-
‘బల్క్’ పంపారో బుక్కవుతారు
న్యూఢిల్లీ: వాట్సాప్లో చాలా మందికి ఒకేసారి మెసేజ్లు పంపుతున్నారా..? నిబంధనలకు విరుద్ధంగా వాట్సాప్ను దుర్వినియోగం చేస్తున్నారా? కాస్త ఆలోచించండి. అలా చేస్తే మీపై చట్టపరమైన చర్యలు తీసుకునే చాన్సుంది. జైలుశిక్షా పడొచ్చు. వ్యక్తులుగానీ, సంస్థలుగానీ ఒకేసారి చాలా మెసేజ్లు పంపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాట్సాప్ తెలిపింది. ఈ నిబంధనలు డిసెంబర్ 7 నుంచి అమల్లోకొస్తాయంది. ‘కంపెనీ నిబంధనలు ఉల్లంఘించినా వారిపై, అందుకు సహకరించినా, ఆటోమేటిక్గా మెసెజ్లు పంపినా, ఒకేసారి ఎక్కువ మెసేజ్లు పంపినా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపింది. ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న విషయంపై స్పష్టతనివ్వలేదు. ఒకేసారి, ఆటోమేటిక్గా మెసేజ్లు పంపేందుకు వాట్సాప్ను తయారు చేయలేదని పేర్కొంది. భారత్లో లోక్సభ ఎన్నికల సమయంలో వాట్సాప్ను దుర్వినియోగపరిచి, ఫ్రీ క్లోన్ యాప్స్ ద్వారా ఓటర్లకు పెద్ద సంఖ్యలో సందేశాలు పంపినట్లు వార్తలు వచ్చాయి. దీంతో కేంద్రం వాట్సాప్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
లాటరీ తగిలిందని దోచేస్తారు...!
బల్క్ ఎస్సెమ్మెస్లతో నైజీరియన్ల వల ఆదాయ పన్ను కట్టాలని డబ్బు వసూలు మోసపోయిన పలువురు పెళ్లి పేరుతోనూ యువతులకు గాలం నిందితులను ట్రాన్సిట్ రిమాండ్పై సిటీకి తీసుకొచ్చిన పోలీసులు సిటీబ్యూరో: ఎయిర్టెల్..చెవ్రోలెట్ కార్ ప్రోమో...ఆపిల్ ఐ ఫోన్ డ్రా...ఇలా వివిధ లాటరీలు తగిలాయంటూ ఎస్ఎంఎస్లు రాగానే ఎగిరి గంతేయకండి. ఈ నగదు బహుమతిని సొంతం చేసుకోవాలంటే మీ పూర్తి వివరాలు ఈ మెయిల్ చేయండనే సందేశం రాగానే.. చకచకా కీబోర్డుపై టపటపా వివరాలు కొట్టేయకండి. అలా చేస్తే మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ. లక్షలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇలా సీన్ మొదలవుతుంది... అపరిచితులు పంపిన ఇలాంటి ఎస్ఎంఎస్లు ఊరిస్తుంటాయి. కొందరు లైట్గా తీసుకుంటే...మరికొందరు సీరియస్గా తీసుకొని ముందుకెళ్తున్నారు. మనిషికి ఉన్న డబ్బు ఆశను క్యాష్ చేసుకోవడానికి నైజీరియన్లు గేలం వేస్తున్నారు. ఇదే దేశానికి చెందిన బాబ్(అలియాస్ జేమ్స్) మీకు లాటరీ తగిలిందని బల్క్ ఎస్ఎంస్లు పంపించి పూర్తి వివరాలను తనకు మెయిల్ చేయమని ఓ మెయిల్ ఐడీ పంపిస్తాడు. అతడి ఎస్ఎంఎస్కు స్పందించి కొంతమంది అమాయకులు తమ వివరాలు పంపుతారు. తర్వాత గెలుచుకున్న నగదును పంపాలంటే ఆదాయ పన్ను కట్టాలని చెప్తాడు. ఢిల్లీలో వివిధ బ్యాంక్ల్లో తన ఏజెంట్లు తెరిచిన బ్యాంక్ అకౌంట్ నెంబర్లు పంపి డబ్బు డిపాజిట్ చేయమని కోరతాడు. నగదు బహుమతి కోసం ఆశపడిన అమాయకులు డబ్బు డిపాజిట్ చేయగానే ఆ డబ్బును ఏజెంట్లు విత్డ్రా చేస్తారు. అదే రోజూ సాయంత్రం బాబ్ను గుర్గావ్కు సమీపంలోని మాల్స్లో కలిసి ఆ డబ్బును అందచేస్తారు. ఇందులో నుంచి ఒక్కో ఏజెంట్కు మూడు నుంచి 10 శాతం వరకు కమిషన్ చెల్లిస్తాడు. అయితే పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఈ బ్యాంక్ ఖాతాలను కేవలం మూడు నెలలు మాత్రమే వినియోగంలో ఉంచి ఆ తర్వాత రద్దు చేస్తారు. ఆరుగురి కస్టమర్లకు ఒక ఫోన్...