శ్రీనగర్‌లో 38 చోట్ల రీ పోలింగ్ | EC Orders Repoll at 38 Polling Stations in Srinagar Constituency | Sakshi
Sakshi News home page

శ్రీనగర్‌లో 38 చోట్ల రీ పోలింగ్

Apr 11 2017 8:22 PM | Updated on Aug 14 2018 4:34 PM

శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఈ నెల 13న 38 పోలింగ్ స్టేషన్లలో రీ పోలింగ్ నిర్వహించనున్నారు.

న్యూఢిల్లీ: శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఈ నెల 13న 38 పోలింగ్ స్టేషన్లలో రీ పోలింగ్ నిర్వహించనున్నారు. మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం జరిగిన శ్రీనగర్ ఉప ఎన్నికల్లో భారీగా హింస, అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే.

కాల్పుల్లో ఎనిమిది మంది పౌరులు మరణించగా, 100 మందికి పైగా భద్రత సిబ్బంది గాయపడ్డారు. ఈ ఎన్నికల్లో 6.5 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. గత మూడు దశాబ్దాలలో ఇదే అతి తక్కువ ఓటింగ్. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల నుంచి నివేదికలు తెప్పించుకున్న ఈసీ 38 పోలింగ్ స్టేషన్ల పరిధిలో రీ పోలింగ్‌ నిర్వహించాలని జమ్ము కశ్మీర్ ఎన్నికల సంఘం అధికారిని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement