-
సీఎం జగన్ పాలనలో వైద్యులకు గౌరవం
గుంటూరు మెడికల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్యులకు పదోన్నతులు ఇచ్చారని, వేతనాలు పెరిగాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఆదివారం గుంటూరులో ఏపీ డాక్టర్స్ ఇంట్రాక్షన్ మీట్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ కరోనా సమయంలో వైద్యుల త్యాగాలను ఎవరూ మర్చిపోలేరన్నారు. ఈ సందర్భంగా ఆమె వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో వైద్యవృత్తికి, వైద్యులకు గౌరవం పెరిగిందన్నారు. దివంగతనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య వృత్తికి గుర్తింపు తెచ్చారన్నారు. తొలిసారిగా వైద్యులకు యూజీసీ స్కేల్స్ అమలు చేసిన ఘనత డాక్టర్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. దేశానికే ఏపీ ఆదర్శం వైద్యులకు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఏడో వేతన స్కేల్ను సీఎం జగన్ అమలు చేశారని గుర్తు చేశారు. 13 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అడిషనల్ డీఎంఈ ప్రమోషన్లు ఇచ్చామని, ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ విధానంతో వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులన్నీ భర్తీ చేస్తున్నామని, ఈక్రమంలో సుమారు 53 వేల పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. వైద్యుల రిక్రూట్మెంట్లో దేశానికే ఏపీ ఆదర్శంగా ఉందని తెలిపారు. రోగులు, ప్రజల అవసరాలను బట్టి నూతనంగా నెఫ్రాలజీ వార్డులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ట్రైబల్ ప్రాంతాల్లో నియామకాలు చేపట్టి అక్కడి ప్రజలకు ఇబ్బంది లేకుండా వైద్యసేవలు పొందేలా చేశామన్నారు. నాడు–నేడుతో అభివృద్ధి.. నాడు–నేడు కార్యక్రమంతో రాష్ట్రంలో నూతనంగా 17 వైద్య కళాశాలలను రూ.8,500 కోట్లతో ప్రారంభించామన్నారు. వాటిల్లో నేడు ఐదు కళాశాలలు ప్రారంభమైనట్లు చెప్పారు. గతంలో ఉన్న 11 మెడికల్ కాలేజీలను రూ.3,820 కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధి చేశామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి టీచింగ్ ఆస్పత్రి వరకు రూ.17,000 కోట్లతో అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. వ్యాధులు వచ్చాక చికిత్స అందించే ఆస్పత్రులను బలోపేతం చేయడంతోపాటు, వ్యాధులు రాకుండానే ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. దీన్లో భాగంగా ప్రివెంటివ్ మెడికల్ కేర్ ఏర్పాటు చేశామన్నారు. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాల ద్వారా పేదల ఇళ్లకే వైద్యులు వెళ్లి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులకు ఇళ్ల వద్దకే వైద్య సిబ్బంది వెళ్లి ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందిస్తున్నారని పేర్కొన్నారు. -
ఈఎస్ఐలో కొలువుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్య కొలువుల భర్తీకి ఈఎస్ఐసీ ఉపక్రమించింది. వివిధ కేటగిరీల్లో ఉన్న పోస్టుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన డాక్టర్ల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. నాలుగు కేటగిరీల్లో 40 పోస్టులు భర్తీ కానున్నాయి. సీనియర్ రెసిడెంట్ కేటగిరీలో 29 ఖాళీలు, సూపర్ స్పెషలిస్ట్ (సీనియర్ లెవల్)/ సీనియర్ కన్సల్టెంట్ కేటగిరీలో 5 ఖాళీలు, సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీలెవల్)/జూనియర్ కన్సల్టెంట్ కేటగిరీలో 3 ఖాళీలు, స్పెషలిస్ట్ కేటగిరీలో 3 ఖాళీలున్నాయి. రోస్టర్, రిజర్వేషన్ వారీగా పోస్టులను నోటిఫికేషన్లో ప్రకటించారు. ఈ కొలువుల భర్తీ పూర్తిగా మెరిట్, ఇంటర్వ్యూల