breaking news
Dragons
-
తమిళనాడు డ్రాగన్స్ గెలుపు
చెన్నై: సొంతగడ్డపై జరుగుతున్న పురుషుల హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో తమిళనాడు డ్రాగన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గత సీజన్లో తమకు కాంస్య పతకాన్ని దూరం చేసిన సూర్మ హాకీ క్లబ్ను ఓడించింది. మంగళవారం జరిగిన పోరులో తమిళనాడు డ్రాగన్స్ 3–2 స్కోరుతో సూర్మ హాకీ క్లబ్పై విజయం సాధించింది. తొలి క్వార్టర్లో ఇరుజట్ల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడటంతో ఒక్క గోల్ లేకుండానే ఈ క్వార్టర్ ముగిసింది. రెండో క్వార్టర్ మొదలయ్యాక కూడా గోల్పోస్ట్పై పరస్పర దాడులే తప్ప గోల్ మాత్రం కాలేదు.ఎట్టకేలకు రెండో క్వార్టర్ ముగిసే దశలో సెల్వరాజ్ కనగరాజ్ (28వ ని.) గోల్ చేసి తమిళనాడుకు 1–0తో ఆధిక్యాన్నిచ్చాడు. రెండు నిమిషాల వ్యవధిలోనే ఉత్తమ్ సింగ్ (30వ ని.) గోల్తో ఈ ఆధిక్యం కాస్త 2–0తో రెట్టింపైంది. మూడో క్వార్టర్లో సూర్మ క్లబ్ ఆటగాళ్లు స్కోరు చేసేందుకు శతవిధాల ప్రయతి్నంచారు. క్షణాల్లో మూడో క్వార్టర్ ముగుస్తుండగా మణిందర్ సింగ్ (45వ ని.) గోల్ చేసి సూర్మ ఖాతా తెరిచాడు.కానీ ఆఖరి క్వార్టర్ మొదలవగానే బ్లేక్ గోవర్స్ (47వ ని.) గోల్ చేయడంతో డ్రాగన్స్ 3–1తో తిరుగులేని పైచేయి సాధించింది. అనంతరం సూర్మ క్లబ్ ఆటగాళ్లు గోల్స్ కోసం ఎంతగా శ్రమించినా లాభం లేకపోయింది. ఎట్టకేలకు 58వ నిమిషంలో హర్మన్ప్రీత్ సింగ్ గోల్ చేయడంతో తమిళనాడు ఆధిక్యాన్ని 3–2తో తగ్గించగలిగిందే కానీ ప్రత్యర్థి విజయాన్ని అడ్డుకోలేకపోయింది. రాంచీలో జరిగిన మహిళల హెచ్ఐఎల్లో శ్రాచి బెంగాల్ టైగర్స్ షూటౌట్లో 7–6తో ఎస్జీ పైపర్స్పై గెలుపొందింది. బుధవారం జరిగే మహిళల పోటీలో బెంగాల్ టైగర్స్తో సూర్మ హాకీ క్లబ్ తలపడుతుంది. పురుషుల మ్యాచ్లో హెచ్ఐఎల్ జీసీతో బెంగాల్ టైగర్స్ పోటీ పడుతుంది. -
‘నీ లంచం తిరిగి ఇచ్చేస్తున్నా..ఆల్ ద బెస్ట్’
విల్లింగ్టన్ : డ్రాగన్లపై పరిశోధన చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఓ పదకొండేళ్ల బాలిక ఇవ్వజూపిన లంచాన్ని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డర్న్ తిరస్కరించారు. తన లాంటి చిన్న పిల్లలు ఇచ్చే సూచనలు, సలహాలు తప్పక పాటిస్తామని, అయితే పని చేయడం కోసం ఇలా డబ్బు ఇవ్వడం మంచిది కాదని సున్నితంగా హెచ్చరించారు. ఈ మేరకు..‘సైకిక్స్, డ్రాగన్స్ గురించి నువ్విచ్చే సలహాలు స్వీకరించేందుకు మేము ఎల్లప్పుడూ సిద్ధం. కానీ దురదృష్టవశాత్తూ మనం ఇప్పుడు వాటిపై పరిశోధనలు చేయడం లేదు. నువ్వు లంచంగా ఇచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేస్తున్నా. టెలికినెసిస్, టెలిపతి, డ్రాగన్లపై నీకున్న ఇంటరెస్ట్ అమోఘం. ఆల్ ద బెస్ట్. నేను కూడా ఇక నుంచి డ్రాగన్లపై ఓ కన్నేసి ఉంచుతా. అవి సూట్ తొడుక్కుంటాయా’ అంటూ జెసిండా పేరిట ప్రధాని కార్యాలయం సదరు బాలికకు లేఖ రాసింది. ఇంతకీ విషయమేమిటంటే.. విక్టోరియా అనే బాలికకు డ్రాగన్స్, టెలీపతి, మనుషుల మనస్సును చదివే అంశాలంటే ఎంతో ఆసక్తి. నెట్ఫ్లిక్స్లో ప్రసారమయ్యే స్కై ఫై సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ను వీక్షించినప్పటి నుంచి నిరంతరం వాటి గురించే ఆలోచిస్తోందని ఆమె సోదరుడు పేర్కొన్నాడు. డ్రాగన్ ట్రెయినర్గా మారాలన్నది తన కల అని తెలిపాడు. ఈ క్రమంలోనే అతీత శక్తులపై పరిశోధనలు జరపాలంటూ ప్రభుత్వాన్ని కోరడంతో పాటు.. ఇందుకు సంబంధించి రాసిన లేఖకు ఐదు డాలర్లు(న్యూజిలాండ్) జత చేసినట్లు పేర్కొన్నాడు. -
ఆ షోకు వెళితే రెప్పవాల్చరేమో?
బీజింగ్: మీరెప్పుడైనా చైనా వెళతారా.. వెళితే అక్కడ లింగ్షాన్ గ్రాండ్ బుద్ధ సెనిక్ ప్రాంతానికి తప్పక వెళ్లండి. ఎందుకంటే జ్ఞాన బుద్ధుడి ప్రతిమలు దర్శనం ఇవ్వడమే కాకుండా అబ్బురపరిచే దృశ్యాలు కనువిందు చేస్తాయి. ముఖ్యంగా అక్కడ ఉన్న ఒక పెద్ద కొలను నడిమధ్య లో ప్రత్యేకంగా రూపొందించిన తామరతో కూడిన పూర్ణకుంబంలాంటి ఆకృతి కనిపిస్తుంది. ఆ తామర రేకులు విచ్చుకుంటుండగా అందులో నుంచి బుద్ధుడు దర్శనమిస్తాడు. అలా కనిపిస్తూ నాలుగు దిక్కులు తిరుగుతుంటాడు. అలా బుద్ధ విగ్రహం తిరుగుతున్న క్రమంలో ఆ కొలనులోనే కింద ఏర్పాటుచేసిన తొమ్మిది డ్రాగన్లు బుద్ధుడికి స్నానం చేయిస్తాయి. బుద్ధ బగవానుడికి పక్కనే మరో దేవదూత తన చంటి బిడ్డను చేతిలో పట్టుకొని దర్శనమిస్తుంది. అక్కడ కూడా నీటి దారలు రివ్వున ఎగిసి ఆ విగ్రహాన్ని తాకుతుంటాయి. ఆ వెంటనే ఈ రెండు విగ్రహాల నడుమ దూరంగా ఓ కొండల మద్యలో మరో విగ్రహం నుంచి భారీ లైటింగ్ వస్తుంది. అలా లైటింగ్ రావడంతోనే మొదలవుతుంది అసలైన లేజర్ షో.. దాన్ని చూసే ఎవ్వరైనా ముగ్దుల్వాల్సిందే. ప్రపంచంలోని ఎన్నో చోట్ల జరిగే లేజర్ షోల కంటే చైనాలోని ఇక్కడ జరిగే లేజర్ షోకే, స్థానికులు, పర్యాటకులు కుప్పలుగా వెళుతుంటారు. ఈ బుద్ధుడికి సఖ్యముని అని పేరు.


