బస్సు - రైలు ఢీ: 16 మంది మృతి | Train-bus collision kills 16 in Mexico | Sakshi
Sakshi News home page

బస్సు - రైలు ఢీ: 16 మంది మృతి

Feb 14 2015 10:56 AM | Updated on Sep 2 2017 9:19 PM

అమెరికా - మెక్సికో దేశ సరిహద్దు ప్రాంతంలోని అన్నాహాక్ పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఘోరం చోటు చేసుకుంది.

మెక్సికో:  అమెరికా - మెక్సికో దేశ సరిహద్దు ప్రాంతంలోని అన్నాహాక్ పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఘోరం చోటు చేసుకుంది. కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే ట్రాక్ దాటుతున్న బస్సును రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగ్రాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దుర్ఘటన స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement