చేర్యాల మఖ్‌మల్ కోర్ చున్నీపై ఏఎస్పీ విచారణ | trial will eespi on core activities makhmal | Sakshi
Sakshi News home page

చేర్యాల మఖ్‌మల్ కోర్ చున్నీపై ఏఎస్పీ విచారణ

Sep 7 2015 2:03 AM | Updated on Sep 3 2017 8:52 AM

మండల కేంద్రంలో మొగల్ కాలంలోని సంపద తల్లిదండ్రులు వారసత్వంగా ఫాతిమున్నీసాబేగంకు ఇచ్చిన సుమారు 40 వేల .....

చేర్యాల: మండల కేంద్రంలో మొగల్ కాలంలోని సంపద తల్లిదండ్రులు వారసత్వంగా ఫాతిమున్నీసాబేగంకు ఇచ్చిన సుమారు 40 వేల వజ్రాలతో ఉన్న మఖ్‌మల్‌కోర్ చున్నీ వ్యవహారం గత ఏడాది వెలుగు చూసిన విషయం తెలిసిందే.

చేర్యాలకు చెందిన ఫాతిమున్నీసాబేగంకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమార్తె ఇటీవల వారసత్వ సంపదలో తనకు భాగం ఉంటుందని పోలీసులను ఆశ్రరుుంచడంతో ఆదివారం రాత్రి వరంగల్ ఏఎస్పీ జాన్‌వెస్లి చేర్యాలలో విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. పలు విషయూలపై ఆరాతీశారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement