వరంగల్: ఓటుహక్కుకోసం కదిలొచ్చారు...
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్
యువతకు స్ఫూర్తి నింపేలా తరలి వచ్చిన వృద్ధులు, దివ్యాంగులు..
ముమ్మర ఏర్పాట్లు చేసిన అధికారులు, బందోబస్తు నిర్వహించిన పోలీసులు
సాక్షి, వరంగల్: ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు.. దానిని బాధ్యతతో వినియోగించుకోవాలనే విషయాన్ని ప్రజలు పాటించారు.. ఓటును వినియోగించుకునేందుకు ప్రజలు కదిలొచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నేటి యువతలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపేలా పెద్ద సంఖ్యలో దివ్యాంగులు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. కర్రలు, వీల్ చైర్ల సాయంతో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఎలక్షన్ అధికారులు ఓటర్లకు అన్ని విధాల సహకరిస్తూ వారి సందేహాలను తీర్చారు. ఓటు వినియోగించే పద్ధతిని వివరించారు.