వైద్యం వికటించి బాలింత మృతి | Woman dies due to Medical negligence | Sakshi
Sakshi News home page

వైద్యం వికటించి బాలింత మృతి

Jun 28 2015 9:20 AM | Updated on Oct 9 2018 7:52 PM

శిశువును ప్రసవించిన 24 గంటలకే వైద్యం వికటించి ఓ బాలింత మృతి చెందింది.

కొత్తగూడెం అర్బన్ (ఖమ్మం) : శిశువును ప్రసవించిన 24 గంటలకే వైద్యం వికటించి ఓ బాలింత మృతి చెందింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన పెద్ది కుమారి(23) నెలలు నిండి నొప్పులు వస్తుండడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఈ నెల 26న కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదే రోజు కుమారి మగ శిశువుకు జన్మనిచ్చింది.

అయితే ప్రసవం తర్వాత ఆమె పరిస్థితి విషమంగా మారడంతో శనివారం ఆమెను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి ఆమె మృతి చెందింది. కాగా కొత్తగూడెంలోని వైద్యుల నిర్లక్ష్యమే కుమారి మృతికి దారితీసిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement