-
బంగారం కలిపిన టీపొడితో చేసిన ఛాయ్.. ఇండియాలోకి ఎంట్రీ!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ హౌజ్గా పేరున్న లండన్ టీ ఎక్సేంజ్ (ఎల్టీఈ) ఇండియాలోకి ఎంట్రీ ఇస్తోంది. వ్యాపార విస్తరణలో భాగంగా ప్రపంచంలోనే అతి పెద్ద టీ మార్కెట్గా ఉన్న ఇండియాలో తమ ఛాయ్ రుచులు పంచేందుకు రెడీ అవుతోంది. ప్రిన్స్ ఛార్లెస్తో మొదలు బ్రిటీ రాజవంశానికి చెందిన ప్రిన్స్ ఛార్లెస్ 1552లో పోర్చగీస్కి చెందిన ప్రిన్సెస్ కెథరీన్ బంగాజాను వివాహం చేసుకున్న సందర్భంబంగా లండన్ టీ ఎక్సేంజ్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంపన్న శ్రేణికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉపయోగించే టీ హౌజ్గా ఎల్టీఈకి గుర్తింపు ఉంది. ఐదు వందల ఏళ్లలో అనేక యాజమన్యాలు మారినా ఎల్టీఈ ప్రత్యేకత చెక్కు చెదరలేదు. కాగా తాజాగా ఎల్టీఈ ఇండియాలో భారీ ఎత్తున విస్తరించే ప్రణాళికను అమలు చేస్తోంది. కోల్కతా మూలాలు ఇండియాలో ముందుగా ఢిల్లీ లేదా బెంగళూరులో తొలి టీ హౌజ్ను ఆరంభించే యోచనలో ఉన్నట్టు ఎల్టీఈ ఇండియా వ్యవహరాలు చూస్తోన్న రహ్మాన్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఎల్టీకీ గ్లోబల్ సీఈవోతో పాటు ఇండియాలో మాస్టర్ ఫ్రాంచైజీగా వ్యవహరిస్తున్నారు. రహ్మన్ పూర్వీకులు కొల్కతకు చెందిన వారు కావడంతో ఎల్టీఈని ఇండియాలో విస్తరించే యోచనలో ఉన్నారు. ఫ్రాంచైజీలు బోయే నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 200 స్టొర్లను అందుబాటులోకి తేవాలని లండన్ టీ ఎక్సేంజ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో మొదటి ఏడాదే 50 స్టోర్లను ప్రారంభిస్తామని ఎల్టీఈ ప్రతినిధులు జాతీయ మీడియాకు వచ్చిన ఇంటర్వ్యూల్లో తెలిపారు. ఢిల్లీ/బెంగళూరు తర్వాత ముంబై, హైదరాబాద్, చెన్నైలలో స్టోర్లు ప్రారంభించనున్నారు. ఎల్టీఈ స్టోర్ ఫ్రాంచైజీ దక్కించుకోవాలంటే పోష్ ఏరియాలో లోకేషన్ చూసుకోవడంతో పాటు సగటున కోటిన్నర రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కేజీ రూ. 13 కోట్లు లండన్ టీ ఎక్సేంజీ (ఎల్టీఈ) స్టోర్లలో టీ ప్రారంభం ధర రూ.120 ఉంటుందని అంచనా.. ఇక ఎల్టీఈకే ప్రత్యేకమైన బంగారంతో చేసిన ప్రత్యేక టీ పొడి ఖరీదు కేజీ రూ. 13 కోట్లు ఉంటుందట! ఈ టీని ఖరీదు చేస్తే స్థోమత సామాన్యులకు లేనట్టే. కాబట్టి ఈ బంగారం కలిసిన టీ పొడిని స్టోర్లలో ప్రదర్శనకు పెట్టినా.. అమ్మడం కష్టమేనంటున్నారు. ముందు నుంచి కూడా రికార్డులు కోరుకునేవారు, సూపర్ రిచ్ పీపుల్స్ దీన్ని భరించగలరంటున్నారు ఎల్టీఈ ప్రతినిధులు. చదవండి👉 Gautam Adani: వారెన్ బఫెట్కు భారీ షాక్! రికార్డులన్నీ తొక్కుకుంటూ పోతున్న అదానీ! -
సన్రైజర్స్ బ్యాటింగ్ కోచ్గా బ్రియాన్ లారా...
