breaking news
Deepak Chopra
-
వెల్లివిరిసిన యోగా ఉత్సాహం
న్యూయార్క్/బీజింగ్/ఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. రకరకాల యోగాసనాలు ఆచరించిన ఔత్సాహికులతో ప్రధాన నగరాలు కొత్తశోభను సంతరించుకున్నాయి. పార్కులు, మైదానాలు కిక్కిరిసిపోయాయి. ఎటుచూసినా యోగాభ్యాసకులే కనిపించారు. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినంగా 2014 డిసెంబర్లో ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సంగతి తెలిసిందే. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో రచయిత, ఆరోగ్య నిపణుడు దీపక్ చోప్రా నేతృత్వంలో యోగా వేడుకలు జరిగాయి. 1,200 మందికిపైగా దౌత్యవేత్తలు, అధి కారులు, ప్రవాస భారతీయులు, అమెరికన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యూయార్క్లో ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద యోగాసనాలు వేశారు. యునైటె డ్ కింగ్డమ్, చైనా, సింగపూర్, నేపాల్, జపాన్, మలేషియా, శ్రీలంక, థాయ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా యోగా ప్రాముఖ్యతను నిపుణులు వివరించారు. కులమతాలతో సంబంధం లేదు: ముర్ము భారత్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో యోగాభ్యాసకులు ఉత్సాహం పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాలుపంచుకున్నారు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము యోగాసనాలు వేశారు. యోగాకు కుల మతాలు, జాతులతో సంబంధం లేదని ఆమె చెప్పారు. భారతీయ శక్తికి యోగా ఒక ప్రతీక అని వివరించారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఒక సాధనంగా తోడ్పడుతుందని సూచించారు. మానసిక, శారీరక ఆరోగ్యగానికి ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను ఒక భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. -
‘పంచకర్మ’తో కొవ్వుల నియంత్రణ నిజమే
ఆయుర్వేద చికిత్స ప్రక్రియతో రక్తంలోని మెటబొలైట్స్లో మార్పులు వస్తున్నాయని తద్వారా కొలెస్ట్రాల్ నియంత్రణతోపాటు వాపు, గుండెజబ్బుల ప్రమాదం తగ్గడం వంటి సత్ఫలితాలు ఉంటాయని శాస్త్రీయ ప్రయోగమొకటి స్పష్టం చేసింది. ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. ఆయుర్వేద చికిత్స విధానాల్లో ‘పంచకర్మ’ ఒకటన్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా రోగులకు శాఖాహారం మాత్రమే అందిస్తూ... రోజూ యోగా, ధ్యానం చేయిస్తూ, అప్పుడప్పుడు శరీరానికి మర్దన చేయిస్తారు. ఈ ప్రక్రియ సామర్థ్యాన్ని శాస్త్రీయంగా అంచనా వేసేందుకు కాలిఫోర్నియా యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్కు చెందిన దీపక్ చోప్రా ఇటీవల ఒక ప్రయోగం చేపట్టారు. ఇందులో భాగంగా 30-80 ఏళ్ల 119 మందిని ఎంపిక చేసి వారిలో సగం మందికి ఆరు రోజులపాటు పంచకర్మ క్రియను అందించారు. చికిత్సకు ముందు, తరువాత రక్తం తాలూకూ ప్లాస్మాను క్షుణ్ణంగా విశ్లేషించారు. పంచకర్మ చికిత్స అందుకున్న వారి రక్తంలో దాదాపు 12 ఫాస్పోలిపిడ్స్ గణనీయంగా తగ్గాయని, ఈ మార్పులు వారి కొలెస్ట్రాల్ మోతాదులకు విలోమానుపాతంలో ఉన్నట్లు గుర్తించామని ఈ పరిశోధనలకు నేతత్వం వహించిన శాస్త్రవేత్త క్రిస్టీన్ తారా పీటర్సన్ తెలిపారు. ఈ ఫాస్పోలిపిడ్స్ కొలెస్ట్రాల్, వాపు నియంత్రణను ప్రభావితం చేస్తాయని, వీటిల్లో ఒక ఫాస్పోలిపిడ్ అధికమోతాదులో ఉండటం గుండెజబ్బులకు దారితీస్తుందని ఇప్పటికే గుర్తించారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ ప్రక్రియ ప్రభావశీలతకు కారణాలను విశ్లేషిస్తామని క్రిస్టీన్ వివరించారు.