breaking news
cultural presentation
-
కశ్మీర్లో జీ–20 సన్నాహకం షురూ
శ్రీనగర్: పాకిస్తాన్ పెడబొబ్బలను, చైనా అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ జమ్మూ కశ్మీర్లో జీ–20 సన్నాహక సదస్సు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం మొదలైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో చైనా మినహా అన్ని సభ్య దేశాల ప్రతినిధులూ పాల్గొన్నారు. పర్యాటక రంగం తదితరాలపై వారంతా లోతుగా చర్చించనున్నారు. వారికి సంప్రదాయ రీతిలో ఘనస్వాగతం లభించింది. తొలి రోజు ‘ఆర్థిక వృద్ధి, సాంస్కృతిక పరిరక్షణకు సినీ టూరిజం’ అంశంపై చర్చ జరిగింది. అనంతరం ప్రతినిధులంతా చారిత్రక దాల్ సరస్సులో బోట్ షికారు చేస్తూ కశ్మీర్ అందాలను ఆస్వాదించారు. కేంద్రం త్వరలోనే నూతన జాతీయ పర్యాటక విధానాన్ని ప్రకటిస్తుందని కేంద్ర సాంస్కృతి పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. గ్లోబల్ టూరిజం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ను కూడా నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకానికి కశ్మీర్లో అద్భుతమైన అవకాశాలున్నాయని మీడియా తో చెప్పారు. పర్యాటకాభివృద్ధికి వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం అనుమతిస్తున్నట్లు వివరించారు. ప్రైవేట్ భాగస్వామ్యం లేకుండా ప్రపంచ స్థాయికి చేరుకోలేమన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. హర్తాళ్ పిలుపులు గత చరిత్ర కశ్మీర్ ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని, మునుపటి లాగా బంద్ పిలుపులకు స్పందించడం లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ‘‘గతంలో కశ్మీర్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే పాక్ నుంచి వచ్చిన పిలుపుతో దుకాణాలు మూతబడేవి. ఇప్పుడు మాత్రం హర్తాళ్ చేపట్టాలంటూ ఎవరు పిలిపిచ్చినా పట్టించుకోవడం లేదు. ఉగ్రవాదం కారణంగా ఇప్పటికే రెండు తరాలు నష్టపోయిన విషయం ప్రజలు తెలుసుకున్నారు. అభివృద్ధి బాటన ముందుకు సాగాలనుకుంటున్నారు’’ అని అన్నారు. పర్యాటక రంగం ద్వారా ఉపాధికి కశ్మీర్లో ఎన్నో అవకాశాలున్నాయన్నారు. -
27, 28 తేదీల్లో రాయల ఉత్సవాలు
కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ పెనుకొండ : శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలను ఈనెల 27, 28వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సొల మన్ ఆరోగ్యరాజ్ తెలిపారు. శనివారం ఉత్సవాల ఏర్పాట్లపై అనంతపురం జిల్లా పెనుకొండలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా స్థాయి అధికారులతో పలు ప్రాంతాలు పరి శీలించారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని పరి శీలించి దానికి రంగు వేయాలని ఆర్డీఓ వెంకటేశుకు సూచిం చారు. ఉత్సవాలకు వచ్చేవారు ఉండేం దుకు తగిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో వేదిక ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. స్టాల్స్ ఏర్పాటు, రాయల కాలం నాటి వివిద యుద్ధ పోటీల విన్యాసాలు, కళాకృతుల ప్రదర్శన వంటి వాటిపై చర్చించారు. అనంతరం పెనుకొండ కొండపైకి చేరుకుని అక్కడ సమావేశం నిర్వహించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అన్నదానం, తాగు నీరు సరఫరా వంటి ఏర్పాట్లపై చర్చించారు. పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఇతర ముఖ్యుల రాక, వారికి ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. కార్యక్రమంలో ఏజేసీ రామస్వామి, డీఆర్డీఏ పీడీ నీలకంఠారెడ్డి, హౌసింగ్ పీడీ ప్రసాద్, సిరికల్చర్ జేడి అరుణకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాలను విజయవంతం చేద్దాం ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేసి శ్రీకృష్ణ దేవరాయలు ఉత్సవాలను విజయవంతం చే యాలని కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ పిలుపునిచ్చారు. పట్టణంలోని భవన విజయం సమావేశపు భవనంలో ఆయన జిల్లా, మండల, డివిజన్ అధికారులతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాయలు ఉత్సవాల నిర్వహణకు 16 కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. కమిటీలో నిర్దేశించిన మేరకు ఆయా అధికారులు తమ భాధ్యతలు నిర్వర్తించాలన్నారు. ప్రస్తుతం ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.32 లక్షల నిధులు విడుదల చేసిందని తెలిపారు. మరిన్ని నిధులు అవసరమైతే దాతల సహకారం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.