మునిసిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు జీతాలు తొలుత రూ.1,000 పెంచుతామని రాష్ట్ర మంత్రి మహేందర్రెడ్డి హామీ ఇచ్చారు.
తాండూరు (రంగారెడ్డి): మునిసిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు జీతాలు తొలుత రూ.1,000 పెంచుతామని రాష్ట్ర మంత్రి మహేందర్రెడ్డి హామీ ఇచ్చారు. జీతాల పెంపు డిమాండ్తో గత నెలరోజులకు పైగా కార్మికులు సమ్మె చేస్తుండడంతో... మంగళవారం రంగారెడ్డి జిల్లా తాండూరు మునిసిపల్ కార్యాలయంలో అత్యవసర సమావేశం జరిగింది.
దీనికి మంత్రి మహేందర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు తొలుత రూ.1,000 మేర జీతం పెంచుతామని, తర్వాత మరికొంత పెంచుతామని సమ్మె విరమించాలని కోరారు. కార్మికులకు ప్రస్తుతం రూ.8,300 జీతం వస్తుండగా... దాన్ని కనీసం రూ.12 వేలకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.