ఒక పేరు... బాబ్ (జేమ్స్) 50 నుంచి 60 ఫోన్లు వాడుతున్నాడు. ఆ నంబర్లతోనే కస్టమర్లకు ఫోన్ చేస్తాడు. ఒక్కో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఒక్కో పేరుతో మాట్లాడేవాడు. ఆరుగురు కస్టమర్లకు ఒక్కో ఫోన్ వినియోగించేవాడు. ప్రజలను మోసగించడం, లూటీ చేయడం అయ్యాక ఆ ఫోన్, సిమ్కార్డులను ధ్వంసం చేస్తాడు. యూకే, పాకిస్తాన్ల నుంచి తెప్పించిన సిమ్స్ కార్డ్సతో... ఒక్కో ఫోన్కు ఒక్కో పేరుతో చీటీ రాసి పెట్టుకునేవాడు. సదరు సెల్కు కాల్ రాగానే ఆ ఫోన్పై ఉన్న చీటీలో పేరు చూసి అదే పేరుతో మాట్లాడేవాడు. యూకే నుంచి తెప్పించుకున్న సిమ్ కార్డులు ఉపయోగిస్తూ బ్రిటన్ దేశస్తుడిగా పరిచయం చేసుకునేవాడు. ఇదే తరహాలో పాకిస్తాన్కు చెందిన సిమ్కార్డులు కూడా వాడేవాడు. అయితే ఇదంతా ఢిల్లీ కేంద్రంగానే నడిపేవాడు. ముగ్గురిని ముగ్గులోకి దింపాడు... పెళ్లి చేసుకోవాలనుకుంటున్న సంపన్న యువతులకు గాలం వేసేందుకు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో ఒక్కోదానిలో ఒక్కో ప్రొఫైల్తో రిజిస్టర్ చేసుకున్నాడు బాబ్. ఆ తర్వాత ధనవంతుల అమ్మాయిలు, సాఫ్ట్వేర్ ఉద్యోగినులను కాంటాక్ట్ అయి పెళ్లి ప్రతిపాదనను తీసుకొచ్చేవాడు. మంచి హోదాలో ఉన్నానని, ధనవంతుడనని వారిని నమ్మించేవాడు. ఆ తర్వాతే బాబ్ సహాయకురాలు లెనియా సీన్లోకి వస్తుంది. కొన్నిసార్లు కస్టమ్ అధికారిణిగా, మరికొన్ని సార్లు ఐఎంఎఫ్ ఉద్యోగిణిగా పరిచ యం చేసుకుంటుంది. మీకు రావాల్సిన నగదు పార్సల్ అందాలంటే పన్ను చెల్లించాలని చెప్పి.. బ్యాంక్ ఖాతా నెంబర్ ఇచ్చి డబ్బు డిపాజిట్ చేయించుకుంటుంది. ఇలా వీరి వలలో చిక్కి హైదరాబాద్కు చెందిన ఓ అమ్మాయి ఈ ఏడాది ఏప్రిల్లో దాదాపు రూ. 48 లక్షలు చెల్లించింది. మరో అమ్మాయి రూ. 7 లక్షల వరకు మోసపోయింది. మరో అమ్మాయి ఫేస్బుక్తో బాబ్ వలలో పడి రూ.20 లక్షలు సమర్పించుకుంది. ఎట్టకేలకు దొరికారు... వీరి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ పోలీసులు ఢిల్లీ పోలీసులతో సంప్రదింపులు జరిపారు. పక్కా వ్యూహంతో బాబ్, జోసెఫ్తో సహా నాగ్లాండ్కు చెందిన లెనియాను అరెస్టు చేశారు. వీరిని ట్రాన్సిట్ రిమాండ్పై నగర పోలీసులు గురువారం హైదరాబాద్కు తీసుకొచ్చారు. జాగ్రత్త అవసరం.. ప్లస్ 371, ప్లస్ 371 నంబర్లతో వచ్చే ఫోన్ల విషయంలో జాగ్రత్త వహించండి. ఫేస్బుక్లో వ్యక్తిగత సమాచారం పెట్టకపోవడమే ఉత్తమం. బూటకపు ఈమెయిల్స్తో నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్నాయి కొన్ని నకిలీ సంస్థలు. నగదు లావాదేవీల్లో నయా వంచన జరుగుతోంది. అమ్మాయిలు కూడా ఊరికే ఎదుట వ్యక్తులను నమ్మి లక్షలు లక్షలు ధారపోయడం కరెక్ట్ కాదు. సైబర్ నేరగాళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. - స్వాతిలక్రా, అదనపు పోలీసు కమిషనర్, క్రైమ్స -
బల్క్ ఎస్ఎంఎస్లపై ఈసీ పర్యవేక్షణ
సిమ్లా: ఎన్నికల సమయంలో అభ్యర్థులు, పార్టీలు పంపే బల్క్ ఎస్ఎంఎస్లు, రికార్డ్ చేసిన వాయిస్ మెసేజీలను పర్యవేక్షించాలని ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయించింది. ఎన్నికల నియమావళి, చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రచారంతో పాటు ప్రత్యర్థులపై బురద జల్లేందుకు అభ్యర్థులు బల్క్ ఎస్ఎంఎస్లను, వాయిస్ మెసేజీలను పెద్ద మొత్తంలో పంపుతున్న నేపథ్యంలో వీటిపై దృష్టి సారించనున్నట్లు ఈ మేరకు ముఖ్య ఎన్నికల అధికారి నరీందర్ చౌహాన్ వెల్లడించారు. బల్క్ ఎస్ఎంఎస్లను పోలీసు అధికారులు పర్యవేక్షించేందుకు, వీటి వ్యయాన్నీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులో చేర్చేందుకు మార్గదర్శకాలను కూడా జారీ చేశామని తెలిపారు. -
నేటి సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగించాలి
కలెక్టరేట్, న్యూస్లైన్: జిల్లాలో ఈ నెల 28వ తేదీ సోమవారం 6 గంటలకు ఎన్నికల ప్రచారాన్ని ముగించాలని రాజకీయ పార్టీలకు, పోటీ చేసే అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్లాల్ ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఆయన జిల్లా కలెక్టర్లతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ప్రచారం చేసేందుకు వచ్చిన ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆయా నియోజకవర్గాలను విడిచి వెళ్లిపోవాలన్నారు. 28వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత అభ్యర్థుల ఇంటింటి ప్రచారాన్ని కూడా నిషేధించామన్నారు. 28వ తేదీ ప్రచారం ముగిసిన అనంతరం ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా రాజకీయ ప్రకటనలను నిషేధిస్తున్నామన్నారు. అలాగే బల్క్ ఎస్ఎంఎస్లను కూడా నిషేధిస్తున్నట్టు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సామర్థ్యం, తాగునీరు, ఎండ నుంచి ఉపశమనం పొందేలా టెంట్లు లేదా ఇతర వసతులు కల్పించాలని ఆదేశించారు. 28, 29 తేదీలు అత్యంత కీలకమైనందున ఎంసీసీ, ఎన్ఎస్టీ బృందాలు చురుగ్గా పనిచేయాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ స్మితా సబర్వాల్, జేసీ శరత్, డీఆర్ఓ దయానంద్ తదితరులు పాల్గొన్నారు. ఓటు వేస్తే నిత్యావసర వస్తువుల కొనుగోలుపై రాయితీ కలెక్టరేట్: ఈనెల 30వ తేదీన ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుకు ప్రతి వంద రూపాయల నిత్యావసర వస్తువుల కొనుగోలుపై మూడు రూపాయల రాయితీ అందిస్తున్నట్టు కలెక్టర్ స్మితా సబర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 95 శాతం ఓటింగ్ను వినియోగించుకొనేందుకు జిల్లా పాలనా యంత్రాంగం చేపట్టిన పలు కార్యక్రమాలు జిల్లాలో ఫుడ్ గ్రెయిన్స్ హోల్సేల్ దుకాణ దారులు పూర్తి స్థాయిలో మద్దతు పలికి మూడు శాతం రాయితీ ఇచ్చేందుకు అంగీకరించారని చెప్పారు. జిల్లాలో 501 హోల్సేల్ దుకాణాలు ఈ రాయితీ కల్పిస్తాయని తెలిపారు. ఈనెల 30న మే 1,2 తేదీల్లో వంద రూపాయల నుంచి మూడు వేల రూపాయల వస్తువులు కొనుగోలు చేసిన వారికి మూడు శాతం రాయితీ అందజేస్తారని ఆమె చెప్పారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుకు 30వ తేదీన జిల్లాలోని 151 పెట్రోల్ బంక్లలో లీటరుపై ఒక రూపాయి రాయితీ కల్పించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. గరిష్టంగా మూడు లీటర్ల వరకు ఈ రాయితీ అందిస్తారని అన్నారు. జిల్లాలోని ప్రతి ఓటరు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement