breaking news
EAMCET -2014 exam
-
ఎంసెట్ ప్రశాంతం
జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన ఎంసెట్ ప్రశాంతంగా ముగిసింది. ఇంజినీరింగ్ కోసం 12,497 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 11,804 మంది పరీక్షకు హాజరయ్యూరు. మెడిసిన్, అగ్రికల్చర్ కోసం 4,940 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 4,594 మంది హాజరయ్యూరు. కరీంన గర్ సిటీ, నగరశివారు, ఎల్ఎండీలో కలిపి మొత్తం 36 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజినీరింగ్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మెడిసిన్ పరీక్ష నిర్వహించారు. స్టేట్ అబ్జర్వర్ ప్రొఫెసర్ శ్రీనివాస్, జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ పి.రమేశ్ పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాల కేంద్రానికి ముగ్గురు, కిమ్స్ డిగ్రీ కళాశాలకు నలుగురు నిమిషం ఆలస్యంగా రావడంతో అనుమతివ్వలేదు. ఎంసెట్ సందర్భంగా విద్యార్థులు సహా తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కరీంనగర్లోని హోటళ్లు, రహదారులు, బస్టాండ్ ప్రాంతాలు రద్దీగా మారారుు. -
ఎంసెట్ పరీక్ష రాసిన తల్లీ కొడుకులు
పాలకుర్తి (వరంగల్ జిల్లా), న్యూస్లైన్: కొడుకుతోపాటు తల్లి ఎంసెట్ పరీక్ష రాసిన విచిత్రమిది. వరంగల్ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన వేముల సునీతకు పదో తరగతి అనంతరం 1994లో వివాహమైంది. ఇద్దరు పిల్లల తర్వాత మళ్లీ చదువుకోవాలనే ఆశ కలిగింది. భర్త వేముల శ్రీనివాస్ ప్రోత్సాహంతో ఆమె మళ్లీ చదువును కొనసాగించారు. 2013లో సైన్స్ గ్రూపులో ఓపెన్ ఇంటర్ పూర్తి చేశారు. ఆర్ఎంపీగా పనిచేస్తూ ఇంట్లోనే మెడికల్ షాప్ నిర్వహిస్తున్న భర్త శ్రీనివాస్కు సాయుంగా ఉండే సునీతకు బీఫార్మసీ చేయాలనే అలోచన కలిగింది. దీంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసి.. ఎంసెట్ (మెడిసిన్)కు సిద్ధమవుతున్న తన కుమారుడు వేముల అజిత్ కుమార్కి విషయం చెప్పారు. కుమారుడు ఎంసెట్ నోట్స్ తయారు చేసి ఇవ్వగా పరీక్షకు సిద్ధమయ్యారు. వరంగల్లోని శ్రీగాయత్రీ డిగ్రీ కాలేజీలో తల్లి సునీత, ఎల్బీ పీజీ కాలేజీలో కుమారుడు అజిత్కుమార్ గురువారం ఎంసెట్ పరీక్ష రాశారు. ‘‘18 ఏళ్ల తర్వాత మళ్లీ చదువుకోవాలని ఆలోచన వచ్చింది. నా భర్త, కువూరుడు ఇచ్చిన ప్రోత్సాహంతో ఎంసెట్ పరీక్షకు సిద్ధమయ్యూ. బీఫార్మసీ పూర్తి చేసి మంచి ఉద్యోగం సాధిం చాలని ఉంది’’ అని సునీత తెలిపారు. -
22న ఎంసెట్-2014
- పరీక్ష రాయనున్న 14,186 మంది విద్యార్థులు - గంట ముందుగానే పరీక్ష కేంద్రంలోకి అనుమతి - నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ కర్నూలు(విద్య), న్యూస్లైన్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్-2014 పరీక్ష జిల్లాలో ఈ నెల 22న నిర్వహించనున్నారు. ఈ ఏడాది జిల్లాలో 14,186 మంది పరీక్ష రాస్తుండగా.. వీరిలో 8,775 మంది ఇంజనీరింగ్, 5,411 మంది మెడికల్ విద్యార్థులు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇంజనీరింగ్ విభాగంలో 150 మంది తగ్గగా, మెడికల్లో 700 మంది విద్యార్థులు పెరిగారు. కర్నూలు నగరంలో 20 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతుంది. పరీక్షల నిర్వహణ రీజనల్ కో ఆర్డినేటర్గా జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీనివాసరెడ్డిని నియమించారు. మెడికల్,అగ్రికల్చర్ పరీక్ష కేంద్రాలు 1. జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల 2. సెయింట్ జోసఫ్స్ డిగ్రీ కళాశాల 3. సిస్టర్ స్టాన్సిలాస్ మెమోరియల్ ఇంగ్లిష్ కళాశాల 4. సెయింట్ జోసఫ్స్ స్కూల్ 5. మాంటిస్సోరి హైస్కూల్ 6. బృందావన్ కాలేజ్ ఇంజనీరింగ్ 1. జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల 2. సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాల(సుంకేసుల రోడ్డు) 3. వాసవీ మహిళా కళాశాల(పెద్దమార్కెట్ వద్ద) 4. జి.పులయ్య ఇంజనీరింగ్ కళాశాల, నందికొట్కూరు రోడ్డు 5. కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాల 6. సిస్టర్ స్టాన్సిలాస్ మెమోరియల్ ఇంగ్లిష్ స్కూల్, సుంకేసుల రోడ్డు 7. శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల 8. సెయింట్ జోసఫ్స్ జూనియర్ కళాశాల, నందికొట్కూరు రోడ్డు 9. ఉస్మానియ కళాశాల 10. సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల 11. సెయింట్ జోసఫ్స్ ఇంగ్లిష్ స్కూల్, ఎన్ఆర్ పేట 12. మాంటిస్సోరి హైస్కూల్, ఎ.క్యాంప్ 13. బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి అండ్ సెన్సైస్(బిట్స్), చిన్నటేకూరు 14. ప్రభుత్వ డిగ్రీ కళాశాల(మెన్), బి.క్యాంపు విద్యార్థులకు సూచనలు, సలహాలు 1. హాల్టికెట్లను విద్యార్థులు ఎంసెట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. 2. విద్యార్థులు భర్తీ చేసిన ఆన్లైన్ దరఖాస్తు ఫారంపై ఫొటో అతికించి గజిటెడ్ ఆఫీసర్చే అటెస్టేషన్ చేయించాలి. 3. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి బ్లాక్ /బ్లూ బాల్పాయింట్ పెన్, భర్తీ చేసిన ఆన్లైన్ దరఖాస్తు ఫారం.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే కుల ధ్రువీకరణ పత్రాలు(జిరాక్స్ కాపీలు గజిటెడ్ ఆఫీసర్చే సంతకం తప్పనిసరి), ఎంసెట్-2014 హాల్టికెట్ తీసుకురావాలి. 4. విద్యార్థులకు పరీక్ష హాలులోకి గంట ముందుగానే అనుమతిస్తారు. 5. సెల్ఫోన్, బ్లూటూత్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులతో వస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. 6. విద్యార్థులు తమ పేరు, తండ్రి పేరు, కేటగిరీలలో తప్పులు ఉంటే ముందుగానే నామినల్ రోల్స్లో సరిచేయించుకోవాలి. 7. పరీక్ష ముగిసిన తర్వాత ఆన్లైన్ దరఖాస్తు, ఓఎంఆర్ షీటును ఇన్విజిలేటర్కు అప్పగించాలి. పరీక్ష పత్రాన్ని వెంట తీసుకెళ్లొచ్చు.