ఇదే తొలిసారి  | Sakshi
Sakshi News home page

ఇదే తొలిసారి 

Published Fri, Jan 12 2018 1:04 AM

Thousands of sweets on the same platform: Chandulal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజధానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించేలా ఒకే వేదికపై 1,000 రకాల స్వీట్లను ప్రదర్శించటం ప్రపంచంలోనే తొలిసారని పర్యాటక, సాంస్కృతిక మంత్రి అజ్మీరా చందూలాల్‌ తెలిపారు. శనివారం నుంచి సోమవారం వరకు మూడ్రోజులపాటు సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే ఈ ఫెస్టివల్‌లో స్వీట్ల అమ్మకాల కోసం కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు.

గురువారం సచివాలయంలో మంత్రి చందూలాల్, పర్యాటక కార్యదర్శి బుర్రా వెంకటేశం కలసి ఇంటర్నేషనల్‌ కైట్, స్వీట్‌ ఫెస్టివల్‌ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement