-
‘రింగు’తో నగరానికి హంగు..
సాక్షి: ఆర్ఆర్ఆర్ పనులు చేపట్టాలని కేంద్రం ఇప్పటికే మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. అధికారిక ఆదేశాలు ఎప్పుడు రానున్నాయి? గణపతిరెడ్డి: రెండు వారాల్లో కేంద్రం నుంచి లిఖితపూర్వక ఆదేశాలు రానున్నాయి. రీజినల్ రింగ్ నేపథ్యం వివరిస్తారా? గ్రేటర్ హైదరాబాద్కు భవిష్యత్తులో ఎదురయ్యే ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మరో రింగ్ రోడ్ అవసరమన్న ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్దే. ఆయన 2016లోనే ఈ ప్రతిపాదనను మాముందు ఉంచారు. రోజురోజుకు వేలాది కొత్తవాహనాలు రోడ్డు మీదకు వస్తున్న దరిమిలా.. ఇపుడున్న ఔటర్ రింగ్రోడ్ సామర్థ్యం సరిపోదని, భారీ వాహనాల రవాణాకు మరో కొత్త రింగు రోడ్డు (రీజినల్ రింగ్ రోడ్) కావాలని ఆయనే ప్రతిపాదించారు. రీజినల్ రింగురోడ్డుతో మారనున్న తెలంగాణ ముఖచిత్రం రోడ్డు ఆవశ్యకత ఏంటి? నగరం నుంచి ఉన్న జాతీయ రహదారులపై వాహనభారం తీర్చేందుకు ఔటర్ రింగ్రోడ్డుకు అంకురార్పణ జరిగింది. కొత్త వాహనాలు రోడ్డు మీదకు వస్తుండటంతో రాబోయే ఐదేళ్లలో ఓఆర్ఆర్ కేవలం నగర అవసరాలకే పరిమితమవనుంది. అపుడు ఓఆర్ఆర్పై ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. రోజురోజుకు పెరిగే అవసరాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారులపై నిరాటంకమైన రవాణా ఉండాలంటే మరో రింగు రోడ్డు అనివార్యమైంది. అదే విషయాన్ని కేంద్రానికి వివరించి ఒప్పించగలిగాం. డీపీఆర్ పనులు ఎంతవరకు వచ్చాయి? డీపీఆర్ పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి.మరో 10 రోజుల్లో నివేదిక రావొచ్చని అంచనా వేస్తున్నాం. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారు. భూసేకరణ మొదలు పెట్టవచ్చని కేంద్రం చెప్పింది కదా? ఎంత భూమిని సేకరిస్తారు? మొత్తం 338 కిలోమీటర్లు ఉండే ఈ రోడ్డు కోసం 11,000 ఎకరాల భూమిని సేకరిస్తాం. ఇందుకోసం ప్రాజెక్టు వ్యయంలో రూ.2,500 కోట్లు అవుతాయని అంచనా వేస్తున్నాం. ఈ మార్గంలో ఇప్పటికే రోడ్డు అందుబాటులో ఉంది కదా? దాన్ని విస్తరిస్తారా? గణపతిరెడ్డి: ఉన్న రోడ్డును విస్తరించడం సవాలుతో కూడుకున్నది.పైగా అనేక వంపులు, మలుపులు ఎదురై ప్రయాణానికి ఆటంకం కలుగుతుంది.పైగా మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లింపులు, కోర్టు కేసులు, స్టేలు పనులకు ఆటంకంగా మారతాయి. న్యాయపరంగా, ఆర్థికంగా అనేక చిక్కులు ఎదురవుతాయి. అందుకే, మేం పూర్తిగా గ్రీన్ఫీల్డ్నే ఎంచుకోబోతున్నాం. ఇలాగైతే వంపులు లేని సాఫీ రోడ్డును నిర్మించగలం. భవిష్యత్లో నగర వాసులకు ఎదురయ్యే ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకే రీజినల్ రింగ్రోడ్ ప్రతిపాదన తెచ్చామని, 2016లోనే సీఎం కేసీఆర్ ఈ ఆలోచన చేశారని ఆర్అండ్బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి చెప్పారు. ఇది కార్యరూపం దాలిస్తే ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాకుండా, నగరం కాలుష్యరహితంగా కూడా మారుతుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్కు మరో హారంగా భావిస్తున్న ఆర్ఆర్ఆర్పై గణపతిరెడ్డి తన అభిప్రాయాలు ‘సాక్షి’తో పంచుకున్నారు. మరో10 రోజుల్లో పూర్తికానున్న డీపీఆర్ ఈ రోడ్డు అధ్యయనానికి మోడల్గా మలేసియానే ఎందుకు ఎంచుకున్నారు? మలేసియాకు అధికారుల పర్యటన ఎపుడు?ఆ దేశంలో ఆర్థికాభివృద్ధిలో ఎక్స్ప్రెస్ హైవేల పాత్ర అద్భుతంగా ఉంది. ఆ విషయాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా చూశారు. అందుకే, ఎక్స్ప్రెస్ హైవేగా నిర్మించాలని సూచించారు. ఇటీవల ఎన్నికల కోడ్ కారణంగా వీరి పర్యటన ఆగిపోయింది. జనవరిలో పర్యటన ఖరారవుతుంది. అత్యాధునిక సదుపాయాలతో ఎక్స్ప్రెస్ హైవే ఎక్స్ప్రెస్ హైవేపై ఎలాంటి సదుపాయాలు ఉంటాయి? పూర్తిస్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రహదారి నిర్మాణం కానుంది. 