♦ గోవాలో హోటల్ రూమ్ బుకింగ్ కోసం రూ.21వేలు బదిలీ
♦ సైబర్ పోలీసులకు బాధితుని ఫిర్యాదు
♦ మాదాపూర్లో యువతి అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: ఫేస్బుక్ ద్వారా యువకులతో పరిచయాలు పెంచుకొని వారి అవసరాలను ఆసరగా చేసుకొని డబ్బులు లాగుతూ మోసం చేస్తున్న ఓ యువతిని నగర సైబర్ క్రైమ్స్ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ టీమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సెల్ఫోన్, రూ.మూడు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ అవినాశ్ మహంతి కథనం ప్రకారం...మూసాబౌలికి చెందిన శుభమ్ గుప్తాకు ఫేస్బుక్లో వినమ్రత గోమ్స్ అనే యువతితో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. ఈ సమయంలో ఆమె గోవాలో ఉన్నట్టుగా చాట్ ద్వారా తెలుసుకున్నాడు.
ఏప్రిల్ నెలలో గోవా టూర్కు వెళ్లాలనుకున్న శుభమ్ గుప్తా అక్కడ హోటల్లో ఉండేందుకు వినమ్రత సహాయాన్ని అడిగాడు. ఆమె వెంటనే హోటల్ రూమ్ అద్దెకు ఇప్పిస్తానని చెప్పడంతో 21,000లు ఆమె బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశాడు. ఆ తర్వాత హోటల్ నుంచి రూమ్ బుకింగ్కు సంబంధించి ఎటువంటి సమాచారం అందకపోవడంతో వినమ్రతకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు నగర సైబర్ క్రైమ్ సెల్ను ఆశ్రయించడంతో కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఆమె ఫేస్బుక్ ఐడీ, సెల్ నంబర్ల ఆధారంగా నిందితురాలు మాదాపూర్లో ఉంటున్నట్లుగా గుర్తించి బుధవారం అరెస్టు చేశారు. గతంలో గోవా, పుణేలోని హోటళ్లలో పనిచేసిన వినమ్రత ప్రస్తుతం జూబ్లీహిల్స్లోని హైలైఫ్ రెస్టారెంట్లో పనిచేస్తోంది. ఫేస్బుక్లో యువకులతో పరిచయాలు పెంచుకొని వారిని నమ్మించి డబ్బులు లాగుతున్నట్లు పోలీసు విచారణలో తేలింది. ఈమెపై ఇప్పటికే మాదాపూర్ పోలీసు స్టేషన్లోనూ కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఫేస్ బుక్కయ్యాడు
Published Thu, May 11 2017 4:37 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement