
రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్పేట్లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు

కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న రష్మిక.. ఆ తర్వాత M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు

చదువులో అగ్రస్థానంలో నిలిచిన రష్మిక మొదట మోడలింగ్ షోలలో పనిచేయడం ప్రారంభించింది. అలా ఒక షోలో ఆమెను చూసిన రక్షిత్ శెట్టి 'కిరిక్ పార్టీ' సినిమాలో ఎలాంటి ఆడిషన్ లేకుండానే ఛాన్స్ ఇచ్చాడు

నాన్నకు వ్యాపారంలో నష్టాలు రావడంతో ఎలాగైనా కుటుంబానికి సపోర్ట్గా నిలబడాలని ధైర్యంగా మోడలింగ్లో ఆడుగుపెట్టింది

'కిరిక్ పార్టీ'తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక రూ. 1.50 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఆ తర్వాత ఛలో సినిమాకు రూ. 50 లక్షలు అందుకున్నారని టాక్.

ప్రస్తుతం రష్మిక ఒక సినిమా కోసం రూ. 12 కోట్ల వరకు తీసుకుంటుంది

23 ఏళ్లకే కోటీశ్వరురాలిగా మారిన రష్మికకు బెంగళూరు, కూర్గ్, గోవా, హైదరాబాద్, ముంబై సహా నగరాల్లో ఇళ్లు ఉన్నాయట

పుష్ప సినిమా తర్వాత ఆమె కెరీయర్ ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్కు చేరుకుంది

28 సంవత్సరానికి గుడ్ బై చెప్పి 29వ ఏట అడుగు పెడుతున్న రష్మికకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఆమెపై డీప్ ఫేక్ వంటి వీడియోలు ఎదురైనా బలంగా నిలబడి సత్తా చాటింది