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లేలా రోడ్డు సామర్థ్యం ఉంటుంది. రహదారిపై ప్రయాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం ఉండదు. పెట్రోల్, అంబులెన్స్, పికప్ క్రేన్ 24 గంటలు అందుబాటులో ఉంటాయి. టోల్గేట్లకు అత్యాధునిక టచ్ అండ్ గో సిస్టంతో టోల్ వసూలు చేసేందుకు స్మార్ట్ కార్డులు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రీజినల్ను కలుపుతూ రేడియల్రోడ్లు ఎన్ని వస్తాయి? ఇప్పటికే 10 రేడియల్ రోడ్లు ఉన్నాయి.దానికి లింకు రోడ్లు వేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.స్థానిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్రమే ప్రణాళికలు రూపొందిస్తుంది. ప్రాజెక్టు పూర్తికాగానే నగరం నుంచి పరిశ్రమలు తరలింపు ఈ రోడ్డుతో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? నగరంలో పెరుగుతున్న జనాభా వల్ల పరిశ్రమల చుట్టూ నివాస ప్రాంతాలు ఏర్పడ్డాయి.ఈ హానికారక పరిశ్రమలతో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి ప్రమాదకర పరిశ్రమలను ఔటర్ అవతలికి తరలించేందుకు వీలుంది. ఫలితంగా నగరంలో వాయుకాలుష్యం తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా నగరంలో పలు పరిశ్రమలు హానికారక రసాయనాలను మూసీలో వదులుతున్నాయి. ఇలాంటి పరిశ్రమల తరలింపు వల్ల మూసీ ప్రక్షాళన సులభతరమవుతుంది. అంతర్జాతీయ స్థాయి రోడ్డు సదుపాయాలు ఉండటం వల్ల ఐటీ, ఎగుమతులు, డ్రై పోర్టులు వచ్చి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రజల ఆర్థిక ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి. -
కాకతీయుల నాటి ఆలయ ఆనవాళ్లు గుర్తింపు!
♦ ఎలుకుర్తి హవేలి సమీపంలో బయల్పడ్డ శిల్పసంపద ♦ ‘గణేశ్వర’ఆలయంగా గుర్తించిన పరిశోధకులు ♦ రామప్ప ఆలయానికి ముందే ఇక్కడ ఆలయ నిర్మాణం గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఎలుకుర్తిహవేలి శివారులో బోగంమాటు వద్ద కాకతీయ కాలం నాటి ఆలయ అవశేషాలు వెలుగుచూశాయి. ఆలయానికి సంబంధించిన మూల స్థంభాలు, పునాది, పైకప్పునకు ఉపయోగించిన బండరాళ్లు, శిలా శాసనాలపై చెక్కే సూర్య, చంద్రుల గుర్తులు బయల్పడ్డాయి. ఇవన్నీ క్రీ.శ. 12,13 శతాబ్ధం కాలం నాటివిగా భావిస్తున్నారు. ఎలుకుర్తిహవేలి గ్రామానికి చెందిన చరిత్ర పరిశోధకుడు కంచి శ్రీనివాస్ వీటిని వెలుగులోకి తీసుకొచ్చారు. ఆయనకు అదే గ్రామానికి చెందిన ముదిగొండ శ్రీనివాస్ సహకారం అందించారు. లభ్యమైన స్తంభాలు, బండరాళ్ళు, సూర్యచంద్రుల గుర్తులను పరిశీలించిన తర్వాత శిధిలమైన అలనాటి ఆలయం గణపతి లేదా గణేశ్వర ఆలయంగా వారు భావిస్తున్నారు. కాకతీయ మహాదేవ చక్రవర్తి యాదవరాజైన జైతుగి చేతుల్లో యుద్ధంలో మరణించిన సమయంలో అతడి కుమారుడు గణపతిదేవ చక్రవర్తిని బందీగా చేసుకున్నాడని, ఆ కాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని అంతర్గత తిరుగుబాట్ల నుంచి సర్వసైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రసేనాని కాపాడి, గణపతిదేవుడిని బంధ విముక్తి చేసి చక్రవర్తిగా రాజ్యాన్ని అప్పగించాడని వివరించారు. రుద్రసేనాని స్వామి భక్తికి మెచ్చిన గణపతిదేవుడు మండలంలోని ఎలుకుర్తి రాజ్యాన్ని అతడికి బహుమానంగా ఇచ్చాడన్నారు. ఎలుకుర్తిలో తనపేరుతోపాటు కుమారుల పేరుతో నాలుగు దేవాలయాలను నిర్మించాడన్నారు.తన పేరుతో రుద్రేశ్వర ఆలయాన్ని, కుమారుల పేరిట లోకేశ్వర, అన్వేశ్వర ఆలయాలను నిర్మించాడని వివరించారు. మరో కుమారుడు గణపతిరెడ్డి పేరు తో నిర్మించిన గణేశ్వరఆలయ అవశేషాలే బయల్పడ్డాయన్నారు. రామప్ప దేవాలయం కంటే ముందే ఈ ఆలయాన్ని నిర్మించారన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
నిప్పుల కొలిమి..
బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం
తప్పక చదవండి
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement