హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) సంస్థాగత నిబంధనల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు రెండేళ్లకోసారి రాష్ట్ర అధ్యక్షుడి నియామకం జరుగుతుండగా, ఇకపై ఆ కాలపరిమితిని నాలుగేళ్లకు పెంచారు. జిల్లా కమిటీలను పూర్తిగా రద్దుచేశారు. ఇక జిల్లా కమిటీల బదులు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కమిటీలు మాత్రమే కొనసాగుతాయి. ఈ కమిటీల కాలపరిమితి కూడా నాలుగేళ్లకు పెంచారు. ఈ నిర్ణయాలను టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కొంపల్లి(హైదరాబాద్)లోని జీబీఆర్ గార్డెన్స్లో నిర్వహించిన పార్టీ 16వ ప్లీనరీ వేదికపై ప్రకటించారు. ప్లీనరీ ముగింపు సంసందర్భంగా ప్రసంగించిన కేసీఆర్ విమర్శకులను ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశారు.
’ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తే కేసులు పెడతాం. విపక్షాలు గుడ్డి విమర్శలు మానుకోవాలి. అవినీతిని పెంచిపోషించింది గత ప్రభుత్వాలే. మేం అవినీతిపై యుద్ధం చేస్తున్నాం’అని కేసీఆర్ అన్నారు. ప్లీనరీ ప్రారంభ ఉపన్యాసంలో రైతాంగంపై వరాలు కురిపించిన ముఖ్యమంత్రి.. ముగింపు వ్యాఖ్యల్లోనూ రైతు సంబంధిగత అంశాలను ప్రస్తావించారు. కల్తీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులు ఎంత నష్టపోతే, ఆ మెత్తాన్నీ కంపెనీలు చెల్లించేలా త్వరలో చట్టం రూపొందిస్తామని చెప్పారు. ప్లీనరీ తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని సీఎం తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా 27న వరంగల్లో జరగబోయే భారీ బహిరంగ సభకు అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఎనిమిదోసారి కేసీఆర్.. ఏడు తీర్మానాలు..
టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభానికి ముందే టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల అధికారి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. తద్వారా వరుసగా ఎనిమిదోసారి కేసీఆర్ ఆ పదవిని చేపట్టినట్లైంది. అట్టహాసంగా జరిగిన ప్లీనరీలో మొత్తం ఏడు తీర్మానాలను ఆమోదించారు. వీటిలో సంక్షేమం, బీసీ, ఎంబీసీల అభివృద్ధి, ఎస్సీ ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక, నీటిపారుదల రంగం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తదితర తీర్మానాలున్నాయి.
(చదవండి: రైతన్నలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు!)
(టీఆర్ఎస్ ఉంటుందో లేదో అన్నారు: కేసీఆర్)
టీఆర్ఎస్ నిబంధనల్లో భారీ మార్పులు
Published Fri, Apr 21 2017 5:48 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
Advertisement