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మన ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. నిజం చెప్పాలంటే లీగ్లోనే చెత్త ప్రదర్శన సన్రైజర్స్ది. అందుకే అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీ యాజమాన్యం మేలుకుంది. ఎక్కడ లోపాలున్నాయో గుర్తించింది. వ్యూహ వైఫల్యాలను లెక్కించింది. ఎక్కడ తగ్గామో... ఎందుకు ఓడామో తూర్పారబట్టి జట్టు సహాయ బృందాన్ని ప్రక్షాళన చేసింది. ఇప్పుడు... దిగ్గజాలతో సన్రైజర్స్ను పరిపుష్టిగా మార్చింది. వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాను వ్యూహాత్మక సలహాదారుగా నియమిస్తూ అతనికి బ్యాటింగ్ కోచ్ బాధ్యతలు కూడా అప్పగించింది. దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్ను ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా నియమించింది. 52 ఏళ్ల లారా వెస్టిండీస్ తరఫున 1990 నుంచి 2007 వరకు ఆడి 131 టెస్టుల్లో 11,953 పరుగులు... 299 వన్డేల్లో 10,405 పరుగులు సాధించాడు. 38 ఏళ్ల స్టెయిన్ గత ఆగస్టులో అన్ని రకాల క్రికెట్కు వీడ్కోలు పలికాడు. గతంలో సన్రైజర్స్ హైదరాబాద్, డెక్కన్ చార్జర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన స్టెయిన్ మొత్తం 95 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 97 వికెట్లు తీశాడు. ఇక దక్షిణాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) కలిపి 265 మ్యాచ్లు ఆడిన స్టెయిన్ 699 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ సహాయ బృందాన్ని నడిపించనున్నారు. ఈ సీజన్లో జట్టు క్రికెట్ డైరెక్టర్ పాత్రకే పరిమితమైన మూడీని ఎస్ఆర్హెచ్ మళ్లీ హెడ్ కోచ్గా నియమించింది. ఈ సీజన్లో హెడ్ కోచ్గా వ్యవహరించిన ట్రెవర్ బేలిస్ జట్టును అధఃపాతాళానికి తీసుకెళ్లడం ఫ్రాంచైజీ యాజమాన్యానికి ఏమాత్రం రుచించలేదు. అందుకే హైదరాబాద్ను మేటి ఫ్రాంచైజీగా తీర్చిదిద్దిన మూడీని సహాయ సిబ్బంది పూర్తిస్థాయి సేనానిగా నియమించింది. 2013 నుంచి 2019 వరకు మూడీ కోచింగ్లోని ఎస్ఆర్హెచ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచింది. 2016లో విజేతగా నిలిచిన సన్రైజర్స్, ఐదుసార్లు ప్లేఆఫ్ దాకా పోరాడింది. మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ సైమన్ కటిచ్ సహాయ కోచ్గా వ్యవహరిస్తాడు. ఇతను ఈ సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్కు హెడ్ కోచ్గా పనిచేశాడు. భారత మాజీ బ్యాటర్ హేమంగ్ బదానిని ఫీల్డింగ్ కోచ్గా ఎంపిక చేశారు. శ్రీలంక మేటి ముత్తయ్య మురళీధరన్ను స్పిన్ బౌలింగ్ కోచ్గా కొనసాగించనుంది. మెగా వేలానికి ముందు రిటెయిన్ జాబితాలో కెప్టెన్ కేన్ విలియమ్సన్, అన్క్యాప్డ్ ఉమ్రాన్ మలిక్, అబ్దుల్ సమద్లను అట్టిపెట్టుకున్న ఎస్ఆర్హెచ్ డాషింగ్ ఓపెనర్ వార్నర్ సహా అందరినీ విడుదల చేసింది. -
తుక్కు వ్యాపారంలోకి టాటా గ్రూప్
న్యూఢిల్లీ: ఫ్రాంచైజీ విధానంలో వాహనాల స్క్రాపేజీ సెంటర్లను ఏర్పాటు చేయాలని టాటా మోటార్స్ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొదటి కేంద్రం అందుబాటులోకి రావచ్చని కంపెనీ ఈడీ గిరీష్ వాఘ్ తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా ఏటా 25,000 ట్రక్కులు తుక్కుగా మారుతున్నాయన్న అంచనాలు ఉన్నాయని, కానీ సరైన స్క్రాపేజీ కేంద్రాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే యూరప్కు చెందిన నిపుణులతో కలిసి మోడల్ స్క్రాపింగ్ కేంద్రాన్ని రూపొందించామని వాఘ్ పేర్కొన్నారు. ఫ్రాంచైజీ విధానంలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు గిరీష్ వాఘ్ తెలిపారు. ఇప్పటికే భాగస్వాములకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ) పంపించడం మొదలు పెట్టామని వివరించారు. స్క్రాపేజీ కేంద్రాలతో ఉపాధి అవకాశాలు రాగలవనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కూడా వీటి ఏర్పాటుపై దృష్టి పెడుతోందని వాఘ్ వివరించారు. అహ్మదాబాద్లో వాహనాల స్క్రాపేజీ సెంటర్ నెలకొల్పడానికి గుజరాత్ ప్రభుత్వంతో టాటా మోటార్స్ ఇటీవలే చేతులు కలిపింది. -
బంపర్ ఆఫర్: పోస్టాఫీస్ ఫ్రాంఛైజ్,పెట్టుబడి తక్కువ..సంపాదన ఎక్కువ
ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా తక్కువ పెట్టుబడి..ఎక్కువ ఆదా పొందేలా ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. కేవలం రూ.5వేలు పెట్టుబడితో పోస్టాఫీస్ను ఫ్రాంఛైజ్ తీసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. కేంద్రప్రభుత్వం ప్రపంచంలో అతిపెద్ద పోస్టల్ నెట్ వర్క్ను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా 1.55లక్షల పోస్టాఫీస్లు ఉన్నాయి. అందులో 89 శాతం పోస్టాఫీసులు గ్రామీణ ప్రాంతాల్లో సేవల్ని అందిస్తున్నాయి. అయితే కేంద్రం ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చెందుతున్న రూరల్, అర్బన్ ఏరియాల్లో సైతం ఈ సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు 2019లో ఈ ఫ్రాంఛైజ్ స్కీంను అందుబాటులోకి తెచ్చింది. పోస్టాఫీస్ ఫ్రాంఛైజీ తీసుకుంటే ఏం చేయాలి? ► స్టాంప్స్, స్టేషనరీని అమ్ముకోవచ్చు. ► బుకింగ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్, మనీ ఆర్డర్స్ సర్వీస్లను అందించాల్సి ఉంటుంది ► పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ (పీఎల్ఐ- ఏజెంట్)కు సంబంధించిన అమ్మకాలు, ప్రీమియంను కట్టించుకోచ్చు. ► పోస్టాఫీస్ పరిధిలోకి వచ్చే రీటైల్ సర్వీసులు అంటే బిల్స్, ట్యాక్స్, పన్నుల వసూళ్లు లేదా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఫ్రాంఛైజీకి కావాల్సిన అర్హతలు ► ఫ్రాంఛైజీని సొంతం చేసుకోవాలంటే మినిమం 8వ తరగతి చదివి ఉండాలి. ఇక డిపాజిట్ కింద రూ.5000 నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. ► దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పోస్టాఫీస్ అధికారులు మీ దరఖాస్తును డివిజనల్ హెడ్కు పంపిస్తారు. ► అలా మీ ధరఖాస్తును చెక్ చేస్తారు. మీ ఫ్రాంఛైజీకోసం అప్లయ్ చేసిన ధరఖాస్తుకు చెందిన అడ్రస్ను పరిశీలిస్తారు. దీంతో పాటు ఫ్రాంఛైజీని నిర్వహించే సామర్ధ్యం ఉందా లేదా, కంప్యూటర్ సౌకర్యం ఉందా లేదా అని పరిగణలోకి తీసుకుంటారు. ► అనంతరం 14 రోజుల్లో ఫ్రాంఛైజీకి మీరు అర్హులు, కాదా అంశంపై నిర్ణయం తీసుకుంటారు. ఫ్రాంఛైజీకి ఎవరికి? ఏ ప్రాంతంలో ఇవ్వరు ► 18 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి అవకాశం ఇవ్వరు. ► పోస్టాఫీస్ ఉద్యోగం చేస్తున్నా, లేదంటే రిటైర్డ్ ఉద్యోగులకు ఈ ఫ్రాంఛైజీని తీసుకునేందుకు అనర్హులు ► పంచాయత్ కమ్యూనికేషన్ సర్వీస్ పథకంలో భాగంగా పంచాయత్ కమ్యూనికేషన్ సర్వీస్ సెంటర్లు ఉన్న గ్రామాలకు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ ఇవ్వరు. ఫ్రాంఛైజీ వల్ల లాభాలు (⇔ ఈ లింక్ క్లిక్ చేస్తే 22పేజీలో పూర్తి వివరాలు) ► పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ నిర్వాహకులు అందించే సేవలపై కమీషన్ లభిస్తుంది. ► రిజిస్టర్డ్ పోస్ట్కు రూ.3, స్పీడ్పోస్టుకు రూ.5 కమీషన్, రూ.100 నుంచి రూ.200 మనీ ఆర్డర్పై రూ.3.50, అంతకన్నా ఎక్కువ మనీ ఆర్డర్పై రూ.5 కమీషన్ వస్తుంది. ► నెలలో 1000 రిజిస్టర్ పోస్టులు, 1000 స్పీడ్ పోస్ట్లు బుక్ చేస్తే 20శాతం కమీషన్ అదనంగా లభిస్తుంది. ► ఇక స్టాంపులు, పోస్టల్ స్టేషనరీ, మనీ ఆర్డర్ ఫామ్ లాంటి అమ్మకాలపై 5 శాతం కమిషన్ ఉంటుంది. చదవండి : ఏటీఎం సెంటర్లలో మారిన రూల్స్, వాటి గురించి మీకు తెలుసా? -
లంక ప్రీమియర్ లీగ్లో సొహైల్ ఖాన్ పెట్టుబడి
ముంబై: లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) టి20 టోర్నమెంట్లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరుడు నటుడు, నిర్మాత సొహైల్ ఖాన్ పెట్టుబడి పెట్టాడు. ‘క్యాండీ టస్కర్స్’ ఫ్రాంచైజీని సొహైల్ ఖాన్, అతని తండ్రి సలీమ్ ఖాన్కు చెందిన కన్సార్టియం ‘సొహైల్ ఖాన్ ఇంటర్నేషనల్ ఎల్ఎల్పీ’ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సొహైల్ ఖాన్ అధికారికంగా ప్రకటించాడు. ‘ఎల్పీఎల్కు మంచి భవిష్యత్ ఉంది. ఇందులో భాగం కావడం సంతోషాన్నిచ్చింది. ఆట పట్ల లంక అభిమానులు ఉత్సుకతతో ఉంటారు. జట్టుకు మద్దతు ఇవ్వడానికి వారంతా మా వెంటే ఉంటారని నమ్ముతున్నా’ అని సొహైల్ పేర్కొన్నాడు. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 13 వరకు జరుగనున్న ఈ ఎల్పీఎల్లో ఐదు జట్లు కొలంబో కింగ్స్, దంబుల్లా హాక్స్, గాలె గ్లాడియేటర్స్, జాఫ్నా స్టాలియన్స్, క్యాండీ టస్కర్స్ తలపడనున్నాయి. లీగ్ కోసం రెండు రోజులుగా జరిగిన ఆటగాళ్ల వేలంలో టస్కర్స్ జట్టు వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ను దక్కించుకుంది. గేల్తో పాటు ఫ్లంకెట్, వహాబ్ రియాజ్, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, నువాన్ ప్రదీప్లు టస్కర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. శ్రీలంక మాజీ కెప్టెన్ హసన్ తిలకరత్నే ఈ జట్టు కోచింగ్ బృందంలో పనిచేయనున్నాడు. ఎల్పీఎల్లో పాల్గొనే ప్రముఖ ఆటగాళ్లు జాఫ్నా స్టాలియన్స్: షోయబ్ మాలిక్. దంబుల్లా హాక్స్: డేవిడ్ మిల్లర్, కార్లోస్ బ్రాత్వైట్. కొలంబో కింగ్స్: రసెల్, డుప్లెసిస్, ఏంజె లో మాథ్యూస్. గాలె గ్లాడియేటర్స్: లసిత్ మలింగ, అఫ్రిది, ఇంగ్రామ్, మొహమ్మద్ ఆమీర్.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement