breaking news
Atul Wassan
-
మీ కెప్టెన్ హిందువు: బంగ్లాదేశ్కు భారత మాజీ క్రికెటర్ సలహా
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడం దాదాపుగా ఖాయమైనట్లే కనిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మాటను లెక్కచేయకుండా పంతానికి పోయినందుకు బంగ్లా టోర్నీలో ఆడే అవకాశం కోల్పోవడం లాంఛనమే అనిపిస్తోంది. కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య గత కొంతకాలంగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలుగతంలో తమకు చేదోడువాదోడుగా నిలిచిన భారత్పై కొంతమంది బంగ్లాదేశ్ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై వరుస దాడులు ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ను బీసీసీఐ తప్పించింది.ఐసీసీ మాట వినని బీసీబీఈ విషయాన్ని సాకుగా చూపుతూ టీ20 ప్రపంచకప్-2026లో భారత్లో తమ మ్యాచ్లు ఆడబోడమంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) రచ్చకెక్కింది. తమ ఆటగాళ్లకు అక్కడ భద్రత ఉండదంటూ కొత్తగా రాగం ఎత్తుకుంది. తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని కోరగా.. ఐసీసీ ఇందుకు నిరాకరించింది.ఈ క్రమంలో ఐసీసీ తమ పట్ల న్యాయంగా వ్యవహరించాలని.. ఏదేమైనా తాము భారత్లో ఆడబోమని బంగ్లాదేశ్ గురువారమే తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ బీసీబీకి ఓ సలహా ఇచ్చాడు.మీ కెప్టెన్ ఓ హిందువువార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ.. ‘‘నిజంగా ఐసీసీకి ఇదొక పీడకలలాంటిది. చాన్నాళ్ల క్రితమే టీ20 ప్రపంచకప్ టోర్నీ నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి. టోర్నీ ఆరంభానికి సమయం కూడా ఆసన్నమైంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఇలా చేయడం సరికాదు.భారత్లో భద్రతా పరమైన ఇబ్బందులు ఉంటాయని నేను అనుకోను. అసలు ఇక్కడ గతంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇక్కడ సెక్యూరిటీకి వచ్చిన ఇబ్బంది ఏమీలేదు. మీ కెప్టెన్ (Litton Das) ఓ హిందువు.ఈ విషయాన్ని బంగ్లాదేశ్ తమకు సానుకూలంగా మలచుకోవచ్చే. టోర్నీలో పాల్గొనడం ద్వారా ప్రస్తుతం ఇరుదేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు’’ అని అతుల్ వాసన్ బంగ్లాదేశ్కు హితవు పలికాడు. కాగా భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు వరల్డ్కప్ టోర్నీ జరుగనుంది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి బంగ్లాదేశ్ జట్టులిట్టన్ దాస్ (కెప్టెన్), మహ్మద్ సైఫ్ హసన్, తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఇమోన్, తౌహిద్ హృదోయ్, షమీమ్ హొస్సేన్, నూరుల్ హసన్ సోహన్, మెహదీ హసన్, రిషద్ హొస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్, తాంజిమ్ హసన్ సకీబ్, టస్కిన్ అహ్మద్, మహ్మద్ షైపుద్దీన్, షోరిఫుల్ ఇస్లాం. చదవండి: భారత్కు మాత్రమే అవకాశం ఇస్తారా?: బంగ్లాదేశ్ ఆరోపణలు -
ఇంటిపేరు వల్లే అతడిని ఎంపిక చేయలేదా?.. మాజీ క్రికెటర్ స్ట్రాంగ్ కౌంటర్
సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్కు ఎంపిక చేసిన భారత్- ‘ఎ’ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan)కు చోటు దక్కలేదు. రిషభ్ పంత్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఈ జట్టుకు వైస్ కెప్టెన్గా సాయి సుదర్శన్ (Sai Sudharsan)ను ఎంపిక చేశారు సెలక్టర్లు.కావాల్సినంత ప్రాక్టీస్అదే విధంగా రెండో అనధికారిక టెస్టులో కేఎల్ రాహుల్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ వంటి టీమిండియా స్టార్లకు కూడా చోటిచ్చారు. సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్కు సన్నాహకంగా ఉండే ఈ రెడ్బాల్ సిరీస్తో ఆటగాళ్లకు కావాల్సినంత ప్రాక్టీస్ దొరకనుంది.పక్కనపెట్టడంపై విమర్శలుఇక ‘ఎ’ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సర్ఫరాజ్ ఖాన్కు ప్రధాన జట్టులో స్థానం దక్కదనే స్పష్టంగానే తెలుస్తోంది. ఇటీవలే పదిహేడు కిలోల బరువు తగ్గడంతో పాటు రెడ్ బాల్ టోర్నీల్లో సెంచరీ చేసినా సెలక్టర్లు అతడిని ఇలా పక్కనపెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత షామా మొహమ్మద్ సంచలన ట్వీట్ చేశారు.ఇంటిపేరు వల్లే అతడిని ఎంపిక చేయలేదా?‘‘ఇంటిపేరు కారణంగానే సర్ఫరాజ్ ఖాన్ జట్టుకు ఎంపిక కాలేదా?.. ఊరికే అడుగుతున్నా అంతే!.. ఈ విషయంలో గౌతం గంభీర్ విధానాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే కదా!’’ అంటూ హెడ్కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతం గంభీర్ను షామా మొహమ్మద్ టార్గెట్ చేశారు.కరెక్ట్ కాదు మేడమ్..ఈ నేపథ్యంలో షామా ట్వీట్పై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అయితే, మెజారిటీ మంది ఆమె ఆలోచనా విధానాన్ని తప్పుబడుతున్నారు. మొహమ్మద్ సిరాజ్ జట్టులోని ప్రధాన బౌలర్లలో ఒకడన్న విషయాన్ని మర్చిపోవద్దని హితవు పలుకుతున్నారు. ఆటలో ఇలాంటి రాజకీయాలకు తావు లేదని.. ఇలాంటి మాటలతో చిచ్చు పెట్టాలని చూడటం సరికాదని పేర్కొంటున్నారు.భారత క్రికెట్లో ఎప్పుడూ ఇలా జరుగలేదుఈ క్రమంలో టీమిండియా మాజీ పేసర్ అతుల్ వాసన్.. షామా మొహమ్మద్ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా విషాదకరం. ఇలాంటి మాటలు వద్దు. సర్ఫరాజ్ ఖాన్ జట్టులో ఉండేందుకు అర్హుడు.అయితే, అతడికి రావాల్సినన్ని అవకాశాలు రావడం లేదన్న మాట వాస్తవమే. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు అర్థంలేనివి. భారత క్రికెట్లో ఎప్పుడూ ఇలా జరుగలేదు. అజర్ హయాంలోనూ కొందరు ఇలాంటి మాటలే మాట్లాడారు.కానీ ఇందులో మతపరమైన కోణం ఉంటుందని నేను అస్సలు అనుకోను. సర్ఫరాజ్ ప్రస్తుత ప్రదర్శనల ఆధారంగానే జట్టులోకి ఎంపిక కాలేడు. చాన్నాళ్లుగా మూడు ఫార్మాట్లలోనూ రాణిస్తున్న ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది.సర్ఫరాజ్కు తగినన్ని ఛాన్సులు రాలేదు.. కానీఅయితే, ఓ ప్లేయర్ ఒక్క మ్యాచ్లో విఫలమైనంత మాత్రాన పక్కన పెట్టడం సరికాదు. సర్ఫరాజ్ ఖాన్కు తగినన్ని ఛాన్సులు రాలేదు. ఒకవేళ గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన రిషభ్ పంత్.. తర్వాత విఫలమైనా అతడిని పక్కనపెట్టడం జరగదు.జట్టు ప్రయోజనాల కోసం కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. వీటిని ఎవరూ మార్చలేరు’’ అని అతుల్ వాసన్ చెప్పుకొచ్చాడు. కాగా ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గతేడాది టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడి ఓ సెంచరీ, మూడు అర్థ శతకాల సాయంతో 371 పరుగులు చేశాడు. రోహిత్ లావుగా ఉన్నాడని..కాగా షామా మొహమ్మద్ గతంలోనూ రోహిత్ శర్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహిత్ లావుగా ఉన్నాడని.. అదృష్టం కొద్దీ కెప్టెన్ అయ్యాడే తప్ప అతడికి అంత సీన్ లేదని వ్యాఖ్యానించారు. కాగా భారత్కు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత రోహిత్ శర్మది.చదవండి: ఓపెనర్గానూ రోహిత్ శర్మపై వేటు!?.. గంభీర్, అగార్కర్ చర్య వైరల్ -
ఛీ.. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు.. ఇదేం పద్ధతి?
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ (Atul Wassan) తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారంటూ ఘాటు విమర్శలు చేశాడు. అసలేం జరిగిందంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత టీమిండియా- పాకిస్తాన్ ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నీలో భాగంగా తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే.మరోసారి జయభేరిదుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు పాక్పై ఆధిపత్యం కొనసాగిస్తూ మరోసారి జయభేరి మోగించింది. సల్మాన్ ఆఘా బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో సూర్యకుమార్ సేన చిత్తు చేసింది. ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా.. భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనానికి నిరాకరించారు.రచ్చకెక్కిన పాక్ బోర్డుటాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ సారథి సల్మాన్ ఆఘాను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత జట్టు ఇదే పంథా అనుసరించింది. పాక్ ప్లేయర్లు షేక్హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు కనిపించగా.. భారత ఆటగాళ్లు మాత్రం ఇందుకు విముఖత వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు రచ్చకెక్కింది. తమను అవమానించారని.. క్రీడాస్ఫూర్తికి ఇది విరుద్దమని గగ్గోలు పెడుతోంది. మ్యాచ్ రిఫరీపై వేటు వేయాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి.మరీ సిగ్గు లేకుండా తయారయ్యారుఈ విషయంపై భారత మాజీ పేసర్ అతుల్ వాసన్ ఘాటుగా స్పందించాడు. ‘‘ఛీ.. వాళ్లు మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు. షేక్హ్యాండ్ ఇవ్వాలంటూ మనల్ని బలవంతపెట్టాలని చూస్తున్నారు. ఇదేం పద్ధతి?.. మీకు అవమానం జరిగిందని ప్రపంచం మొత్తానికి తెలిసింది.మీతో కరచాలనం చేసేందుకు మేము సిద్ధంగా లేమని స్పష్టంగా అర్థమైంది కదా!.. మరి ఇంకెందుకు కరచాలనం కావాలంటూ పట్టుబడుతున్నారు? ఈ విషయంపై ఫిర్యాదు చేయడం ద్వారా తమను తామే మరింతగా కించపరుచుకున్నట్లు అయింది. అందుకే మ్యాచ్ ఆడారుఇలా కంప్లైంట్ చేయడం ద్వారా తమకు పరిణతి లేదని వారే చెప్పినట్లుగా ఉంది. క్రీడా విధానానికి అనుగుణంగానే మనం ఆ మ్యాచ్ ఆడాము.అంతేగానీ.. వాళ్లు మన నుంచి ఇంతకంటే ఎక్కువగా ఆశించడం తప్పే అవుతుంది. ఎందుకంటే మీరంటే మాకు ఇష్టం లేదు’’ అంటూ అతుల్ వాసన్ వార్తా సంస్థ ANIతో తన మనసులోని భావాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు.చదవండి: Asia Cup Handshake Controversy: హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్కు ఐసీసీ షాక్?


