ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు | sensex opens with flat note | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

Feb 8 2017 9:24 AM | Updated on Oct 4 2018 4:27 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 18పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో ప్రారంభ మయ్యాయి.  అనంతరం కొద్దిగా   తేరుకుని ప్రస్తుతం సెన్సెక్స్‌ 22 పాయింట్లు బలపడి 28,357వద్ద  నిఫ్టీ 7 పాయింట్లు పెరిగి 8,775 వద్ద ట్రేడవుతోంది. ముఖ్యంగా  ఆర్‌బీఐ  మానిటరీ పాలసీ రివ్యూకోసం  మార్కెట్లు వేచి చూస్తున్నాయి.  రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటనపై బ్యాంకింగ్‌ నిఫ్టీ మూవ్‌ ఆధారపడనుంది.  అలాగే ఫలితాల నేపథ్యంలో టాటా స్టీల్‌  పాజిటివ్‌గా గాను, ఇన్ఫోసిస్‌ టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ ల మధ్య విభేదాల వార్తల నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ నెగిటివ్‌గా స్పందిస్తోంది. అటు సన్‌ టీవీ వరుసగా లాభాలను ఆర్జిస్తోంది. మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సెక్టార్‌ యాక్టివ్‌ గా ఉంది.  టైటన్‌, సీబీజెడ్‌ లాంటి   బంగారం షేర్లు మెరుపులు మెరిపిస్తున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement