ఎయిర్ ఏషియా మరో ప్రమోషనల్ ఆఫర్

ఎయిర్ ఏషియా మరో ప్రమోషనల్ ఆఫర్


న్యూఢిల్లీ : బడ్జెట్ క్యారియర్  ఎయిర్‌ ఏషియా ఇండియా కొత్త ఆఫర్‌ను ప్రకటించింది.తన కొత్త  ప్రమోషనల్  స్కీంలో భాగంగా తగ్గింపు ధరల ఆఫర్‌ కింద  విమాన టిక్కెట్లను రూ.899లకే ( అన్నీ కలుపుకొని)  అందుబాటులో ఉంచింది. అక్టోబర్‌ 23తో  ముగియనున్న ఈ ఆఫర్ కింద  బుక్ చేసుకున్న టికెట్లు  2017 మార్చి  31 మధ్య ప్రయాణాలకు వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది.  రూ. 899 ధరలు గౌహతి-ఇంఫాల్‌ మధ్య ప్రయాణానికి వర్తించనున్నట్టు తెలిపింది.


అలాగే ఈ ఆఫర్  కింద కొచ్చి- బెంగుళూరు టిక్కెట్టు ధర రూ.999ల నుంచి ప్రారంభమవుతాయి. కొచ్చి-హైదరాబాద్ 2,699గా, గోవా-  రూ.3199గా, జైపూర్ - పుణే రూ. 2399 గా  ఉండనున్నాయి.


మరిన్ని వివరాలు  ఎయిర్ ఏషియా వెబ్ సైట్ లో..

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top