కమ్మేసిన పొగమంచు...భారీగా ట్రాఫిక్‌ జామ్‌

traffic jam due to foggy weather - Sakshi

సాక్షి, విజయనగరం:  విజయనగరం జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం 9 గంటలైనా వాహనాలు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి. ఫలితంగా జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

Read latest Vizianagaram News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top