breaking news
Dharma Durai
-
అలాంటి పాత్రలకు మేకప్ అవసరంలేదు!
వెండితెరపై ధగదగ మెరిసిపోవడం కోసం నటీనటులందరూ మేకప్ చేసుకుంటారనే విషయం తెలిసిందే. కథానాయికలైతే ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. హీరోతో పోల్చితే సినిమాలో హీరోయిన్లు కనిపించేది తక్కువ సన్నివేశాల్లోనే అయినా ఎక్కువ మేకప్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే, తక్కువ మేకప్ డిమాండ్ చేసే పాత్రలు వచ్చినప్పుడు కథానాయికలు సంబరపడిపోతారు. ప్రస్తుతం తమన్నా ఆ సంబరంలోనే ఉన్నారు. తమిళ చిత్రం ‘ధర్మదురై’లో ఆమె తక్కువ మేకప్తో కనిపించనున్నారు. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ - ‘‘పాత్ర అందమైనది అయినప్పుడు ప్రత్యేకంగా అందంగా కనిపించాల్సిన అవసరంలేదు. ఆ పాత్ర డీ-గ్లామరైజ్డ్గా ఉన్నా అందర్నీ ఆకట్టుకుంటుంది. అలాంటి బలమైన పాత్రనే నేను ‘ధర్మదురై’లో చేశాను. నిండైన చీరకట్టు, తలనిండా పువ్వులతో ఈ మధ్యకాలంలో ఏ సినిమాలోనూ కనిపించని విధంగా ఇందులో కనిపిస్తాను. ఈ చిత్రదర్శకుడు శీను రామస్వామి ‘రియలిస్టిక్ ఫిలింస్’ తీస్తారు. ‘ధర్మదురై’ కూడా అలానే ఉంటుంది. పాత్రలన్నీ నిత్యజీవితంలో మనం చూస్తున్నట్లుగానే ఉంటాయి. అందుకే ఇప్పటివరకూ నాకు ఆత్మసంతృప్తిని ఇచ్చిన చిత్రాల్లో దీనికి కూడా చోటు ఇచ్చా’’ అని చెప్పారు. -
తేనిలో తమన్నా
నేను మదురై సమీపంలోని తేని గ్రామానికి వచ్చానని తమన్న ట్విట్టర్లో పేర్నొన్నారు. కొన్ని చిత్రాలు కొందరి జీవితాల్లో మైలురాయిగా నిలిచిపోతాయి.ఆ విధంగా నటి తమన్నా నట జీవితం బాహుబలి చిత్రానికి ముందు, ఆ తరువాత అని చెప్పుకోవచ్చు. దాదాపు దశాబ్దం తరువాత బాహుబలి చిత్రం ఈ గుజరాతీ భామకు అనూహ్య హైప్ను తెచ్చిపెట్టింది. అవంతికగా తన అభినయం అమితంగా అలరించింది. అంతకు ముందు తమన్నా పనైపోయింది అన్న ఇప్పుడు ఔరా తమన్నా అంటున్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ తెలుగు, తమిళం భాషల్లో బిజీ కథానాయకి అని చెప్పవచ్చు. తమిళంలో ఇటీవల ఆమె నటించిన వాసువుమ్ శరవణనుమ్ చిత్రం పెద్దగా ఆడకపోయినా వరుసగా అవకాశాలు రావడం విశేషం. తాజాగా శీను రామసామి దర్శకత్వంలో విజయ్ సేతుపతికి జంటగా ధర్మదురై అనే చిత్రంలో నటిస్తున్నారు.ఈ చిత్రం ఇటీవలే మదురై జిల్లా సమీపంలో తేని గ్రామంలో ప్రారంభమైంది. దీని గురించి తమన్నా ట్విట్టర్లో పేర్కొంటూ నేనిప్పుడు ధర్మదురై చిత్రం కోసం తేని గ్రామానికి వచ్చాను.శీను రామసామి దర్శకత్వంలో నటించడం సూపర్ ఎగ్జైటింగ్గా ఫీలవుతున్నాను. ఇది సోషల్ డ్రామాతో కూడిన వైవిధ్యభరిత కథా చిత్రం. ఇందులో నాతో పాటు శివద , ఐశ్వర్యారాజేశ్, శ్రుష్టి డాంగే నటిస్తున్నారు. ముఖ్య పాత్రను నటి రాధిక పోషిస్తున్నారు. యువన్ శంకర్రాజా సంగీతాన్ని అందిస్తున్న ధర్మదురై చిత్రం జూన్లో తెరపైకి రానుంది అని తెలిపారు. తమన్నా ఈ చిత్రంతో పాటు నాగార్జున, కార్తీ కలిసి నటిస్తున్న ద్విభాషా చిత్రం ఊపిరి(తమిళంలో దోస్త్) చిత్రం, బాహుబలి-2 చిత్రంలో నటిస్తున్నారు.