బదిలీల కౌన్సెలింగ్ పారదర్శకంగా జరగాలి | Transfer counseling should be transparent | Sakshi
Sakshi News home page

బదిలీల కౌన్సెలింగ్ పారదర్శకంగా జరగాలి

Jul 5 2015 11:55 PM | Updated on Sep 3 2017 4:57 AM

జిల్లా కేంద్రంలో త్వరలో నిర్వహించనున్న ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ పారదర్శకంగా నిర్వహించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

 రామగిరి : జిల్లా కేంద్రంలో త్వరలో నిర్వహించనున్న ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ పారదర్శకంగా నిర్వహించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పన్నాల గోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక టీపీటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుల నుంచి ఫిర్యాదులను కౌన్సెలింగ్ కంటే ఒకరోజు ముందే స్వీకరించాని, ఫైనల్ లిస్ట్ ప్రకటించిన తర్వాత మార్పులు-చేర్పులు చేయరాదన్నారు. స్పౌజ్ ప్రాధాన్యం కలిగిన ఉపాధ్యాయుల విషయంలో నిబంధనల ప్రకారం మాత్రమే కౌన్సెలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. 30వ తేదీ జూన్ 2015 వరకు విద్యార్థుల సంఖ్య ప్రకారం సక్సెస్ పాఠశాలలు కొనసాగించాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలో రేషనలైజేషన్ గుర్తించిన తర్వాత ఆ పాఠశాలలో ప్రమోషన్ పొందిన ఎస్జీటీని సర్ప్‌లెస్‌గా గుర్తించాలన్నారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పుప్పాల రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఆర్.రాంనర్సయ్య, కె.యల్లారెడ్డి, ఎం.వెంకట్‌రెడ్డి, కె.రత్నయ్య, పి.ముత్తయ్య, బుచ్చిరెడ్డి, సైదులు, దుర్గాప్రసాద్, భిక్షం, వీరన్న, అంజయ్య పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement