రూ. 2లక్షల రుణమాఫీ చేస్తాం  | We Pay Two Lakhs Of Loan Money | Sakshi
Sakshi News home page

రూ. 2లక్షల రుణమాఫీ చేస్తాం 

Nov 14 2018 6:59 PM | Updated on Mar 29 2019 9:07 PM

 We Pay Two  Lakhs Of  Loan Money   - Sakshi

మదన్‌పల్లిలో మాట్లాడుతున్న వినయ్‌రెడ్డి

సాక్షి,మాక్లూర్‌ (నిజామాబాద్‌): రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏక కాలంలో రూ. 2లక్షల రుణా మాఫీ చేస్తామని ఆర్మూర్‌ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వి నయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మదన్‌పల్లి, సట్లాపూర్‌తాండ, మదన్‌పల్లి క్యాంపు, అమ్రాద్‌తాండ, ఒ డ్యాట్‌పల్లి, ముత్యంపల్లి గ్రామాల్లో మంగళవారం ఆయన ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు ఒరిదిందేమిలేదన్నారు. బీజేపీతోని దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు  గ్రామాల్లో డ్రెయినేజీలు, సీసీరోడ్లు నిర్మిస్తామన్నారు.  

టీఆర్‌ఎస్‌ పార్టీని నమ్మవద్దన్నారు. గత నాలుగునర ఏళ్లలో అ భివృద్ధి ఎక్కడ జరుగలేదన్నారు. ఆరు గ్రామాల్లో ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. గిరిజన మహిళలు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ముప్పడి గంగారెడ్డి, గంగోని సంతోష్, భోజారావు, షబ్బీర్, మురళీ, అనన్యరెడ్డి, తార చంద్, గంగోని రాజు, అంబునాయక్, దేవన్న, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement