తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో గల తిరుపూర్లో ఓ టీనేజి యువతిపై అత్యాచారం చేసి ఆమెను హతమార్చారు.
తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో గల తిరుపూర్లో ఓ టీనేజి యువతిపై అత్యాచారం చేసి ఆమెను హతమార్చారు. ఈ కేసులో పొల్లాచ్చి జిల్లాలోని ఓ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ను అరెస్టు చేశారు. అరుణ్ కుమార్ అనే ఆ వ్యక్తి 17 ఏళ్ల అమ్మాయి వెల్లియంపాల్యంలోని తన ఇంట్లో ఒంటరిగా ఉండగా ఆమెపై అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో ఆ యువతి గట్టిగా అరిచేందుకు ప్రయత్నించడంతో అతడు ఆమె గొంతు నొక్కేశాడని, దాంతో ఆమె ఊపిరాడక మరణించిందని పోలీసులు చెప్పారు. నిందితుడు అక్కడి నుంచి పారిపోబోతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడిని పోలీసులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా, అతడిని కస్టడీకి పంపుతూ రిమాండు విధించారు.