దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది: ప్రధాని | Country faced with difficult economic situation: Prime Minister Manmohan Singh | Sakshi
Sakshi News home page

దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది: ప్రధాని

Aug 29 2013 11:53 AM | Updated on Sep 1 2017 10:14 PM

దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది: ప్రధాని

దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది: ప్రధాని

ప్రస్తుత ఆర్థిక పరిస్థితితో దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోందని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు.

ప్రస్తుత ఆర్థిక పరిస్థితితో దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోందని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఆర్థిక మందగమనానికి దేశీయ పరిస్థితులు కొంతవరకు కారణమని ఆయన పేర్కొన్నారు. దీన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని రాజ్యసభలో అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో రేపు ప్రకటన చేస్తామని ప్రధాని చెప్పారు.

మరోవైపు డాలర్తో రూపాయి మారకం విలువ పతనంపై లోక్సభ దద్దరిల్లింది. రూపాయి పతనంపై ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టడంతో సభా కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో సభను స్పీకర్ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. గత కొద్ది రోజులుగా రూపాయి భారీగా పతనమవుతూ వస్తోంది. నిన్న ఆల్‌టైమ్ కనిష్టం... 68.80కి కుదేలయింది.

Advertisement
 
Advertisement
Advertisement