breaking news
business agreements
-
భారత్తో బిగ్ డీల్.. ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. చైనాతో ఒక వాణిజ్య ఒప్పందం కుదిరింది.. త్వరలోనే భారత్తో చాలా పెద్ద ఒప్పందం ఉంటుందని అంటూ ట్రంప్ హింట్ ఇచ్చారు. దీంతో, భారత్తో ట్రంప్ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకుంటారనే ఆసక్తి నెలకొంది.తాజాగా బిగ్ బ్యూటిఫుల్ బిల్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ..‘ప్రతి ఒక్కరూ మాతో ఒప్పందం చేసుకోవాలని చూస్తున్నారు. మేము చైనాతో నిన్ననే ఒప్పందంపై సంతకాలు చేశాం. కొన్ని గొప్ప దేశాలతో ఒప్పందాలు కుదరనున్నాయి. త్వరలో భారత్తో ఒక భారీ డీల్ చేసుకోబోతున్నాం. అది చాలా పెద్దది. మేము భారత్లో మార్కెట్లను తెరవబోతున్నాం’ అంటూ హింట్ ఇచ్చారు. ఇదే సమయంలో అమెరికా కొన్ని దేశాలతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధంగా లేదు. వారితో ఎలాంటి వాణిజ్యం ఉండదు. కొన్ని దేశాలకు కేవలం ఒక లేఖ పంపి.. 25, 35, లేదా 45 శాతం పన్నులు చెల్లించమని చెబుతాం. అదే సులువైన మార్గం’ అని చెప్పుకొచ్చారు. అయితే, చైనాతో ఎలాంటి ఒప్పందం కుదిరింది అనే విషయాన్ని మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. ఈ క్రమంలో అమెరికా-చైనా మధ్య డీల్ ఏంటనే చర్చ నడుస్తోంది.#WATCH | "...We just signed (trade deal) with China. We're not going to make deals with everybody... But we're having some great deals. We have one coming up, maybe with India, a very big one. We're going to open up India. In the China deal, we're starting to open up China.… pic.twitter.com/fJwmz1wK44— ANI (@ANI) June 26, 2025ఇదిలా ఉండగా.. ట్రంప్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో కొద్ది వారాల క్రితం ఢిల్లీ వేదికగా ఇరు దేశాల మధ్య జరిగిన కీలక చర్చల్లో పలు నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇరు దేశాల ప్రతినిధులు ఢిల్లీలో నాలుగు రోజుల పాటు రహస్యంగా చర్చలు జరిపారు. అమెరికా తరఫున ఆ దేశ వాణిజ్య ప్రతినిధి కార్యాలయ (USTR) అధికారులు, భారత్ తరఫున వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన రాజేశ్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం ఈ చర్చల్లో పాల్గొంది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ సౌకర్యం కల్పించడం, సుంకాల తగ్గింపు, ఇతర అంశాలపై కీలక చర్చ జరిగింది. ఇక, ప్రస్తుతం 190 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశమని సమాచారం. -
ఒకట్రెండు త్రైమాసికాలు సవాళ్లే
ముంబై: వ్యాపార ఒప్పందాల విషయంలో జాప్యం జరుగుతోందని మధ్య స్థాయి ఐటీ కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ తెలిపింది. రాబోయే ఒకట్రెండు త్రైమాసికాలు సవాళ్లు ఉంటాయని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సందీప్ కల్రా శుక్రవారం తెలిపారు. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, కోవిడ్ మహమ్మారి వంటి సవాళ్లను కంపెనీ చవిచూసిందని అన్నారు. ‘ప్రస్తుతం ఒప్పందాల ముగింపునకు ఎక్కువ సమయం పడుతోంది. సగటు సమయం సుమారు మూడు నెలల నుండి 4–6 నెలలకు చేరింది. జూన్ త్రైమాసికంలో కొత్త ఒప్పందాల విలువ మార్చి త్రైమాసికంతో పోలిస్తే రూ.2,050 కోట్ల నుంచి రూ.1,943 కోట్లకు పడిపోయింది. అయితే ఒప్పందాల విషయమై పలు సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయి. కంపెనీ ఆదాయ వృద్ధి మార్చి త్రైమాసికంతో పోలిస్తే దాదాపు 3 శాతం క్షీణించి రూ.2,321 కోట్లకు పడిపోయింది. నిర్ణీత సమయాల్లో మొత్తం 800 మంది ఫ్రెషర్లను బోర్డులోకి తీసుకురావడానికి కంపెనీ కట్టుబడి ఉంది. మార్చితో పోలిస్తే జూన్ క్వార్టరులో ప్రాఫిట్ మార్జిన్ 0.5 తగ్గి 14.9 శాతంగా ఉంది. నికరలాభం 8.1 శాతం ఎగసి రూ.229 కోట్లను తాకింది. కొత్తగా 240 మంది చేరికతో మొత్తం సిబ్బంది సంఖ్య జూన్ చివరినాటికి 23,130కి చేరింది. కోల్కత, కొచి్చలో నూతనంగా కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం’ అని సందీప్ వెల్లడించారు. -
'మీది ప్రపంచ కర్మాగారమైతే.. మాది వనరుల క్షేత్రం'
వ్యాపారం చేయడంతోపాటు అందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మూడు రోజుల చైనా పర్యటనలో భాగంగా శనివారం షాంఘై నగరానికి చేరుకున్న ఆయన.. భారత్- చైనా వ్యాపార వేదికనుద్దేశించి ప్రసంగించారు. చైనాను ప్రపంచ కర్మాగారంగా అభివర్ణించిన ఆయన.. భారత్ వనరులకు కేంద్రమన్నారు. భారత్ మీకొక చారిత్రక అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ తరుణంలో పరస్పర సహకారం ద్వారా ఇరుదేశాలూ మరింత అభివృద్ధిని సాధించవచ్చు' అని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్- చైనా మధ్య 22 బిలియన్ డాలర్ల విలువైన 21 ఒప్పందాల కుదిరాయి. 'ఇండియా- చైనా బిజినెస్ ఫోరంలో 22 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి' అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్టిట్టర్ ద్వారా తెలిపారు.