు, ఏపీటీపీసీ అధికారులను సమన్వయం చేస్తూ రాష్ట్రంలోని ఎగుమతిదారులను గుర్తించి వారిని ట్రేడ్ పోర్టల్కు అనుసంధానం చేస్తున్నాం. అంతర్జాతీయంగా ఆన్లైన్ దిగ్గజ ఈకామర్స్ సంస్థలను గుర్తించి, వారి ఉత్పత్తులను ఇక్కడ నుంచి సరఫరా చేసే విధంగా లాజిస్టిక్ సప్లై చైన్స్ ఏర్పాటు చేసే విధంగా చర్చలు జరుపుతున్నాం. – జీఎస్ రావు, జాయింట్ డైరెక్టర్ (ఎక్స్పోర్ట్స్) 20 నుంచి 9వ ర్యాంకుకు వృద్ధి ఎగుమతులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఎగుమతుల వాణిజ్య పరిమాణం పెరగడమే కాకుండా, ఎగుమతుల సన్నద్ధత సూచీ ర్యాంకుల్లోనూ బాగా మెరుగుపడింది. నీతి ఆయోగ్ ఏటా ఎగుమతుల సన్నద్ధత సూచీ ర్యాంకులను ప్రకటిస్తుంది. ఎగుమతులు పెంచుకోవడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, సాధిస్తున్న ఫలితాల ఆధారంగా ఈ సూచీలో ర్యాంకులు నిర్ధారిస్తారు. 2020 సంవత్సరానికి నీతి ఆయోగ్ రూపొందించిన ఎగుమతుల సన్నద్ధత సూచీ 2020లో రాష్ట్రం 20వ స్థానంలో ఉండగా, 2021లో 9వ ర్యాంకుకు ఎగబాకింది. ప్రభుత్వ కృషి వల్ల ఎగుమతుల సన్నద్ధత సూచీలో ఏటా ఏపీ ర్యాంకు మెరుగు పడుతోందని నిపుణులు చెబుతున్నారు. -
మేఘాకు 12 ‘సిటీ గ్యాస్’ ఏరియాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిటీ గ్యాస్ పంపిణీ (సీజీడీ) ప్రాజెక్టు 11వ రౌండు బిడ్డింగ్లో ఇన్ఫ్రా దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) 12 జాగ్రఫికల్ ఏరియాలను (జీఏ)దక్కించుకుంది. వీటిలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల్లోని ఏరియాలు ఉన్నాయి. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ నియంత్రణ బోర్డు (పీఎన్జీఆర్బీ) శుక్రవారం ఈ వివరాలు వెల్లడించింది. మొత్తం 65 జీఏలకు బిడ్స్ ఆహ్వానించగా 61 ఏరియాలకు బిడ్స్ వచ్చాయి. వీటిలో 52 ఏరియాల ఫలితాలను ప్రకటించారు. ఎన్నికల కారణంగా 9 ప్రాంతాల ఫలితాలను ప్రకటించలేదు. వీటిల్లోనూ మరికొన్నింటిని ఎంఈఐఎల్ దక్కించుకునే అవకాశం ఉంది. తెలంగాణా విషయానికొస్తే జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తిలో సీజీడీ ప్రాజెక్టులో భాగంగా సిటీ గేట్ స్టేషన్, గ్యాస్ సప్లై పైప్లైన్లు.. సిఎన్జీ స్టేషన్లను నిర్మించి, ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇంటింటికీ గ్యాస్ సరఫరాకు సంబంధించి నల్గొండతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పైప్లైన్ నిర్మించడంతో పాటు 32 సీఎన్జీ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంఈఐఎల్ పేర్కొంది. అటు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాతో పాటు కర్ణాటకలో తుముకూరు, బెల్గావి జిల్లాల్లో మేఘా గ్యాస్ పేరిట గృహ, పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన గ్యాస్తో పాటు వాహనాలకు సీఎన్జీని కూడా అందిస్తున్నట్లు వివరించింది. -
తేలియా రుమాల్... కియా కమాల్
సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం పుట్టపాకలోని చేనేత హ్యాండ్లూమ్ క్లస్టర్ పరిధిలో తయారయ్యే తేలియా రుమాల్ వస్త్రానికి భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. ఇది దాదాపు పేటెంట్ హక్కుతో సమానం. ఈ నెల 10న చెన్నైలోని జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ కార్యాలయం ఆమోదం తెలపగా, ఈ విషయాన్ని జీఐ అధికారులు గురువారం పుట్టపాకకు చెందిన చేనేత కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధనాకు ఫోన్ ద్వారా తెలిపారు. తేలియా రుమాల్ అనే వస్త్రం ప్రాచీన కళకు సంబంధించింది. ఈ వస్త్రాన్ని సహజ రంగులు, ముడిపదార్థాలతో తయారు చేస్తారు. వేసవికాలం చల్లగా, చలికాలం వెచ్చగా ఉంటుంది. పుట్టపాకలోని చేనేత కళాకారులు ఈ వస్త్రాన్ని అభివృద్ధి చేసి చీరలు, దుప్పట్లు, డ్రెస్ మెటీరియల్ రూపాల్లో తయారు చేస్తున్నారు. 2017లో హ్యాండ్లూమ్ క్లస్టర్ పేరు మీద జీఐ కోసం దరఖాస్తు చేశారు. జీఐ అధికారులు పలుమార్లు ఇక్కడికి వచ్చి వస్త్రం తయారీని పరిశీలించారు. చివరికి పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యం గుర్తించి భౌగోళిక గుర్తింపు (జీఐ) ఇచ్చారు. ఇప్పుడు తేలియా రుమాల్ అనే వస్త్రం ఎక్కడ ఉన్నా, పుట్టపాకకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. జీఐ ఆధారంగా విదేశీయులు కూడా పుట్టపాకకు వచ్చే అవకాశం ఉంది. ఈ వస్త్రం తయారీ ద్వారానే పుట్టపాకలోని గజం గోవర్ధనా, గజం అంజయ్యతోపాటు ఎంతోమంది చేనేత కళాకారులు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, గుర్తింపు పత్రాలు అందుకున్నారు. శ్రమకు గుర్తింపు వచ్చింది పుట్టపాక చేనేత కళాకారుల శ్రమకు జీఐతో గుర్తింపు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ పటంలో పుట్టపాకకు గుర్తింపు ఉంటుంది. మాలో కొత్త ఉత్సాహం వచ్చింది. – గజం గోవర్ధనా, పద్మశ్రీ అవార్డు గ్రహీత
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement