-
సెబీ సంచలన నిర్ణయం
సాక్షి, ముంబై: మార్కెట్ రెగ్యులేటరీ సెబీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ సమయాన్ని పొడిగించుకునే అనుమతిని మంజూరు చేసింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11.55 వరకూ ట్రేడింగ్ నిర్వహించుకోవచ్చని శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుతం ఉదయం 9గంటలనుంచి మధ్యాహ్న3.30 వరకు ట్రేడింగ్ అనుమతి ఉండగా,తాజానిర్ణయంతో మరో ఎనిమిది గంటలకుపాటు ట్రేడింగ్ సమయాన్నిపొడిగించింది. అంటే దాదాపు రోజంతా ట్రేడింగ్ చేసుకునే అవకాశమన్నమాట. ఈ ఆదేశాలు, 2018, అక్టోబర్ 1వ తేదీనుంచి అమల్లోకి రానున్నాయి. తాజా నిర్ణయంతో బిఎస్ఈ, ఎన్ఎస్ఈలలో అక్టోబర్ నుంచి దాదాపు 14 గంటల పాటు డెరివేటివ్స్ ట్రేడింగ్ కొనసాగనుంది. ఈమేరకు జారీ చేసిన ఒక సర్క్యులర్ ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజీలు సెబీ నుండి ముందుగా అనుమతి పొందాలి. రిస్క్ మేనేజ్మెంట్, సెటిల్మెంటు ప్రాసెస్ తదితర అంశాలకు లోబడి ఈ అనుమతి ఉంటుంది. స్టాక్స్, వస్తువుల వ్యాపారాన్ని ఏకీకృతం చేసే ప్రయత్నాలలో భాగంగా ఈ చర్యను చేపట్టినట్టు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) పేర్కొంది. ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్లో అక్టోబరు 1 నుంచి 11.55 గంటలవరకు ఎక్స్ఛేంజ్ వర్తకాన్ని పొడిగించింది. ప్రస్తుతం కమోడిటీ మార్కెట్ లో ఉదయం 10గంటలనుంచి రాత్రి 11.55నిమిషాల దాకా ట్రేడింగ్ చేసుకునే అవకాశం ఉన్నసంగతి తెలిసిందే. -
డెరివేటివ్ల లాట్ సైజుల్లో మార్పులు, చేర్పులు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, ఈక్విటీ డెరివేటివ్ల కనీస పెట్టుబడి పరిమాణాన్ని భారీగా పెంచింది. లాట్ సైజుల్లో కూడా మార్పులు, చేర్పులు చేసింది. ప్రస్తుతం రూ.2 లక్షలుగా ఉన్న ఈక్విటీ డెరివేటివ్ల కనీస పెట్టుబడి పరిమాణాన్ని రూ.5 లక్షలకు పెంచుతున్నామని సెబీ పేర్కొంది. రిస్క్ అధికంగా ఉన్న ఈక్విటీ డెరివేటివ్ల నుంచి చిన్న ఇన్వెస్టర్లను రక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఇది ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి)అమల్లోకి వస్తుందని పేర్కొంది. స్టాక్ డెరివేటివ్స్ లాట్ సైజ్ను ఆ స్టాక్ కాంట్రాక్ట్ విలువను బట్టి నిర్ణయిస్తామని వివరించింది. కాంట్రాక్ట్ విలువ రూ.5 లక్షల లోపు ఉంటే స్టాక్ డెరివేటివ్స్కు లాట్ సైజ్ 25 గుణి జాల చొప్పున పెరుగుతుందని, ఇందుకు కనీస లాట్సైజ్ 50కు తగ్గకుండా ఉండాలని పేర్కొంది. ఒక వేళ 50 లాట్సైజ్తో కాంట్రాక్ట్ విలువ రూ.10లక్షలకు మించితే లాట్సైజ్ 5 గుణిజాలుగా తగ్గుతుందని, కనీస లాట్సైజ్ 10కి తగ్గకుండా ఉంటుందని వివరించింది. ఇక ఇండెక్స్ డెరివేటివ్స్ లాట్ సైజ్ను కూడా 5 గుణిజాల చొప్పున పెరుగుతుందని, కనీస లాట్ సైజ్ 10కి తగ్గకుండా ఉంటుందని పేర్కొంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement