టెస్ట్‌ సిరీస్‌: ఈ భారీ రికార్డులు మీకు తెలుసా? | India vs England, do you know these records | Sakshi
Sakshi News home page

టెస్ట్‌ సిరీస్‌: ఈ భారీ రికార్డులు మీకు తెలుసా?

Dec 21 2016 9:45 AM | Updated on Aug 20 2018 9:35 PM

టెస్టు సిరీస్‌లో ఎన్నో మెరుపులు, మరెన్నో రికార్డులో కోహ్లి సేన సొంతం చేసుకుంది. అవి..


న్యూఢిల్లీ:
ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌లో విరాట్‌ సేన అసమాన పోరాటపటిమ కనబరిచి.. 4-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో ఎన్నో మెరుపులు, మరెన్నో రికార్డులో కోహ్లి సేన సొంతం  చేసుకుంది. అవి..

  • టెస్టుల్లో భారత్‌ తన అత్యధిక స్కోరును ఈ సిరీస్‌లోనే సాధించింది. చెన్నైలో ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 759/7 పరుగులు చేయడం ద్వారా ఈ ఘనత సొంతం చేసుకుంది.
     
  • కరుణ్‌ నాయర్‌ చెన్నై టెస్టులో ట్రిపుల్‌ సెంచరీ కొట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డు సొంతం చేసుకున్నాడు. అతని అసాధారణ బ్యాటింగ్‌తో టీమిండియా టెస్టుల్లో తన అత్యధిక స్కోరు రికార్డును సాధించగలిగింది.
     
  • ఒకే సంవత్సరం మూడు డబుల్‌ సెంచరీలు సాధించిన మొదటి టీమిండియా కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి రికార్డు సృష్టించాడు. ముంబైలో జరిగిన నాలుగో టెస్టులో కోహ్లి  235 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
     
  • ఈ సిరీస్‌లో కోహ్లి చేసిన వ్యక్తిగత పరుగులు 655. ఒక టెస్టు సిరీస్‌లో 600కుపైగా పరుగులు కోహ్లికి ఇది రెండోసారి. సునీల్‌ గవస్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్‌గా కోహ్లి రికార్డు పుటల్లోకి ఎక్కాడు.
     
  • రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈ సిరీస్‌లో 25 వికెట్లు, 250కిపైగా పరుగులు చేయడం ద్వారా.. ఈ ఘనత సాధించిన రెండో భారత ఆల్‌రౌండర్‌గా చరిత్ర సృష్టించాడు. అతను ఈ సిరీస్‌లో 306 పరుగులు చేయడమే కాదు, 28 వికెట్లు పడగొట్టాడు.
     
  • వందేళ్ల  టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇద్దరు ఆటగాళ్లు 20కిపైగా వికెట్లు పడగొట్టడం, రెండు అంతకుమించి అర్ధసెంచరీలు సాధించడం ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించిన అరుదైన క్రికెటర్లుగా అశ్విన్‌, రవీంద్ర జడేజా నిలిచారు.
     
  • టెస్టు క్రికెట్‌లో మూడువేల పరుగులు మైలురాయిని దాటిన 20వ క్రికెటర్‌గా చటేశ్వర్‌ పూజారా, 21వ క్రికెటర్‌గా మురళీవిజయ్‌ నిలిచారు.
     
  • టెస్టుల్లో 4000వేల పరుగుల మైలురాయిని దాటిన 14వ భారత బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ కోహ్లి నిలిచాడు.
     
  • ఇంగ్లండ్‌ జట్టుపై భారత్‌కు ఇదే అతిపెద్ద సిరీస్‌ విజయం. 1993లో అజారుద్దీన్‌ కెప్టెన్సీలో టీమిండియా ఇంగ్లండ్‌ చేతిలో వైట్‌వాష్‌ ఎదుర్కొంది.
     
  • 2008 తర్వాత ఇంగ్లండ్‌పై భారత్‌ సాధించిన తొలి టెస్టు సిరీస్‌ విజయం కూడా ఇదే. ఆ తర్వాత జరిగిన మూడు టెస్టు సిరీస్‌లలోనూ భారత్‌ ఇంగ్లండ్‌ చేతిలో ఓటమిపాలైంది.
  • 140 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 55 బంతుల్లో 51 పరుగులు చేసి, పది వికెట్లు తీసుకొని, నాలుగు క్యాచ్‌లు అందుకున్నతొలి క్రికెటర్‌గా జడేజా అద్భుతమైన రికార్డు సాధించాడు.

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement