breaking news
entrapped
-
రెడ్ హ్యాండెడ్ గా దొరికిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
పంజగుట్ట (హైదరాబాద్సిటీ): పేకాట ఆడుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మరో నలుగురిని సెంట్రల్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.5.70 లక్షల నగదు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వెంకట మధుసూదన్ రావు అలియాస్ నాని అతనితో పాటు మరో నలుగురు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న హోటల్ టూరిజం ప్లాజాలో బస చేశారు. రూం నంబర్ 508 లో మధుసూదన్తో పాటూ పలువురు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే సెంట్రల్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి వారిని పంజగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ అధికారి
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)అధికారులకు చిక్కాడు. జీహెచ్ఎంసీ సర్కిల్-18 గణాంకశాఖ అధికారి నిత్యానంద శనివారం సాయంత్రం లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. రెజిమెంటల్ బజార్కు చెందిన ఉమాదేవి తన ఇంటి మ్యుటేషన్ కోసం రూ.2,000 లంచం ఇస్తుండగా ఆయన దొరికిపోయారు. ప్రస్తుతంఆయన కార్యాలయంతోపాటు బోయిన్పల్లిలోని ఇంట్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.