ట్రాక్టర్‌ బోల్తా..ముగ్గురి మృతి | tractor roll over 3died. | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తా..ముగ్గురి మృతి

Jun 19 2017 5:30 PM | Updated on Aug 30 2018 4:10 PM

ట్రాక్టర్‌ బోల్తా..ముగ్గురి మృతి - Sakshi

ట్రాక్టర్‌ బోల్తా..ముగ్గురి మృతి

చిన్నంబావి మండలం వెలుగొండలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది.

చిన్నంబావి: చిన్నంబావి మండలం వెలుగొండలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. విద్యుత్‌ స్తంభాలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌ ట్రాలీపై కూర్చున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.

మృతులు వెలుగొండ గ్రామానికి చెందిన చిన్నరాములు(42), ముస్టి రాములు(45), బయ్య హుసేనయ్య(47)లుగా గుర్తించారు. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఘటన అనంతరం డ్రైవర్‌ పరారయ్యాడు. గ్రామానికి చెందిన గోపాల్‌ రెడ్డి అనే రైతు పొలానికి స్తంభాలు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement