మరో మూడు మృతదేహాలు లభ్యం | Beas tragedy, Three more bodies recovered | Sakshi
Sakshi News home page

మరో మూడు మృతదేహాలు లభ్యం

Jun 20 2014 2:27 AM | Updated on Sep 2 2017 9:04 AM

హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. బుధవారం రాత్రి శివప్రకాశ్ వర్మ, గురువారం మధ్యాహ్నం ఆశిష్‌మంథా, అఖిల్‌ల మృతదేహాలు దొరికాయి.

సాక్షి, హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. బుధవారం రాత్రి శివప్రకాశ్ వర్మ, గురువారం మధ్యాహ్నం ఆశిష్‌మంథా, అఖిల్‌ల మృతదేహాలు దొరికాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం 12 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 12మంది మృతదేహాల కోసం గాలింపు ముమ్మరం చేశారు. శివప్రకాశ్ వర్మది కూకట్‌పల్లి, ఆశిష్ మంథా సికింద్రాబాద్, అఖిల్ దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన వాసులుగా గుర్తించారు. వీరి మృతదేహాలు శుక్రవారం ఉదయం విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంటాయని అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న రవాణామంత్రి మహేందర్‌రెడ్డి, అదనపు డీజీ రాజీవ్ త్రివేదిలు ‘సాక్షి’కి తెలిపారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement