పాముకాటుతో యువతి మృతి

Young Women Died By Snake Byte - Sakshi

నారాయణపేట : ఇంట్లో ఉన్న ఓ పాము వ స్తువులు తీసుకునేందు కు ప్రయతించిన బాలికను కాటు వేయడంతో మృతిచెందింది. ఈ సం ఘటన మండలంలోని తిర్మలాపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తిమ్మ ప్ప రెండో కుమార్తె గోవిందమ్మ(20) ఆదివారం ఉదయం ఇంట్లో వస్తువులను తీసుకు నేందుకు అల్మారాలో చేయి పెట్టింది.

అయితే అందులో ఉన్న పాము చేతికి కాటువేయడంతో కేకలు వేసింది. గమనించిన తాతయ్య చుట్టుపక్కల వారిని పిలిచి వెంటనే కోటకొండ ఆస్పత్రికి.. అక్కడి నుంచి నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్‌లో జిల్లాకేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. తల్లిదండ్రులు పొట్టకూటీ కోసం హైదరాబాద్‌లో వలస కూలీలుగా పనిచేస్తున్నారు.

సమాచారం అందడంతో వారు ఆదివారం సాయంత్రం ఇంటికి చేరుకొని బిడ్డను చూసి కన్నీరుమున్నీరయ్యారు. బాలిక పేటలోని స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతుంది. సమాచారం అందుకున్న కళాశాల యాజమాన్యం, విద్యార్థులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నిరుపేద విద్యార్థిని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, విద్యార్థులు కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top