పద్ధతిలో జరుగుతుంది. సూపర్ స్పెషలిస్ట్ (సీనియర్ లెవల్/ఎంట్రీలెవల్) గరిష్ట వయోపరిమితి 69 సంవత్సరాలుగా ఖరారు చేయగా.. స్పెషలిస్ట్కు 66 సంవత్సరాలు, సీనియర్ రెసిడెంట్కు 45 సంవత్సరాల గరిష్ట వయోపరిమితిని నిర్దేశించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని పూరించాలి. నిర్దేశించిన డాక్యుమెంట్లతో ఆయా తేదీల్లో ఇంటర్వ్యూకు నేరుగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగానే ప్రాధాన్యత ఇస్తారు. ఫలితాలను వెబ్సైట్లో పొందుపరుస్తారు. అర్హత సాధించిన వైద్యులు వెంటనే విధుల్లో చేరాల్సి ఉంటుంది. పోస్టుల వారీగా వేతనాలు సూపర్ స్పెషలిస్ట్ (సీనియర్ లెవల్) / సీనియర్ కన్సల్టెంట్ రూ.2,40,000/– (కన్సాలిడేట్ రెమ్యునరేషన్) సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీలెవల్) / జూనియర్ కన్సల్టెంట్ రూ.2,00,000/– (కన్సాలిడేట్ రెమ్యునరేషన్) స్పెషలిస్ట్ రూ.1,27,141/– (కన్సాలిడేట్ రెమ్యునరేషన్) సీనియర్ రెసిడెంట్ రూ.67,000/– + డీఏ, ఎన్పీఏ, హెచ్ఆర్ఏ, ఇతరాలు -
162 స్పెషలిస్ట్ వైద్యుల పోస్టులు భర్తీ
సాక్షి, అమరావతి: ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల నియామకానికి చేపట్టిన వాక్–ఇన్ ఇంటర్వ్యూలు ముగిశాయి. ఈ నెల 23 నుంచి మంగళవారం వరకూ నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 14 స్పెషాలిటీల్లో 162 పోస్టులను భర్తీ చేశారు. 14 స్పెషాలిటీల్లో 319 పోస్టులను నోటిఫై చేయగా 316 మంది వైద్యులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఇందులో 112 పోస్టులు శాశ్వత, 50 పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేశారు. వీటిలో జనరల్ మెడిసిన్ 28, జనరల్ సర్జరీ 27, గైనకాలజీ 33, అనస్తీషియా 22, పాథాలజీ 12, పీడియాట్రిక్స్ 12, మిగిలిన స్పెషాలిటీల్లో ఇతర పోస్టులు ఉన్నాయి. మరోవైపు ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేపట్టేలా అత్యవసర అనుమతులను ప్రభుత్వం ఇచ్చింది. -
భార్యాభర్తలకు ఒకేచోట పోస్టింగ్ కుదరదు
సాక్షి, హైదరాబాద్: సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీలో భార్యాభర్తలకు ప్రాధాన్యం ఉండబోదని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి మెరిట్ ఆధారంగానే డాక్టర్ పోస్టులను భర్తీ చేస్తామని తేల్చిచెప్పింది. ఈ మేరకు మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల తాత్కాలిక జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 734 పోస్టులు, వైద్య విధాన పరిషత్ పరిధిలో 209 పోస్టులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) పరిధిలో ఏడు పోస్టులకు అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. వాస్తవానికి మొత్తం 969 పోస్టులకుగాను 950 మందితో తుది జాబితాను విడుదల చేశారు. దివ్యాంగ అభ్యర్థులు లేకపోవడంతో వారికి కేటాయించిన 39 పోస్టుల్లో 19 మంది అభ్యర్థులే వచ్చారు. దీంతో మిగిలిన 20 పోస్టులను ఖాళీగా వదిలేశారు. వాటిని వచ్చే పోస్టుల భర్తీలో నింపుతారు. అప్పుడు కూడా రాకుంటే వాటిని సాధారణ పోస్టుల జాబితాలో చేరుస్తారు. మొత్తం జాబితాలో అత్యధికంగా మహిళా డాక్టర్లు 509 మంది, పురుష డాక్టర్లు 441 మంది ఉన్నారు. సాధారణంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉంటుంది. అయితే మెరిట్లో వారి రిజర్వేషన్కు మించి మహిళా డాక్టర్లు ఉన్నందున రిజర్వేషన్ను కాకుండా ప్రతిభ ఆధారంగానే జాబితా విడుదల చేసినట్లు బోర్డు వెల్లడించింది. వారం రోజుల్లో కౌన్సెలింగ్... మూడు విభాగాల్లో 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు మొత్తం 4,803 దరఖాస్తులు రాగా వాటిలో రెండో విడతలో 1,860 మంది అర్హులను ఎంపిక చేశారు. వారిలో దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది అర్హులతో 950 మందిని గుర్తించారు. వారం రోజుల్లోగా వారికి కౌన్సెలింగ్ నిర్వహించి మెరిట్ ప్రకారం పోస్టింగ్లు ఇస్తారు. ఇక్కడ ఎలాంటి రిజర్వేషన్ లేదా అనారోగ్య సమస్యలు లేదా భార్యాభర్తలకు ఒకచోట లేదా సమీప ఆసుపత్రుల్లో పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రాధాన్యాలు ఉండవని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం మెరిట్ ప్రకారం వారిచ్చే ప్రాధాన్యాల ప్రకారం పోస్టింగ్లు ఇస్తారు. మొదట వచ్చినవారికి ఇష్టమైన చోటకు పోస్టింగ్ వస్తుంది. తర్వాత వచ్చే వారికి వారి ప్రాధాన్యం ప్రకారం ఉంటే ఇస్తారు... లేకుంటే మరోచోటకు వెళ్లాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. బదిలీల సందర్భంగానే భార్యాభర్తలు, ఇతర ప్రాధాన్యాల ప్రకారం పోస్టింగ్లు ఇస్తారని, ఇప్పుడు మాత్రం కుదరదని చెబుతున్నారు. నేటి నుంచి అసిస్టెంట్ వైద్య ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు.. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల జాబితా విడుదలతో ఇక 1,147 అసిస్టెంట్ వైద్య ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైందని బోర్డు సభ్య కార్యదర్శి గోపినాథ్రెడ్డి తెలిపారు. ఈ పోస్టులకు మంగళవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ భర్తీ ప్రక్రియ ఒక దశకు చేరుకున్నాక నర్సుల పోస్టుల భర్తీపై ప్రకటన విడుదల చేస్తారు. ఇది సరికొత్త రికార్డు: మంత్రి హరీశ్రావు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మెరిట్ జాబితాలోని అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వైద్య, ఆరోగ్య చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైందన్నారు. 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ రెగ్యులర్ పోస్టుల భర్తీ ప్రక్రియను కేవలం ఆరు నెలల్లో బోర్డ్ పూర్తి చేసిందన్నారు. రాత పరీక్ష లేకుండా, నేరుగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం విశేషమన్నారు. -
కొత్త మెడికల్ కాలేజీల్లో 200 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పనున్న ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేయడానికి 200 వైద్యుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వనపర్తి, నాగర్కర్నూలు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రామగుండం మెడికల్ కాలేజీల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఏడాది కాలానికి నియమిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్రెడ్డి కోరారు. అభ్యర్థులు నిర్దేశిత రూపంలో తమ దరఖాస్తులను ఈ నెల 28లోగా ఆన్లైన్లో సమర్పించాలని కోరారు. అర్హత కలిగిన అభ్యర్థుల తుది జాబితాను 31వ తేదీన ప్రకటిస్తారు. వచ్చేనెల 7లోగా విధుల్లోకి చేరాలి ఎంపికైన అభ్యర్థులు నిర్దేశిత కాలేజీల్లో వచ్చే నెల ఏడో తేదీలోగా చేరాల్సి ఉంటుంది. ప్రొఫెసర్లకు నెలకు రూ.1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్లకు నెలకు రూ. 1.50 లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నెలకు రూ. 1.25 లక్షలు వేతనంగా చెల్లిస్తామని రమేశ్రెడ్డి తెలిపారు. అనాటమీ, ఫిజియోలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పెథాలజీ, మైక్రోబయోలజీ, ఫొరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, సైకియాట్రీ, ఆర్థోపెడిక్స్, అనెస్థిసియోలజీ, రేడియోడయాగ్నసిస్, ఎమర్జెన్సీ మెడిసిన్లలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement