‘అరాచకాలు రాజ్యమేలుతున్నాయి’ | Mallikarjun Kharge criticize the PM Narendra Modi | Sakshi
Sakshi News home page

‘అరాచకాలు రాజ్యమేలుతున్నాయి’

May 14 2017 8:01 PM | Updated on Mar 29 2019 9:31 PM

‘అరాచకాలు రాజ్యమేలుతున్నాయి’ - Sakshi

‘అరాచకాలు రాజ్యమేలుతున్నాయి’

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అరాచకాలు రాజ్యమేలుతున్నాయని కాంగ్రెస్‌పక్ష నేత మల్లికార్జునఖర్గె ఆరోపించారు.

బెంగళూరు: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక  అరాచకాలు రాజ్యమేలుతున్నాయని, దేశ సైనికుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోందని లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లికార్జునఖర్గె ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు తగ్గుతున్నా దేశంలో మాత్రం వాటి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని విమర్శించారు. కేంద్ర కేబినెట్‌లో మంత్రులకు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఎటువంటి అధికారం ఇవ్వకుండా ప్రధాని మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారని ఖర్గె విమర్శించారు.

రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను ఐక్యంగా ఎదుర్కొంటామని, గెలుపు సాధించిన అనంతరం ముఖ్యమంత్రి పదవిపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుందని  తెలిపారు. కేపీసీసీ కొత్త అధ్యక్షుని నియామకంపై ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, కేపీసీసీ కొత్త అధ్యక్షుడు ఎవరనేది పార్టీ సీనియర్‌ నేతలు తీర్మానిస్తారన్నారు. కేపీసీసీ అధ్యక్ష పదవి కోసం తాను ఎప్పుడూ పోటీ పడలేదని, అధ్యక్ష పదవి కోసం లాబీయింగ్‌లు చేయాల్సిన అవసరం తనకు లేదని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement