రోడ్డు ప్రమాదంలో 8 మంది తెలుగువారు మృతి | eight telugu people killed in solapur road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో 8 మంది తెలుగువారు మృతి

Oct 7 2014 10:10 AM | Updated on Aug 30 2018 3:56 PM

మహారాష్ట్రలోని షోలాపూర్ లో సమీపంలోని పండరీపురంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది తెలుగువారు మృత్యువాత పడ్డారు.

షోలాపూర్: మహారాష్ట్రలోని షోలాపూర్ లో సమీపంలోని పండరీపురంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది తెలుగువారు మృత్యువాత పడ్డారు. గాయత్రి ట్రావెల్స్ కు చెందిన బస్సు బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. షిరిడీ నుంచి విజయవాడకు తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కల్వర్ట్ ను ఢీకొనడంతో బస్సు బొల్తాపడింది.

ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలతో సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులు కృష్ణా జిల్లా చిలకలపూడి చుట్టుపక్కల గ్రామస్థులుగా గుర్తించారు. గాయపడిన 20 మందిని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మందిపైగా ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement