breaking news
Aligarh city
-
బీజేపీలో చేరితే చంపుతామంటున్నారు!
అలీగఢ్: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నందుకు సొంత వర్గీయులు తమను చంపుతామని బెదిరిస్తున్నారని బీజేపీకి చెందిన మైనార్టీ నాయకురాలు తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదిస్తూ ఇటీవల పార్లమెంటులో కొత్త చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చర్యతో ప్రధాని మోదీ పట్ల అభిమానంతో పలువురు ముస్లిం మహిళలు బీజేపీ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారు. అంతేకాక బీజేపీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముస్లిం మహిళలు చెప్పుకోదగ్గ స్థాయిలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో యూపీలోని ఆలీగఢ్లో మైనారిటీ వర్గానికి చెందిన బీజేపీ నాయకురాలు ఫరీన్ మోసిన్ స్థానికంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో తనకు బెదిరింపులు వచ్చాయనీ అంతేగాక, తన భర్త మహమ్మద్ మోసీన్పై అతని ఆఫీసులోనే దాదాపు ఏడెనిమిది మంది దాడి చేసి త్రిపుల్ తలాక్ బిల్లుకు అనుకూలంగా వ్యవహరిస్తే నిన్నూ, నీ భార్యను చంపేస్తామని బెదిరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన ఈ నెల 8న జరిగింది. అదే రోజు త్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. కాగా, ఈ కేసు విషయంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అలీగఢ్ ఏఎస్పీ అభిషేక్ తెలిపారు. -
పోలీస్ ఇంట్లో మృతదేహాల కలకలం!
లక్నో: ఓ పోలీస్ అధికారి అధికారి ఇంట్లో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు బయటపడటం కలకలం సృష్టించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్ బాలురు ఓ పోలీస్ ఆఫీసర్ కు చెందిన నిర్మాణంలో ఉన్న ఇంట్లో శవాలుగా పడి ఉన్నట్లు గుర్తిచినట్లు ఓ పోలీస్ తెలపాడు. ఇదిలాఉండగా వికాస్(15), ఆకాశ్(13) అనే ఇద్దరు బాలురు బుధవారం సాయంత్ర నుంచి కనిపించడం లేదంటూ వారి కుటుంబసభ్యులు ఫిర్యాదుచేశారు. చనిపోయిన వారు తప్పిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్న బాలురా.. లేక వీళ్లు వేరేనా అనేది పోలీసులకు అంతుపట్టడం లేదు. అయితే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.