పీసీ అమ్మకాలు 8 శాతం వృద్ధి | India PC sales up 8% to 3.24 million units | Sakshi
Sakshi News home page

పీసీ అమ్మకాలు 8 శాతం వృద్ధి

Nov 26 2013 2:43 AM | Updated on Sep 2 2017 12:58 AM

ల్యాప్‌టాప్‌ల విక్రయాల జోరు కారణంగా భారత్‌లో పర్సనల్ కంప్యూటర్లు అమ్మకాలు పెరుగుతున్నాయి.

 న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌ల విక్రయాల జోరు కారణంగా భారత్‌లో పర్సనల్ కంప్యూటర్లు అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ కాలంలో 32 లక్షల పీసీలు అమ్ముడయ్యాయని, 8 శాతం వృద్ధి నమోదైందని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ, గార్ట్‌నర్ తెలిపింది. ప్రభుత్వం నుంచి భారీగా ఆర్డర్లు రావడం, ల్యాప్‌టాప్ అమ్మకాలు అధికంగా ఉండడం దీనికి ప్రధాన కారణాలని పేర్కొంది. కాగా జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు భారత్‌లో పీసీ అమ్మకాలు 8.3 శాతం పెరిగాయని మరో అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ పేర్కొంది. విద్య సంబంధిత ప్రాజెక్టుల నిమిత్తం వాణిజ్యపరమైన అమ్మకాలు అధికం కావడం దీనికి కారణమని వివరించింది. వ్యయ నియంత్రణకై కంపెనీలు ఖర్చులకు కళ్లెం వేసినప్పటికీ, స్కూళ్లు ప్రారంభం కావడం, ఓనమ్ పండుగ తదితర కారణాల వల్ల పీసీల అమ్మకాలు పెరిగాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement